Thursday 31 August 2023

Cannabis






 


















1. 1. One hectare of cannabis releases as much oxygen as 25 hectares of forest. Hemp in 4 months and trees in 20-50 years.

2. 2. One hectare of cannabis gives 4 hectares of jungle as much as paper.
3. Trees make recyclable paper 3 times while cannabis makes recycled paper 8 times. 4. Hemp paper is the best and most durable.
5. Cannabis plants are a radiation trap. Cannabis plants purify the air.
Vo)) LTE2
6. Cannabis can grow anywhere in the world, it needs water a lot. Also, because it can save itself from parasite, it doesn't need pesticides.
7. Hemp Textile showcases flax products on their own properties.
48%
8. Hemp is an ideal plant for production of edges, ropes, bags, shoes, hats...
9. Cannabis is banned in Bulgaria. But technical cannabis does not have a medicine and can be cultivated independently.
10. The protein value of hemp seeds is very high and the two fatty acids contained in it are nowhere else in nature.
11. Cannabis production is much cheaper than soy.
12. Animals that eat cannabis don't need hormone supplements.
13. All plastic products can be made with hemp, hemp plastic is environmentally friendly and completely biodegradable.
14. Cannabis can also be used for buildings thermal insulation, it's durable, affordable and flexible.
15. Cannabis soaps and hemp cosmetics do not pollute water, therefore they are completely environmentally friendly.

 ఆరుద్ర గారి జయంతి సందర్భంగా


కవి, విమర్శకుడు, సాహిత్య చరిత్రకారుడు, సామాజిక శాస్త్రవేత్త,అంత్య ప్రాసల ముద్ర ఆరుద్ర' అనే నానుడి తెచ్చుకున్న ఆరుద్ర గారి జయంతి సందర్భంగా.....


【 #ఆధునిక ఆంద్ర సాహిత్య చరిత్రలో ఒక సముచిత స్థానాన్నిసంపాదించుకున్న మహానుభావుడు. ఇతను 'ఆరుద్ర' కాడు, 'ఆరో రుద్రుడు' అని శ్రీశ్రీ చేత అనిపించుకొన్న ధన్యజీవి.#】

" తరానికో వంద కవులు.. తయారవుతారెప్పుడూ
వందనూ మందలోనూ... మిగలగలిగేదొక్కడు''...

అంటూ తన మాటల్లోనే #అభ్యుదయ కవిత్వోద్యమంలో నిలదొక్కుకుని, ఆ తరంలో మిగలగలిగిందీ, విశ్వరూపం దాల్చిందీ ఒక్కడే. ఆ ఒక్కడే "#కళాప్రపూర్ణ డిగా సాహితీప్రియుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిన ఆదర్శనీయుడు "ఆరుద్ర". ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఒక అపూర్వమైన, అరుదైన సంఘటన ఏదంటే.. #ఆరుద్ర అనే ఒక సామాన్యుడు అసామాన్యుడుగా ఎదిగి, ఒక ఇతిహాసంగా రూపొందడమే.

కవి, విమర్శకుడు, సాహిత్య చరిత్రకారుడు, సామాజిక శాస్త్రవేత్త, మార్క్సిస్టు మేధావి.. ఇలా అన్నింటినీ మించి ఒక మంచి మానవుడు, సహృదయుడు, స్నేహశీలి అయిన ఆరుద్ర జీవితప్రస్థానం ఒక ఇతిహాసం, ఒక సాహిత్య సాంస్కృతిక సుదర్శనం. అభ్యుదయ కవులలో శ్రీశ్రీ మొదటి తరానికి చెందితే, ఆరుద్ర రెండవ తరానికి చెందినవాడు, ఒకే ఒక్కడు.

#ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. 1925వ సంవత్సరం ఆగస్టు 31వ తేదీన వెంకట జోగమ్మ, భాగవతుల నరసింగరావు దంపతులకు జన్మించారు. ఆరుద్ర ఒక నక్షత్రం పేరు. ఒక పురుగు పేరు కూడా. వర్షకాలంలో నేల పరిచిన పచ్చటి తివాసీలా ఉన్నప్పడు, ఎర్రగా ముఖమల్‌లా మెత్తగా మెరుస్తూ నేలపై నడయాడే అందమైన పురుగు ఆరుద్ర. చిన్నప్పడు ఆరుద్ర కూడా ఆ పురుగులాగే ఎర్రగా, బొద్దుగా, చూడముచ్చటగా ఉంటే, స్నేహితులు అతనికి వెటకారంగా పెట్టిన పేరే స్థిరపడింది. సాహిత్యలోకానికి ఆయన ఆరుద్రగానే పరిచయమయ్యారు.

ఏ.వీ.ఎన్‌ హైస్కూల్‌లో, తరువాత విజయనగరంలోని యం.ఆర్‌.కళాశాలలో తన విద్యాభ్యాసాన్ని పూర్తిచేశారు. 1934-47 మధ్యకాలంలో రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌లో గమస్తాగా పనిచేశారు. చిన్నప్పటినుండి సంగీతంపట్ల మక్కువ ఉన్న ఆరుద్ర ఉద్యోగం వదిలేసి కొంతకాలం సంగీతం నేర్చుకున్నారు. ఆ తరువాత ఆయన దృష్టి సాహిత్యం వైపు మళ్ళింది. 1947-48 మధ్యకాలంలో మద్రాసు నుండి వెలువడిన ‘ఆనందవాణి’ పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు.

ఆ పత్రికలో శ్రీశ్రీతో పాటుగా ఎన్నో కవితలను వ్రాశారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు ఆరుద్ర. ఆయన రచనల్లో మార్క్సిస్టు భావజాలం ఉండడాన్ని బట్టి ఆరుద్రపై శ్రీశ్రీ రచనల ప్రభావం ఉందని పలువురు సాహితీ వేత్తలు అంటుంటారు. 1946లో ఆరుద్ర చాలా కష్టాలు అనుభవించారు. తినడానికి తిండికూడా లేక మద్రాసులోని "పనగళ్ పార్కు"లో నీళ్ళు తాగి పడుకున్నారు. అయినా ఇవేమీ ఆయన సాహిత్యసేవకు అడ్డురాలేదు.

కేవలం సినిమా పాటలేకాదు, గేయాలు, గేయనాటికలు, కథలు, నవలలు, సాహిత్య పరిశోధక వ్యాసాలు, వ్యంగ్య రచనలు ఇలా కొన్ని వందల రచనలు ఆయన కలం నుండి జాలువారాయి. ఆయన రాసిన రచనలతో ఆంధ్ర సాహిత్యం ఉన్నత శిఖరాలనధిరోహించింది. ఇంత వైవిధ్యమున్న రచయిత మరొకరు ఉండరేమో అనేంతగా ఉంటాయి ఆయన రచనలు.

నిజాంకాలంలో ఒకసారి ఓ యువతి, ఒక రైలుపెట్టెనుండి మరో రైలుపెట్టెకు నగ్నంగా తిరుగుతూ ప్రయణీకులను ఇబ్బందులకు గురిచేసిందట. అక్కడున్న కొంతమంది ఆమెను ‘‘ఇలా నగ్నంగా తిరగడానికి సిగ్గనిపించడంలేదా’’ అని నిలదీశారు. దానికి ఆమె ‘‘నా గౌరవం, మర్యాద, సిగ్గు అన్నీ రజాకార్ల చేతుల్లో బలయ్యాయి. ఇంకా సిగ్గుపడడానికి నా దగ్గర ఏమీలేదు. అయినా రోజు రోజుకూ రజాకార్ల చేతుల్లో బలైపోతున్న మహిళలను కాపాడలేకపోతున్నందుకు మీరు సిగ్గుపడాలి’’ అని బదులిచ్చిందిట రజకార్ల చేతుల్లో అత్యాచారానికి గురైన ఆ మహిళ. తరువాత ఆ యువతి ఉరివేసుకుని చనిపోయింది.

1940 దశకంలో తెలంగాణాలో రజాకార్ల ఆకృత్యాలకు బలైపోయిన మహిళల దుస్థితికి అది ఓ ఉదాహరణ మాత్రమే. "కృష్ణ పత్రిక"లో ప్రచురితమైన ఈ వ్యాసాన్ని చదివిన ఆరుద్ర అప్పట్లో చలించిపోయారు. తెలంగాణాలో రజాకార్లు చేస్తున్న ఆకృత్యాలపై గుండెల్లో పుట్టిన తన ఆవేదనను కావ్యరూపంలో మలిచారు. "ఆరుద్ర" కలం పేరుతో ఆయన రాసిన ఆ కావ్యమే "#త్వమేవాహం". ఈ రచన తెలంగాణాలో నిజాం నిరంకుశత్వానికి అద్దంపడుతుంది.

రజాకార్ల ఆకృత్యాలపై రచించిన ఈ "త్వమేవాహం" అనే కావ్యం ఎందరో తెలంగాణావాదులకు స్ఫూర్తినిచ్చింది. తెలంగాణా సాయుధ పోరాటం నేపథ్యంలో వచ్చిన ముఖ్య రచనలలో ఒకటిగా అది నిలిచింది. ఈ కావ్యాన్ని చదివి "నేనిక పద్యాలు రాయకపోయినా ఫరవాలేదు" అని మహాకవి శ్రీశ్రీ అంతటి గొప్ప కవి నుండి ప్రశంసలందుకున్నారంటే ఆ రచన ఎంత ఉన్నతమైందో అర్థం చేసుకోవచ్చు.

అభ్యుదయ సాహిత్యంతో తెలుగుజాతిని మేల్కొలిపిన అతికొద్దిమంది రచయితల్లో ఆరుద్ర ఒకరు. అభ్యుదయ సాహిత్యమేకాకుండా సినీసాహిత్యంలో కూడా ఆయనకు తిరుగులేదు. వివిధ రంగాల్లో, ప్రక్రియల్లో వ్యాసాలను రాయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. విభిన్న కోణాల్లో రచనలు చేయడం ఆరుద్రకే చెల్లింది.

కేవలం అభ్యుదయ రచనలు, కావ్యాలకే పరిమితం కాలేదు ఆరుద్ర. సినీ సాహిత్యంలో ఆయన రాసిన పాటలు, తెలుగు సినీ సాహిత్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చిందనడంలో అతిశయోక్తిలేదు. ఈ మహాకవి చేసిన సాహితీ సేవకు గుర్తింపుగా 1985లో ఆంధ్ర విశ్వవిద్యాలయం "#కళాప్రపూర్ణ" బిరుదునిచ్చి సత్కరించింది.అయితే ఆరుద్రకు దక్కిన ఏకైక పురస్కారం ఇదొక్కటే కావడం ఎంతైనా బాధాకరం.

మహాకవి శ్రీశ్రీ తరువాత యువతపై ఎక్కువగా ముద్రవేసిన కవిగా పేరుగాంచిన ఆరుద్ర జూన్‌ 4, 1998న స్వర్గస్తులైనారు. ఆయన లేకపోయినా.. "ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు ఎదలో మమకారం ఎప్పటికీ పోదు' అనే ఆయన పాటలాగే ఆయన సాహితీ కుసుమాలు తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.
ఆయన అన్నట్లుగానే -#కవిత కోసమే ఆయన పుట్టాడు,క్రాంతి కోసం కలం పట్టాడు.

                         స్మారక నాణాలు

BANDLA GANESH.

నాణాలలో రెండు రకాలు ఉంటాయి.  స్మారకం, మారకం. స్మారకం అంటే జ్ఞాపకార్థం  వేసే నాణాలు, మారకం అంటే ప్రజల్లో చెలామణీలో ఉండే నాణాలు.  మొన్న వేసినది స్మారక నాణాలు. కేంద్ర ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్ట్రీ అజమాయిషీలో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, మింట్ అని రెండు వర్గాలు ఉంటాయి.  నాసిక్ లో ఉన్న సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్సులో రూపాయిల నోట్లు, ప్రామిసరీ నోట్లు, స్టాంపు పేపర్లు ముద్రిస్తారు. ముంబాయి, కోల్కటా, హైదరాబాదుల్లో ఉన్న మింట్ లో మారకం అయ్యే నాణాలు (రూపాయి బిళ్ళలు) తయారుచేస్తారు.  ఇవే గాక, మనం ఏ వ్యక్తి పేరుమీదైనా మాకిన్ని నాణాలు కావాలని ఏదైనా కుటుంబం నిర్ణీతమైన మొత్తాన్ని వారికి కడితే, వారు కోరినన్ని  నాణాలను ముద్రించి యిస్తారు.  అయితే అవి ఎక్కువ మొత్త్గంలో ఉంటేనే అంగీకరిస్తారు.  మొన్న విడుదలైన రామారావు గారి బొమ్మతో ఉన్న నాణెం అలాంటిదే! పురందేశ్వరి గారు అలా అర్డరిచ్చి 14 వేల నాణాలను ముంద్రింపించారుట! అవి సాధారణంగా నాణాలను సేకరించి దాచుకొనేవాళ్ళు  కొంటారు. ఈవిడ డబ్బులు కట్టి వాటిని ముద్రింపించి,   రాష్ట్రపతి చేతుల మీదుగా విడుదల చేయమని ఆమెను అడిగితే, ముర్ము గారు ఒప్పుకొన్నారు. ఇటీవలే పి.వి.నరసింహారావు గారి శత జయంతి జరిగింది.  మరి ప్రభుత్వం ఆయన నాణాన్ని ఎందుకు విడుదల చేయలేదు?  ఆయన కుటుంబం ఆ పని చేయలేదు.    రామారావు గారి కుటుంబం దానికి పూనుకొంది.  ఎన్నికల సమయం కావటంతో కొంత రాజకీయం కూడా ఉంటుంది. లక్ష్మీపార్వతి గారు కూడ ఎన్నికల సమయం కాబట్టి గొడవ చేస్తున్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు గనుక ఆమెను పిలవలేదు. కుటుంబసభ్యులుగా భావించిన వారిని మాత్రమే  వాళ్ళు పిలుచుకొన్నారు.  ఈమె వివాహం అయ్యాక, కన్నతండ్రినే ఆ కుటుంబం బయటపెట్టింది. ఇంక ఈమెను తమ కుటుంబ కార్యక్రమానికి ఎందుకు పిలుస్తారు?  రామారావు గారి నాణాలు  హైదరాబాదు మింట్ లో తయారయ్యాయి.  నాణాలు కావలసిన వాళ్ళు నాణానికి మూడు వేలు కడితే, యిస్తామని మింట్ డైరెక్టర్ మొన్ననే ప్రకటించారు.  నేను సర్వీసు చివరలో మింట్ లో పనిచేసాను గనుక యిదంతా తెలిసింది.  అవి ఎక్కువగా తెలుగుదేశం నాయకులు, బంధుబలగాలు కొని దాచుకోవటానికే తప్ప, మార్కెట్టులో చెల్లుబాటు అయ్యే నాణాలు కావు. చెల్లుబాటు కాని నాణెం కోసం రచ్చ చేసుకోవటం అనవసరం.  ఎవరికైనా సరదా ఉంటే, ఒక నాణానికి మూడు వేలు చెల్లించి తెచ్చుకొని, పూజగదిలో పెట్టుకోవచ్చు.

Wednesday 30 August 2023

          భారత దేశం వయసు

900సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !

2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి 

5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి 

1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి 

మరీ భారత దేశం వయసు ఎంత?

ప్రపంచంలో  ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు  అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం

ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....

ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే

వైదిక  సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి"  కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి

విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు

ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు

ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు 

ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...

 "నా దేశం-భారత దేశం"

ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి.

మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది.

చరిత్ర పుటల్లో నాటికి...నేటికి...

"శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"

ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది

రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది

మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?

శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు 

ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.

ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే...

"హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం

మరీ దేశభక్తుల విషయం...

1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా?

4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే !

మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు

ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది

ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి

ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి.

ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని  విమర్శిస్తారు. జై హింద్

నేను బారతీయున్ని బ్రతికినన్నాళ్లు ఈ గెడ్డ మీదే బ్రతుకుతాను పోయాక కూడా ఈ మట్టిలో కలిసి ఉంటాను ...

Tuesday 29 August 2023

 /*నాణెం పై తెలుగు భాష.*


*ఇంగ్లీష్ వాళ్ళు మన తెలుగు భాషకు పట్టం కట్టారు.*


*ఒకసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. గాంధీజీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ‘ఉక్కు మనిషి’ సర్ధార్ వల్లభాయి పటేల్, ఆంధ్ర ప్రముఖుడు మహా మేధావి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య తదితరులు ఆ సమావేశంలో పాల్గొన్నారు.* 


*ఈ సందర్భంగా పట్టాభి సీతారామయ్య గారు ” ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్య ” ను సభ దృష్టికి తీసుకువచ్చారు.*


 *పట్టాభీ ! నువ్వు ‘ ఆంధ్ర రాష్ట్రం,,, ఆంధ్ర రాష్ట్రం,,, ‘ అని ఎప్పుడూ అంటూ ఉంటావు… అసలు నీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా ? … మీరంతా ‘మద్రాసీ’లు కదా ? అంటూ పటేల్ గారు,గాంధీ గారు మరి కొంత మంది తెలుగు మాతృ బాషా కాని వారు ఎగతాళిగా మాట్లాడారు



*అప్పుడు వెంటనే పట్టాభి సీతారామయ్య గారు తన జేబులో నుంచి అణా కాసును తీసి ” సర్ధార్ జీ ! దీనిపై ‘ ఒక అణా ‘ అని అధికార భాష అయిన ఆంగ్లంలోనూ … జాతీయ భాష అయిన హిందీలోనూ … దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీలోనూ… ఆ తర్వాత ‘ ఒక అణా ‘ అని తెలుగులోనూ రాసి ఉంది. ఇది బ్రిటిష్ వారు తయారు చేసిన అణా నాణెం.* 


*(అప్పటికి భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు)… మరి ఈ నాణెం పై మా ‘ తెలుగు భాష ఉంది… కానీ, మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే ???* 


*అంటూ చురక వేశారు. పటేల్ గారు, గాంధీ గారు మరి కొంత మంది తెలుగు మాతృ బాషా కాని వారు ఆశ్చర్యపోయారు.*


*భారత దేశానికి స్వతంత్రం రాక ముందే బ్రిటిష్ ప్రభుత్వం వారు మనలను పరిపాలించే రోజుల్లోనే… తెలుగు భాషకున్న ప్రాచీనతను గొప్పదనాన్ని గుర్తించి, వారు ముద్రించిన నాణెల మీద అధికార భాష ఇంగ్లీషు, జాతీయ భాష హిందీ, ప్రపంచం లో అధికంగా మాట్లాడే బెంగాలీ భాష, తెలుగు భాష లను ప్రవేశ పెట్టి, మన తెలుగు చరిత్ర గొప్పదనం అందరికి తెలియపర్చారు.*



*తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు*


      *🚩హనుమాన్ దళ్*🚩

              *ఆంధ్రప్రదేశ్*

Sunday 27 August 2023

Sivan

 K. The name of Sivan is Kailashavadivo Sivan. Born in Kanyakumari.



The name of the village is Sarakkalvilai... The family was poor. So much that there was no money for Sivan's study. He studied in the village government school. Just read till the 8th. Had to get out of the village for further studies. But there was no money in the house. K Sivan had to raise fees for reading. And for this they started selling mangoes in the nearby market. Pay your fees from the money you get. Sivan after becoming ISRO Chairman had told English newspaper Deccan Chronicle during a conversation.. Sivan did intermediate while studying by selling mangoes, but needed more money for graduation. Due to lack of money, his father admitted him to the Hindu College of Nagarkoil, Kanyakumari. And when they went to Hindu college to do BSc in Maths, they got slippers on their feet. Dhoti - kurta and slippers. Before Sivan never had enough money to even buy slippers for himself. Sivan studied and became the first graduate of his family. Got 100 out of 100 in Maths. And then their mind changed... Now they should have studied science, not maths. And for this they arrived MIT. That is Madras Institute of Technology. There they got scholarships and due to this they did BTech in Aerotical Engineering. The year was 1980. At MIT they got professors like S Namasimhan, NS Venkatarman, A Nagarajan, R Dhanrajan, and K Jayarman who guided K Sivan. After BTech Sivan masters in Aerospace Engineering from Indian Institute of Science Bangalore. And when Sivan IIS came out of Bangalore, he had become a big scientist of aeronautics. Dhoti-Kurta was left out and they were now wearing pant-shirt. He started his job with ISRO i.e. Indian Space Research Organization. Got first job in the team making PSLV. PSLV i.e. Polar Satellite Launch Weekly. A rocket that can send Indian satellites into space. K Sivan and his team managed this job... K Sivan created a software to install rocket in classroom, named Star. The software created by them was very successful and it was discussed in the scientific world of India. During this time, Indian scientists were preparing for GSLV one step ahead of PSLV. GSLV i.e. Geosatellite Launch Weekly. GSLV testing was conducted on April 18, 2001. But the testing failed, because the place where scientists wanted it to be, they couldn't. K Sivan was mastered in this work. GSLV was assigned to launch K Sivan. And they did it. Since then K Sivan has been called rocket man of ISRO... After this Sivan and his team started working on another project. Project was to create reusable launch week. Meaning that launch week can be used again after leaving satellite once from launch week. Till now this has not happened in any country. Under the leadership of K Sivan, Indian scientists were engaged in this. During the year 2006. Sivan obtained a medical degree from IIT Bombay in Aerospace Engineering. And then he was made the head of the fuel department for the launch week in ISRO. The date was July 2, 2014. Less than a year passed and K Sivan was made the head of Vikram Sarabhai Space Center. The space center whose job is to prepare weekly rockets to send Indian satellites into space. Sivan could not work there for a year that he was the head of ISRO at that time. S. Kiran Kumar's tenure has been completed. And then on 14 January, 2015 K Sivan was appointed as the head of ISRO... Sivan, who listens to classical Tamil music and gardeners in his free time, has been awarded with many awards. Under their leadership, ISRO sent 104 satellites together into space on February 15, 2017. ISRO created a world record by doing this. And after this ISRO's biggest mission was Chandrayaan 2, which was launched on July 22, 2019. Chandrayaan divided into two parts on September 2. The first part was the orbiter, which started rounding the moon. The second part was Lander, which was named Vikram. It had to land on the moon's surface on September 6-7..

 ఒక మహోన్నత వ్యక్తి, పద్మశ్రీ గ్రహీత, శాంతి స్వరూప్ బట్నాకర్ గ్రహీత

*డాక్టర్ అయ్యగారి సాంబశివరావు''

స్ఫూర్తి ప్రదాత జీవిత గాధ.

(సేకరణ)



పుట్టిన ఊరిలో ఒక వీధికి కూడా ఆయన పేరు లేదు కానీ హైదరాబాద్ లాంటి ఒక మహా నగరంలో ఒక ఏరియాకి ఆయన పేరుని నామకరణం చేశారు.
చరిత్రలో, ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఓ గొప్ప వ్యక్తి కథ ఇది !! ఆ గొప్ప వ్యక్తి మన తెలుగువారు కావడం ఎంతో గర్వకారణం.
"కాలం మనిషిని పుట్టిస్తుంది, అదే కాలం మనిషిని తనలో ఐక్యం చేసుకుంటుంది".
ఆ మనిషి పేదవాడైనా, ధనవంతుడైనా, సామాన్యుడైనా - అసమాన్యుడైనా...అదే కాల ధర్మం.
ఆ వ్యక్తి చేసిన పనులను బట్టి కొందరు చరిత్ర పుటల్లో మిగిలిపోతారు - మరి కొందరు ప్రజల హృదయాల్లో !
అలా చరిత్రలో మరియు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న అతి కొద్ది మంది వ్యక్తులలో, ఈయన కూడా ఒకరు. ఆయన మరెవరో కాదు మన తెలుగుతల్లి ముద్దుబిడ్డ, #భారతదేశాన్ని ఎలక్ట్రానిక్ రంగంలో అగ్రదేశాలతో సరి సమానంగా నిలిపిన మహోన్నతుడు, అంతకుమించి మానవతావాది,
కర్మయోగి. ఆయన పేరుని ఆయన పుట్టిన ఊరికి
కాక, వేరే ఒక ప్రాంతంలో ,అది కూడా ఒక ప్రముఖ
మెట్రో నగరంలో ఒక ఏరియాకి ఆయన పేరు పెట్టారంటే ఆయన ఏమి సాధిస్తే అలా పెడతారు? ఆ పేరు పలికితే
రెండే పదాలు, కానీ ఆయన పేరు కన్నా ముందుగా ఆయన
ఏమి సాధించారో చెప్తే ఆ పేరుకున్న వెయిట్ అర్థం అవుతుంది,
ఆ పేరు గల మనిషి బలం అర్ధమవుతుంది.
"ఈ ప్రపంచంలో కనుగొనబడిన ప్రతిదీ కూడా ఈ
భూమి ప్రసాదమే, అది మనం తినే అన్నమైన, ఒక సూపర్ కంప్యూటర్ అయినా... అలాగే తాను కనిపెట్టగలిగే వస్తువు ముడి సరుకు ఆ భూమిలోనే ఉంది అనే మేధస్సు కలిగిన వ్యక్తుల ఆలోచనల
ఫలితమే ఈరోజు మనం ప్రపంచంలో అనుభవించే
ప్రతి సుఖానికి, బద్ధకానికి నాంది."
అది 1914 వ సంవత్సరం సెప్టెంబర్ 20వ తారీకు,
విక్రమ నామ సంవత్సరం, భాద్రపద బహుళ దశమి, సోమవారం, మేష లగ్నం , #భీమవరానికి పది
కిలోమీటర్ల దూరంలో #మొగల్లు అనే చిన్న పల్లెటూరు, సమయం సరిగ్గా రాత్రి తొమ్మిది కావస్తోంది. అప్పుడే అయ్యగారి వారింట ఒక నిండు గర్భిణీ ఐన సుందరమ్మకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యయి, హాస్పిటల్ కి వెళ్ళాలన్నా పది కిలోమీటర్ల పోవాలా,
ఊళ్లో పురుడు పోసే ఒక ముసలమ్మను వెంటనే తీసుకొచ్చారు, లోపలికి వెళ్లి తలుపులు మూసింది,
మళ్లీ అదే ముసలమ్మ తలుపులు తెరిచి,
"ఆ రాములోరి నక్షత్రంలో నీకు మగ బిడ్డ జన్మించాడు వెంకటాచలం" అంటూ శుభవార్తను తెలియజేసింది.
ఆ బిడ్డ పెరిగి పెద్దవాడు అవుతున్నాడు, చిన్నప్పటి
నుంచి చదువు అంటే ఎంతో ప్రేమ, అలాంటి ఇలాంటి ప్రేమ కాదు, ప్రతి పరీక్షలోనే అతడే అగ్రగన్యుడు. ఆ మొగల్లులోనే ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. అంతకుమించి అతనికి చదవాలని ఆశ ఉన్నా, స్కూలు అయితే లేదు. అప్పట్లో ఐదవ తరగతి దాటి చదవాలంటే వేరే ఊరు వెళ్లాలి , తన కుటుంబాన్ని ఎంతగానో బ్రతిమాలాడు, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే , చివరికి #తణుకు చెందిన వంగూరి వారు అతనికి చదువు మీద ఉన్న ప్రేమను చూసి వసతి ,మరియు ఒక రోజు భోజనం పెట్టడానికి ఒప్పుకున్నారు, మొత్తం మీద తణుకు హైస్కూల్లో తన యొక్క సెకండరీ విద్యను ప్రారంభించి, ప్రతిరోజు భోజనానికి వారాలబ్బాయిగా మారాడు, ఒకరోజు భోజనం అంటే ఏదోలా కష్టపడొచ్చు కానీ
ఎస్.ఎస్.ఎల్.సి పూర్తయ్యేంతవరకు భోజనం అంటే మాటలా, కొంతమంది నువ్వు మా వాడివి కాదని మరి కొంతమంది మీ శాఖ వేరని అలా చాలామంది భోజనం పెట్టేవారు కాదు, ఒక్కోసారి కొన్ని వారాల పాటు కూడా భోజనం చేసే అవకాశం ఉండేది కాదు, చివరికి
ఒక్కోసారి తన ఆకలిని తీర్చుకోవడానికి మినుములను నానబెట్టి వాటిని తింటూ ఉండేవాడు. మొత్తానికి కష్టపడి దాతల సహకారంతో #తణుకులోనే ఎస్.ఎస్.ఎల్.సి ని విజయవంతంగా పూర్తి చేశారు, చదువుకోవాలి అనే తృష్ణ ఆయనలో రోజురోజుకీ పెరిగిందే తప్ప, ఎన్నడూ తగ్గలేదు.
"నీ సంకల్పం గొప్పదైతే ప్రపంచంలో ప్రతి అణువణువు కూడా నీకు సహకరిస్తుంది"
ఎలాగోలా, ఎస్.ఎస్.ఎల్.సి అయితే పూర్తి చేశాడు
కానీ తర్వాత ఇంటర్మీడియట్ కూడా చదవాలి అనే
తన ఆశని తన అన్నలకి వ్యక్తం చేయడంతో వారు
కూడా సరే అని విజయనగరం మహారాజా కాలేజీలో జాయిన్ చేశారు. జాయిన్ అయితే అయ్యాడు కానీ
మళ్ళీ అవే ఆర్థిక సమస్యలు, చివరికి ప్రతిరోజు ఆ విజయనగరంలో దేవాలయాల వద్ద వచ్చే భక్తులకు తనకు సాయం చేయమని కూడా అడిగేవాడు.
"కడుపు కోసం చెయ్యి చాచేవాడిని చూసి ఉంటాము, కానీ చదువు కోసం చేయి చాచిన వ్యక్తులు చాలా
అరుదు కదా!" అలా కష్టపడి చదువును నెట్టుకొస్తున్న సమయంలో ఇతని ప్రతిభను గుర్తించినటువంటి ఆ విజయనగరం మహారాజా వారు కొంతవరకు సాయం చేయడంతో మొత్తానికి విజయవంతంగా తన ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.
కొడుకుకి చదువు మీద ఉన్న ప్రేమను చూసి
ముగ్ధురాలైన ఆయన తల్లి గారు, తన పట్టు చీరలు అమ్మేసి తన కొడుకుని బీఎస్సీలో చేర్చడానికి సహకరించారు. వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో బ్యాచిలర్ గా తన జీవితాన్ని ప్రారంభించిన ఆయన జాయిన్ అయిన మొదటిరోజు నుంచే ఎంతో కష్టపడి చదివేవారు.
అప్పట్లో పండిత మదన్మోహన్ మాలవ్య ఆ కాలేజీ
యొక్క ప్రిన్సిపాల్ గా ఉండేవారు. జాయిన్ అయితే అయ్యాడు కానీ, మొదటి సంవత్సరం ఫీజు కూడా కట్టలేని పరిస్థితి .అతని పరిస్థితి చూసి పండిత్ మదన్మోహన్ మాలవ్య గారు కనీసం రెండో సంవత్సరం అయినా ఫీజు కట్టమని చెప్పారు, మళ్లీ రెండోసంవత్సరం కూడా అదే పరిస్థితి కానీ అతనికి చదువు మీద ఉన్న ప్రేమకు ఆనందభరితుడైన ఆ ప్రిన్సిపాల్ గారు కనీసం మూడో సంవత్సరం అయినా పరీక్ష ఫీజు కట్టమని చెప్పి, ఆ సంవత్సరం కూడా పరీక్షలు రాయనిచ్చారు.
కనీసం కొనుక్కోవడానికి పుస్తకాలు కూడా లేని పరిస్థితి , పరీక్ష సమయంలో పుస్తకాలు కూడా ఎవర్నో ఒకరిని అప్పు అడిగి తెచ్చుకొని చదివేవారు, చివరికి మూడో సంవత్సరం రానే వచ్చింది, కానీ ఈసారి ప్రిన్సిపాల్ గారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ! చివరికి చేసేది ఏమీ లేక ఇంటికి టెలిగ్రామ్ పంపారుజ్ "మీరు కనుక డబ్బు పంపగలిగితే రెండు రోజుల్లో నేను ఫీజు కట్టగలను లేదంటే రెండు రోజులలో ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాను" అని దాని సందేశం. ఆరోజు మొగల్లులో డ్యూటీలో ఉన్న #పోస్టుమాస్టర్ పైడిమర్రి వెంకట రామయ్య గారు ఈ యొక్క విషయాన్ని చదివి చలించిపోయి, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి భార్య 120 తులాల బంగారు గొలుసును అమ్మేసి ఆ డబ్బులు అతనికి మనీ ఆర్డర్ చేశారు. "నిజంగా అటువంటి దాతృత్వం కలిగిన వెంకటరామయ్య గారు ఆ రోజు డ్యూటీలో లేకపోయి ఉంటే ఈరోజు భారతీయ ఎలక్ట్రానిక్ పరిస్థితి వేరే రకంగా ఉండేదేమో.
మొత్తానికి మనీ ఆర్డర్ తో ఫీజు కట్టి మూడో సంవత్సరం పరీక్ష కూడా మొట్టమొదటి స్థాయిలో ఉత్తీర్ణతను సాధించాడు ఆ యువకుడు. తర్వాత 1938లో అన్నపూర్ణమ్మ గారిని వివాహం చేసుకున్నారు భౌతిక శాస్త్రంలో తన యొక్క మాస్టర్స్ కూడా కంప్లీట్ చేశారు.
ఆ తర్వాత #టాటా సంస్థ వారి యొక్క సహకారంతో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో తన యొక్క మాస్టర్స్ పట్టా కూడా పొందారు, అక్కడ ఎలక్ట్రానిక్ రంగంలో నిష్ణాతులైన డేవిడ్ ప్యాక్యార్డ్ వంటి వారి నుండి అద్భుతమైన జ్ఞానాన్ని పొందారు. అక్కడే వారికి ఉద్యోగాన్ని ఆశ చూపినా, తన జ్ఞానాన్ని భారతదేశ కోసం మాత్రమే ఉపయోగించాలని నిశ్చయించుకుని, తిరిగి తనకి సహకారం చేసిన టాటా సంస్థలోనే జాయిన్ అయ్యారు. హోమీ #జహంగీర్_బాబా, #సివిరామన్, #విక్రమ్_సారాభాయ్ వంటి ఎంతోమంది ప్రముఖులతో కలిసి పని చేశారు.
అప్పటివరకు భారతదేశం కనీ, వినీ ఎరుగని ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేయడం ప్రారంభించారు, 1956 లో దేశీయంగా తయారుచేసిన #అప్సర అనే పరమాణు రియాక్టర్ నిర్మాణంలో కూడా విశేషమైన కృషి చేశారు. ఆయన యొక్క ప్రతిభ తెలియడానికి భారతదేశానికి ఎంతో సమయం పట్టలేదు. 1960 వ సంవత్సరంలోనే భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీని, 1972వ సంవత్సరంలో పద్మభూషణ్ తో సత్కరించింది.
అది 1962 సంవత్సరం. భారతదేశం - చైనా మధ్య జరిగిన యుద్ధంలో మన దేశానికి కొంత ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలోనే స్వీయ ఆయుధాల తయారీ అనేటువంటిది భారతదేశానికి అత్యవసర రంగమని బాబా గారు గుర్తించారు.
దానికోసం ఒక ప్రత్యేక సంస్థను నెలకొల్పాలి అని నిశ్చయించుకున్నారు. అదే *ఎలక్ట్రానిక్ కార్పొరేషన్
ఆఫ్ ఇండియా లిమిటెడ్.* కానీ దాన్ని ఎలాగైనా
తెలుగు రాష్ట్రాల్లోనే నెలకొల్పాలి అనేటువంటిది
మన హీరో గారి బలమైన సంకల్పం.
చివరికి ప్రభుత్వాన్ని, ఆ సంస్థలో వారిని ఏదో విధంగా ఒప్పించి ఆ సంస్థని 1967 లో, #హైదరాబాదులో స్థాపించడం జరిగింది. దానికి చైర్మన్ గా డాక్టర్ విక్రం సారాభాయ్ గారిని, అలాగే ఎండిగా మన కథలోని నాయకున్ని నియమించడం జరిగింది.
ఈ యొక్క #ఈసీఐఎల్ లో భారత దేశంలో మొట్టమొదటి కంప్యూటర్ సిస్టమ్స్ , అలాగే వాటికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ని కూడా అక్కడే తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎంతోమంది సైంటిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆ యొక్క కంప్యూటర్ల మీద మరియు సాఫ్ట్వేర్ తయారీలో ప్రత్యేక ట్రైనింగ్ కూడా నిర్వహించేవారు. భారత దేశంలో మొట్టమొదటిగా రిజర్వేషన్ సిస్టమ్స్, షేర్ మార్కెట్స్ , బ్యాంకింగ్ సాఫ్ట్వేర్, మొదటి ఈవీఎం మిషన్, కాక్ పిట్ వాయిస్ రికార్డర్, ఎయిర్పోర్ట్ స్కానింగ్ సిస్టమ్స్ , అలాగే ఆర్మీకి సంబంధించి ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలను మరియు సాఫ్ట్వేర్లను అన్ని కూడా ఈసీఐఎల్ లో తయారయ్యాయి. ఒకరకంగా ఈరోజు హైదరాబాద్ సాఫ్ట్వేర్ హబ్ గా తయారయ్యింది అంటే, దానికి కారణం కూడా #ఈసీఐఎల్ సంస్థ. సంస్థలో పనిచేసిన ఇద్దరు వ్యక్తులు కలిసి హైదరాబాదులో మొట్టమొదటి
సాఫ్ట్వేర్ కంపెనీని కూడా ప్రారంభించడం జరిగింది.
ఈయన సాధించిన విజయ పరంపర అనిర్వచనీయం, ఒక ఉద్యోగిగా తాను గొప్ప వ్యక్తే..అలాగే ఒక మనిషిగా కూడా ఆయన అంతే మహనీయుడు, మానవత్వానికి, సింప్లిసిటీకి ఆయన యొక్క కల్ట్ ఎగ్జాంపుల్. 1978 సంవత్సరంలో తనకు తానుగానే సెల్ఫ్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన అంత సాధించినా కూడా ఎప్పుడూ కూడా సాధారణ వ్యక్తిలాగ ఆర్టిసీ బస్సుల్లో, ఆటోల్లో తిరిగేవారు. చివరికి తన దగ్గర పనిచేసిన ఒక వ్యక్తికి ఆటో కొనిచ్చారు, తాను ఎక్కడికి వెళ్లాలన్నా కూడా అదే ఆటోలో వెళ్లేవారు...అది సన్మానాలైనా, మీటింగులైనా... అది కూడా డబ్బులు తీసుకుంటేనే ఎక్కేవారుట.
ఇంతకీ ఆయన పేరు మీకు చెప్పలేదు కదా ! ఆయన
ఒక రోజు ఎక్కడికో పనిమీద వెళ్లి, తిరిగి వస్తూ, ఆర్టీసీ బస్సులో, #"ఏఎస్ రావు నగర్ వచ్చాక ఆపండి" అని కండక్టర్ కి చెప్పారట, మళ్లీ పది నిమిషాలు పోయాక బాబు ఏఎస్ రావు నగర్ వచ్చేసిందా అని అడిగారట, అప్పుడు
ఆ కండక్టర్ చిరాకుపడుతూ ఎదర వచ్చే స్టాపే ఏఎస్ రావు నగర్ అని చెప్పాడు, ఆ స్టాప్ రాగానే ఆయన దిగి వెళ్ళిపోయారు, ఆ తర్వాత బస్సులో
ఉన్న వాళ్ళందరూ ఆ కండక్టర్ కి చెప్పారు ఆయనే,
"పద్మశ్రీ గ్రహీత, శాంతి స్వరూప్ బట్నాకర్ గ్రహీత
*డాక్టర్ అయ్యగారి సాంబశివరావు"* అని.
ఆరోజు ఆయన నాటిన *#ఈసీఐఎల్* అనే
వటవృక్షం నేడు కొన్ని లక్షల మందికి ఉపాధి. అందుకోసమే ఈసీఐఎల్ ప్రాంతాన్ని మొత్తం ఆయన గుర్తుగా *"ఏఎస్ రావు నగర్"* గా నామకరణం చేశారు. ఎప్పుడైనా వివిధ ప్రాంతాల నుంచి ఎవరైనా
వెళ్తే చాలా ఆప్యాయంగా వారందరికీ కూడా భోజనాలు
పెట్టి పంపించేవారు. అంతేకాకుండా, భోజనానికి
ఇబ్బంది పడే వారికి ఆయన ఇంటి దగ్గరే చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేసేవారు. ఎందుకంటే వారాలబ్బాయిగా చేసిన ఆయనకి తిండి , ఆకలి విలువ బాగా తెలుసు కాబట్టి. ఈయన గురించి చెప్పుకుంటూ పోతే రాయాల్సింది చాలానే ఉంది కానీ ఎక్కడో చోట ఆగాలి కాబట్టి ఇక్కడే ఆగుతూ....
ఒక సాధారణ మధ్యతరగతి విద్యార్థిగా తన జీవన ప్రయాణాన్ని ప్రారంభించి చదువుకు డబ్బులేక,
కడుపుకు తిండిలేక, ఎంతో ఇబ్బంది పడుతూ, కొన్ని వందల మందికి విద్యా దానాలు, కొన్ని వేలమందికి ఆకలి తీర్చే చేసే స్థాయికి ఎదిగి, భారత దేశాన్ని ఎలక్ట్రానిక్ విభాగంలో ప్రపంచ స్థాయి సంస్థలతో సమానంగా నిలిపి, కర్మను మాత్రమే చేసి వాటి ఫలితాన్ని విడిచిపెట్టిన అసలు సిసలైన కర్మయోగి, తెలుగు వారి ముద్దుబిడ్డ, శ్రీ అయ్యగారి సాంబశివరావు గారికి మన తెలుగు వాళ్ళ అందరి తరుపున వేవేల జోహార్లు, నమస్కారాలు.

Monday 21 August 2023

Brave Savarkar ji.             A truth hidden in history....


45-year-old Mahatma Gandhi comes to India in 1915, spending more than 2 decades in South Africa. 4 years ago a 28-year-old young man closes in a dungeon in Andaman. The British make him sow oil, rope and peel it all day while driving instead of bull in Kolhu. He's educating all prisoners, intensifying patriotism in them and creating literature with nails, thorns and nails by walls. His name was - Vinayak Damodar Savarkar.

They have suicide thoughts many times. Keep looking at the window from where other prisoners had committed suicide earlier. The pain was getting unbearable. The border of torture was crossing. The darkness was not only in those closets, but also on the minds. Rotate Kolhu in place of bull throughout the day, change the turn at night. 11 years passed just like that. Prisoners respected them so much that even when they refused, they used to wash their utensils, clothes etc. and help them in their work. The English used to try to keep the rest of the prisoners away from Savarkar. In the end wisdom conquered so they distracted other prisoners from suicide.
But no, great illiterates say that Savarkar wrote Mercy petition, said sorry, apologized.
Hey fools, Revolutionary Ramprasad Bismil who was trapped in Kakori scandal also apologized, so? Will they be declared 'cowards' too? Tell me. They also apologized to the British. Will the revolutionaries be weighed on this test now? When a lion jumps big, it takes a few steps back. What was in their mind at that time, what was the strategy ahead- some people know this by sitting in their homes.
Who is the freedom fighter who has been sentenced to 11 years of black water. Nehru? Gandhi? ..... Who ?
How many heroes like Nanasaheb Peshwa, Queen Laxmibai and Veer Kunwar Singh were suppressed in history. 1857 was described as a soldier revolt. Then a 20-22 year old man was going to the level of truth by taking somehow access to a London library and day and night reading a document after the British, which was hidden from the Indians. He proved that it was not a soldier rebellion, it was the first freedom fight. She reached the masses of all her immortal sacrifices. Bhagat Singh Sreekhe revolutionaries together read it, translated it.
What is the book in the world that was banned before publication? The British were so scared of him that every arrangement was made, so that the book did not reach India. When it reached somehow, the flame of revolution was burnt with ghee. Savarkar was the one who fought against the British with both pen and brain. Savarkar was working for upliftment of Dalits. Savarkar was locked in Kalkothari for 11 years. Savarkar was the one who revived Hinduism and awakened nationalism. Savarkar was the warrior who was the master of literature.
What did they get after independence? Insulted Nehru and Maulana Abul Kalam, people like him licked the cream and trapped Savarkar in Gandhi murder case. Arrested. Didn't even give pension. Tortured. Arrested them again in the 60s, banned them. They were refused to go to public meetings. All this happened in the same India, for whose independence they sacrificed their life. His freedom was snatched from the drunkard of freedom in the same country which he contributed to liberate. When Shastri became PM, he arranged pension.
They used to explain to the prisoners in black water that have patience, a day will come when this place will become a pilgrimage. Even if we are making fun of the whole world today, there will be a time when people will say, see, Indian prisoners were locked in these dunes. Savarkar used to say that then only those prisoners will have statues here. If you go to Andaman today, you land directly at 'Veer Savarkar International Airport'. Their statue is installed in cellular prison. The Prime Minister also goes to the room in which Veer Savarkar was kept.
Salute to Veer Savarkar ji
🙏

Sunday 20 August 2023

 యోగి ఆదిత్యనాథ్

*ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కాషాయ దుస్తులు ధరిస్తారని చాలా మంది అనుకుంటారు*

 అందుకే అక్కడ "సన్యాసి" ఉన్నాడు

▪️ రిటైర్మెంట్ తర్వాత అజయ్ మోహన్ బిష్త్ (అసలు పేరు).

 యోగి ఆదిత్యనాథ్

 ▪️HNB గర్వాల్ విశ్వవిద్యాలయం నుండి ఉత్తర ప్రదేశ్ చరిత్రలో అత్యధిక మార్కులు (100%)

 ▪️యోగి జీ గణిత విద్యార్థి, అతను B.Sc గణితం బంగారు పతకంతో ఉత్తీర్ణత సాధించాడు.

 ▪️ 1972లో UPలోని వెనుకబడిన పంచూర్ గ్రామంలో చాలా పేద కుటుంబంలో జన్మించారు.  అతనికి ఇప్పుడు 50 ఏళ్లు.

 ▪️ అతను భారతీయ సైన్యంలోని పురాతన గూర్ఖా రెజిమెంట్ యొక్క ఆధ్యాత్మిక గురువు.  * యోగిని గురువుగా ఆరాధించే యోగి మద్దతుదారుల భారీ సమూహం నేపాల్‌లో ఉంది.

 ▪️ మార్షల్ ఆర్ట్స్‌లో అద్భుతమైన నైపుణ్యం.  ఏకకాలంలో నలుగురిని ఓడించిన రికార్డు.

 ▪️ ఉత్తరప్రదేశ్ ప్రఖ్యాత స్విమ్మర్.  ఎన్నో పెద్ద నదులను దాటింది.

 ▪️కంప్యూటర్‌ను కూడా ఓడించే అకౌంటింగ్ నిపుణుడు.  ప్రముఖ గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి కూడా యోగిజీని ప్రశంసించారు.

  ▪️ రాత్రిపూట కేవలం నాలుగు గంటల నిద్ర.  అతను ప్రతిరోజూ ఉదయం 3:30 గంటలకు లేస్తాడు.

   ▪️ యోగా, ధ్యానం, గౌశల, హారతి, పూజ దినచర్య.

  ▪️ రోజుకు రెండు సార్లు మాత్రమే తినండి..

  పూర్తిగా శాఖాహారం.  ఆహారంలో దుంపలు, వేర్లు, పండ్లు మరియు దేశీయ ఆవు పాలు ఉంటాయి.

 ▪️ అతను ఇప్పటి వరకు ఏ కారణం చేత ఆసుపత్రిలో చేరలేదు..

  ▪️ యోగి ఆదిత్యనాథ్ ఆసియాలోని అత్యుత్తమ వన్యప్రాణి శిక్షకులలో ఒకరు, అతనికి వన్యప్రాణులంటే చాలా ఇష్టం.

 ▪️యోగి కుటుంబం ఎంపీ లేదా ముఖ్యమంత్రి కాకముందు ఎలాంటి స్థితిలో ఉందో ఇప్పటికీ అలాగే జీవిస్తోంది.

 ▪️ సంవత్సరాల క్రితం పదవీ విరమణ తీసుకున్న తర్వాత యోగి ఒక్కసారి మాత్రమే ఇంటికి వెళ్లారు.

 ▪️ యోగికి ఒకే బ్యాంకు ఖాతా ఉంది మరియు అతని పేరు మీద భూమి ఆస్తి లేదు లేదా అతనికి ఎటువంటి ఖర్చులు లేవు.

 ▪️ వారు తమ సొంత జీతం నుండి వారి ఆహారం మరియు బట్టలు ఖర్చు చేస్తారు మరియు మిగిలిన డబ్బును సహాయ నిధిలో జమ చేస్తారు.

 *ఇది యోగి ఆదిత్యనాథ్ ప్రొఫైల్..*

 భారతదేశంలో నిజమైన నాయకుడి ప్రొఫైల్ ఇలా ఉండాలి.

 అలాంటి పుణ్యాత్ములు మాత్రమే భారతదేశాన్ని మళ్లీ ప్రపంచ గురువుగా మార్చగలరు.మీకు నచ్చితే ఫార్వర్డ్ చేయండి.


 🚩🚩 జై శ్రీరామ్🙏🙏

 అబద్ధపు ప్రచారం

ఎర్ర కోట లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం భారత ప్రభుత్వం10 లక్షల అద్దె చెల్లించింది!

ఈ అబద్ధపు ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

******************

నిజమేమిటో తెలుసుకుందామా?

2018 April 18

ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ ఒక  పిలుపుని ఇచ్చారు!

'Adopt A Heritage' Scheme.

దేశంలోని ప్రధాన చారిత్రిక కట్టడాలని దత్తత తీసుకోవాలని!

ప్రధాని మోదీజీ పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ సంస్థలు, ధనికులు అయిన వారు వ్యక్తిగతంగా దత్తత తీసుకోవచ్చని ప్రకటన చేశారు.

*********************

చారిత్రిక కట్టడాలని దత్తత తీసుకోవడం అంటే స్వంతం చేసుకోవడం కాదు!

*********************

జంతు ప్రదర్శనశాలలో ఉండే జంతువులను దత్తత ఇస్తారు ఎవరన్నా ముందుకు వస్తే. ఒకసారి దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చిన వారితో ఆయా జంతు ప్రదర్శన శాలలు అగ్రిమెంట్ చేసుకున్నాక సదరు వ్యక్తి తాను దత్తత తీసుకున్న జంతువు కి రోజూ ఎంత ఆహారం అవసరమో దానికి అయ్యే ఖర్చుని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఏదన్నా జబ్బు చేస్తే దానికి అయ్యే ఖర్చుని భరించాల్సి ఉంటుంది. అలా అని ఆ జంతువు దత్తత తీసుకున్న వారి స్వంతం అవ్వదు.

**********************

అలాగే పారిశ్రామిక వేత్తలు, సినీ నటులు గ్రామాలని దత్తత తీసుకొని రోడ్లు వేయడం, మంచినీటి వసతి కల్పించడం, హాస్పిటల్స్ కట్టించడం లాంటివి చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ వాళ్ళ స్వంత డబ్బుతోనే చేసారు, చేస్తున్నారు. కానీ ఆయా దత్తత గ్రామాలు దత్తత తీసుకున్న వారి స్వంతం అయిపోయాయా? లేదే!

************************

అలాగే ఎర్ర కోటతో పాటు  దేశంలోని వివిధ చారిత్రిక కట్టడాలని దత్తత ఇవ్వడానికి పిలుపుని ఇచ్చారు ప్రధాని. అయితే పలు పారిశ్రామిక సంస్థలు దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చాయి. వీళ్ళలో అర్హత కలిగిన వాళ్ళతో కేంద్ర టూరిజం శాఖ MoU లు కుదుర్చుకుంది. అవి ఏమిటో చూద్దాం!

************************

IndiGo Airlines, GMR Groups లు పోటీ పడగా దాల్మియా భారత్ లిమిటెడ్ బిడ్ ని దక్కించుకుంది.

5 సంవత్సరాలకు 25 కోట్లు చెల్లించడానికి దాల్మియా గ్రూపు ముందుకు వచ్చింది.

ఎర్రకోటను దాల్మియా భారత్ లిమిటెడ్(Dalmia Bharat Limited) దత్తత తీసుకోవడానికి గర్వంగా భావిస్తున్నామని తన బీఫ్ లో పేర్కొంది. దాల్మియా సంస్థ ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంది కనుక కేంద్ర టూరిజం శాఖ MoU కుదుర్చుకుంది.

దాల్మియా భారత్ లిమిటెడ్ సంస్థ 2018  నుండి ఎర్రకోట ని నిర్వహిస్తున్నది. టూరిస్టు లకి సదుపాయాలు కల్పించడం, నిర్వహణ, సెక్యూరిటీ ని నిర్వహించడం వరకు చూసుకుంటున్నది.

కోర్ ఏరియా ఎదయితే ఉందొ అది భారత ఆర్కియాలజీ సంస్థ అధీనంలోనే ఉంటుంది. అక్కడికి ఎవరికీ ప్రవేశం ఉండదు.

దాల్మియా భారత్ లిమిటెడ్ సంస్థ నిర్వహణ చేస్తున్నది కేవలం నో లాస్, నో ప్రాఫిట్ సిద్ధాంతం మీదనే!

ఇక రెడ్ ఫోర్ట్ ని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఉపయోస్తున్న సంగతి తెలిసిందే! ఈ వేడుకలు జరుపుకోవడానికి అద్దె చెల్లించడం అనేది హాస్యాస్పదం!

MoU లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి దాల్మియా గ్రూపుకి ఎటువంటి చెల్లింపులు జరపబడవు అని.

అయినా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపడానికి దాల్మియా భారత్ లిమిటెడ్ 10 లక్షలు ఖర్చు పెట్టలేని స్థితిలో ఉందా?

తన పేరులో ఇండియా కాకుండా భారత్ అని పెట్టుకున్న దాల్మియా గ్రూపు అడిగితే10 కోట్లు ఖర్చుపెట్టగలదు సంతోషంగా!

లాభాలు ఆర్జించడానికి దాల్మియా గ్రూపు వేరే వ్యాపారాలు ఉన్నాయి కానీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపడానికి ప్రభుత్వం నుంచి10 లక్షలు తీసుకుంటుందా?

ఆగస్టు నెల కి రెండు వారాల ముందే ప్రధాని భద్రతను చూసే SSG ఎర్రకోటను తన ఆధీనంలోకి తీసుకుంటుంది.

ప్రధాని వచ్చి వెళ్లే దారిని మూసివేస్తుంది!ఆ పరిసర ప్రాంతాలలోకి ఎవరినీ అనుమతించదు SSG.అంటే దీనర్థం ఎర్రకోట 30 రోజుల పాటు SSG ఆధీనంలో ఉంటే కేవలం 10 లక్షల అద్దె కట్టిందా ప్రభుత్వo? మరీ అంత చవకగా ఉందా? కనీసం10 కోట్లు అని అబద్ధం ఆడినా అతికినట్లుగా ఉండేది!

**********************

2022 May లో The Wire జర్నలిస్ట్ రెడ్ ఫోర్ట్ ని దాల్మియా గ్రూపుకి అమ్మేశాడు మోడీజీ అని అబద్ధాన్ని వ్రాశాడు. ఈ శుంఠ కి దత్తత కి ఓనర్ కి తేడా తెలియదు. 5 సంవత్సరాల కాంట్రాక్ట్ ముగియగానే మళ్ళీ ఎవరు ఎక్కువకి బిడ్ వేస్తే వాళ్లకి దత్తత హక్కులు వస్తాయి.

**********************

2018 లో ఖంగ్రెస్, TMC, AAP, వామ పక్షాలు మోదీజీ దేశాన్ని అమ్మేస్తున్నాడు అంటూ గగ్గోలు పెట్టాయి. దానికి కొంచెం మసాలా జోడించి THE WIRE లాంటి వెబ్ న్యూస్ పోర్టుల్స్ అబద్ధాలని వండి వార్చాయి!

**********************

కాంగ్రెస్ చేస్తే శృంగారం-బిజెపి చేస్తే వ్యభిచారం!

2013 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు?

మరి దీనిని ఏమంటారు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురాతత్వ శాఖ-Agha Khan Trust for Culture (AKTC),Quli Qutub Shah Urban Development Authority, Agakhan Foundation  ల మధ్య 2013 లో 10 సంవత్సరాలకి గాను MoU చేసుకున్నాయి.

కుతుబ్ షా సమాధులని నిర్వహించడానికి పైన పేర్కొన్న పబ్లిక్, ప్రయివేట్ సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. మరి కుతుబ్ షా సమాధులని అమ్మేసిందా అప్పటి కాంగ్రస్ ప్రభుత్వం?

************************

ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా లో ఉన్న గండికోట లో రిసార్ట్స్ ని నిర్వహిస్తున్నన్నది ప్రయివేట్ సంస్థలు. మరి ఆ టూరిస్ట్ కేంద్రాన్ని అమ్మేసినట్లా?

***********************

రెడ్ ఫోర్ట్ MoU లో ఉన్న ముఖ్యమయిన అంశం ఏమిటంటే రెడ్ ఫోర్ట్ నుండి టికెట్ల అమ్మకాల ద్వారా మరియు ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఢిల్లీలోని స్టేట్ బాంక్ లో జాయింట్ అకౌంట్ లో జమ చేస్తారు. ASI, టూరిజం, దాల్మియా గ్రూపు ఈ మూడింటి పేరున అకౌంట్ ఉంది. వచ్చిన ఆదాయాన్ని అభివృద్ధి పనులకి వాడుతారు తప్పితే ఎవరి జేబుల్లోకి వెళ్ళదు.

************************

ఇలాంటి దుష్ప్రచారాలని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర బిజెపి IT సెల్ లది కాదా?

ఇలాంటి పుకార్లు సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్న ట్లు తెలియదా?

ఇప్పటికే కర్ణాటక పోయింది.తెలంగాణా లో ఎదో అద్భుతం జరిగితే తప్పితే అధికారంలోకి రావడం కష్టం!

*********************(

గత కొద్ది నెలలుగా బీజేపీ మద్దతు దారులు జాతీయ, రాష్ట్ర స్థాయిలో సోషల్ మీడియా లో చురుకుగా ఉండేవారు బిజెపి కి వ్యతిరేకంగా వ్రాస్తున్నారు. ఎందుకని?

పెద్దలు ఆలోచించాలి!

ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ కాంగ్రెస్ ఖర్చు పెడుతున్నది. బీజేపీ నాయకత్వం ఉదాసీనంగా ఉంది. దేశభక్తి ఉన్నా కడుపు కాల్చుకొని ఎల్లకాలం ఎవరూ బీజేపీ కి మద్దతు గా వ్రాయరు. ఇప్పటికే చాలామంది వెళ్లిపోయారు.

2024 కి ఇంకా చాలామంది వెళ్ళిపోతారు!

అందుకే గత కొద్ది కాలంగా ఒకదాని తరువాత ఇంకోటి అసత్య ప్రచారాలు ఎక్కువయ్యాయి.

సరే! అసత్య ప్రచారాలు ఖండించడానికి పార్టీ తరుపున ఎవరో ఒకరు స్పందించి వివరించకపోతే కర్ణాటక ఫలితాలు పునరావృతం అవుతాయి.

మనకి పార్టీ అధ్యక్షుల విషయంలోనే ఏకాభిప్రాయం లేదు ఇక గెలుపు విషయం గురుంచి ఎంత తక్కువ మాట్లాడుకుంటె అంత మంచిది.

*********************

ఇంత కాలం బీజేపీ కి సోషల్ మీడియా స్వచ్చంద కార్యకర్తలు అండగా ఉన్నారు కానీ స్వచ్చందం అనేది పోయి డబ్బుకు అమ్ముడుపోతున్నారు.

ఎవరి సమస్యలు వాళ్ళవి.

అమెరికా, చైనాలు వందల కోట్ల డబ్బుని వేదజల్లుతున్నాయి బాగా వ్రాయగల వాళ్ళకి.

2024 వచ్చేసరికి మరింత వేగం పుంజుకుంటుంది.

వాళ్ళు ఎలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారో తెలుసుకొని కౌంటర్ ఇచ్చే లోపలే మరో పుకారు పుట్టిస్తారు.

కర్ణాటకలో జరిగింది అదే!

మోదీజీ ని చూపించి అసెంబ్లీ, పార్లమెంట్ లకి పోటీ చేసే బీజేపీ అభ్యర్థులకు ప్రమాదం పొంచి ఉంది .

ఇప్పటికి రెండు సార్లు మోదీజీ ని చూసే ఓట్లు వేశారు.

2024 లో అలా జరగదు.

మోదీజీ గెలుస్తారు!

కాకపోతే వాజపేయి గారిలా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

తస్మాత్ జాగ్రత్త!

జైహింద్!

Wednesday 16 August 2023

 దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది? 

13 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది? 

ప్రశాంత్ పోల్

  ముంబై.. జూహు విమానాశ్రయం..

 టాటా ఎయిర్ సర్వీసెస్ కౌంటర్ దగ్గర ఎనిమిది, తొమ్మిదిమంది మహిళలు నిలబడి ఉన్నారు. వాళ్ళంతా పద్దతిగా క్యూలో నిలుచుని ఉన్నారు. అందరిలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. వాళ్ళంతా రాష్ట్ర సేవికా సమితి సేవికలు.

  వాళ్ళ ప్రముఖ సంచాలిక లక్ష్మీబాయి కేల్కర్ (మౌసీజీ) కరాచీ వెళుతున్నారు. కరాచీలో, హైదరబాద్ (సింధ్)లో అరాచక పరిస్థితుల గురించి ఒక సేవిక ఆవిడకు ఉత్తరం వ్రాసింది. ఆ సేవిక పేరు జెఠి దేవాని. దేవానిది సింధ్ లో నివసించే ఒక సాధారణ సంఘ కుటుంబం.

  జెఠి దేవాని ఉత్తరం చదివిన తరువాత మౌసీజీకి చాలా ఆందోళన కలిగింది. వెంటనే సింధ్ ప్రాంతంలోని సేవికల సహాయం కోసం అక్కడకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. రాష్ట్ర సేవికా సమితి ఏర్పడి అప్పటికి 11 సంవత్సరాలే అయింది. కానీ సమితి కార్యం వేగంగా విస్తరిస్తోంది. పంజాబ్, సింధ్, బెంగాల్ వంటి సరిహద్దు ప్రాంతాలలో కూడా రాష్ట్ర సేవికా సమితి పేరు వినిపిస్తోంది. పని సాగుతోంది.

    రేపు జిన్నా పాకిస్తాన్ జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తారు. అక్కడ స్వతంత్ర్య వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. అయినా అక్కడకు వెళ్ళాలి. అందుకనే మౌసీజీ మరొక సహచరురాలు వేణుతాయి కల్మ్ కర్ ను వెంట తీసుకుని కరాచీకి వెళ్ళడం కోసం విమానాశ్రయానికి వచ్చారు.

   40, 50మంది ప్రయాణించే ఆ చిన్న విమానంలో తొమ్మిది గజాల మహారాష్ట్ర చీర కట్టుకున్న మహిళలు వీరిద్దరే. యాత్రికుల్లో హిందువులు ఎక్కువగా లేరు. కాంగ్రెస్ లో సామ్యవాద సిద్ధాంతానికి ప్రతినిధిగా నిలచిన జయప్రకాష్ నారాయణ్ ఆ విమానంలోనే ఉన్నారు. అలాగే పునాకు చెందిన దేవ్ అనే వ్యక్తి కూడా ఉన్నారు. ఆయన్ని మౌసీజీ గుర్తుపట్టారు. కానీ వాళ్ళిద్దరూ కూడా అహ్మదాబాద్ లో దిగిపోయారు. అక్కడ మరికొంతమంది ముస్లింలు ఎక్కారు. ఇలా ఎక్కువమంది ముస్లింలు ఉన్న ఆ విమానంలో ఇద్దరే మహిళలు…!

   విమానంలో కొందరు ముస్లిం యాత్రికులు 

`పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు ఇచ్చారు. మరికొంతమంది మరింత ముందుకు వెళ్ళి `లడ్ కే లియే పాకిస్థాన్, హస్ కే లెంగే హిందూస్థాన్’(పోరాడి పాకిస్థాన్ సాదించుకున్నాం, నవ్వుతూ హిందూస్థాన్ కూడా తీసుకుంటాం) అంటూ నినాదాలు చేశారు. కానీ మౌసీజీ ఏమాత్రం తొణకలేదు. ఆమె ఆత్మవిశ్వాసం తగ్గలేదు. ఆమె మౌనంగా ఉన్నా గాంభీర్యం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చూసిన పాకిస్థాన్ సానుభూతిపరులు క్రమంగా చల్లబడ్డారు.

–0–0–0–0–

ముల్తాన్ – లాహోర్ రైలు మార్గం. నార్త్ – వెస్టర్న్ స్టేట్ రైల్వే .

  లాహోర్ కంటే ముందు స్టేషన్ రియాజాబాద్. ఉదయం 11 గం.లు అవుతోంది. ఆకాశం నిర్మలంగా ఉంది. వర్ష సూచన ఏమి లేదు. స్టేషన్లో వంద, రెండువందలమంది ముస్లింలు చేతుల్లో కత్తులు, ఇతర ఆయుధాలు పట్టుకుని నిలబడి ఉన్నారు.

  అమృత్ సర్ , అంబాల వైపు వెళ్ళే ఈ రైలు మెల్లగా స్టేషన్ లోకి ప్రవేశించింది. ప్లాట్ ఫామ్ మీద ఆయుధాలు పట్టుకున్న ఈ ముస్లిం మూకలు తప్ప ఇతరులు ఎవరు కనిపించడం లేదు. స్టేషన్ మాస్టర్ భయంతో తన క్యాబిన్ లో తలుపు వేసుకుని దాక్కున్నాడు. అతని సహాయకుడు మోర్స్ కోడ్ ద్వారా తమ ప్రధాన కార్యాలయానికి సమాచారం పంపడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ భయంతో అతని చేతులు కూడా వణుకుతున్నాయి. దానితో అతను పంపదలుచుకున్న టెలిగ్రఫీ సందేశాన్ని పంపలేకపోతున్నాడు.

   రైలు ప్లాట్ ఫామ్ పైకి వచ్చే వరకు భయంకరమైన నిశ్శబ్దంగా ఉంది. రైలు మెల్ల మెల్లగా స్టేషన్ లోకి వస్తోంది. రైలు కూతతోపాటు `దీన్ దీన్, అల్లా హొ అక్బర్’ అంటూ దిక్కులు పిక్కటిల్లే నినాదాలు కూడా వినిపించాయి..చంపు, నరుకు..అంటూ కేకలు..ముల్తాన్, పశ్చిమ పంజాబ్ లోని గ్రామాల నుంచి అన్నీ కోల్పోయి భారత్ లో తలదాచుకునేందుకు వస్తున్న హిందువులు, సిక్కు శరణార్ధులు ఈ కేకలతో భయకంపితులయ్యారు. వారి భయాన్ని నిజం చేస్తూ ముస్లిం మూకలు ఒక్కసారిగా రైలు పెట్టెలలోకి దూరి కనిపించిన వారిని కనిపించినట్లుగా తమ కరకు కత్తులకు ఎర చేశాయి.

   తన గదికి ఉన్న కిటికీ గుండా ఈ మారణకాందను స్టేషన్ మాస్టర్ చూస్తూనే ఉన్నాడు. కానీ ఏమి చేయలేదు. ముస్లిం మూకలు మొదటి దాడిలోనే 21 మంది హిందువులు, సిక్కులను చంపేశారు. భయంతో కేకలు పెడుతున్న ఆడవాళ్ళను, పిల్లలను ముస్లిం గూండాలు భుజాలపైకి ఎత్తుకుని విజయోత్సాహంతో పరుగులు పెట్టారు. ఇంకా ఎంతమంది హిందువులు, సిక్కులను చంపేశారో తెలియదు. ఇక్కడ జరిగిన నరసంహారం గురించి పై అధికారులకు టెలిగ్రాఫ్ ద్వారా తెలియజేయమని తన సహాయకుడిని ఆదేశించాడు స్టేషన్ మాస్టర్.

  పంజాబ్ అంతటా సెన్సార్ షిప్ అమలులో ఉండడం వల్ల ఇలాంటి ఘోర సంఘటనలు ఇంకెన్ని బయటకు రాకుండా దాచిపెట్టరో…!

–0–0–0–0–

కరాచీ..

   రేపు పాకిస్థాన్ స్వాతంత్ర్యం పొందడానికి ముందు భారత్, పాకిస్థాన్, బ్రిటిష్ అధికారుల మధ్య ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది.

   భారత, పాకిస్థాన్ ల మధ్య అధికార విభజన సులభంగా జరపడం కోసం ఈ సమావేశం ఏర్పాటుచేశారు. వాణిజ్యం, సమాచార ప్రసార, మౌలిక సదుపాయాల కల్పన, రైల్వేలు, కస్టమ్ మొదలైన శాఖల గురించి కూడా చర్చ జరిగింది. ప్రస్తుతం సంయుక్త భారత్ (విభజనకు ముందు ఉన్నది) లో ఈ శాఖలకు సంబంధించి ఏ విధానాలు, పద్దతులు అవలంబిస్తున్నారో వాటినే మార్చ్ , 1948వరకు యధాతధంగా కొనసాగించాలని నిర్ణయించారు. మార్చ్ తరువాత రెండు దేశాలు తమ తమ విధానాలు, పద్దతులను రూపొందించుకుని అమలు చేసుకుంటాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ వ్యవస్థ కూడా మార్చ్ వరకు రెండు దేశాలకు ఒకటే ఉంటుంది. అప్పటి వరకు రెండు దేశాల పౌరులు ఎలాంటి ఆటంకాలు లేకుండా రాకపోకలు సాగించవచ్చును.

–0–0–0–0–

ఢిల్లీ..

   నెహ్రూ ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు ఏమిటంటే దేశం వదిలి పోతున్న బ్రిటిష్ అధికారుల స్థానంలో యోగ్యులైన భారతీయ అధికారులను ఎంపిక చేసి, నియమించడం. అఖండ భారత్ లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన విలియం పాట్రిక్ స్పెంజ్ పదవి విరమణ చేస్తారు. ఆ స్థానంలో ఎవరిని నియమించాలి?… కొన్ని పేర్లు వచ్చాయి. అయితే వాటిలో నుంచి గుజరాత్ కు చెందిన హరిలాల్ జయకిషన్ చంద్ కానియాను ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని నిర్ణయించారు.

  సూరత్ కు చెందిన కానియా మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వారు. 1930లో ఆయన ముంబై హై కోర్ట్ లో న్యాయమూర్తిగా ఉన్నారు. 57 ఏళ్ల కానియా ప్రస్తుతం హై కోర్ట్ లో ఉప న్యాయమూర్తిగా ఉంటున్నారు. ప్రస్తుతపు న్యాయమూర్తిగా ఉన్న పాట్రిక్ స్పెంజ్ భారత పాకిస్థాన్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యూనల్ కు ఛైర్మన్ గా కానియానే నియమించారు.

–0–0–0–0–

ప్యారిస్…

  ఆజాద్ హిందూ ఫౌజ్ ద్వారా పోరాటం చేస్తున్న అనేకమంది భారతీయ సైనికులు జర్మనీ లోని బ్రిటిష్ , ఫ్రెంచ్ ప్రాంతాల్లో సమావేశమయ్యారు. ఈ సైనికులు ఇప్పుడు ఎలాంటి వీసా లేకుండా ఎక్కడికైనా వెళ్లవచ్చును. ప్యారిస్ లోని భారతీయ సైనిక కేంద్రం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ సైనికుల్లో హరవంశ లాల్ కూడా ఉన్నారు. ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ లో లెఫ్టినెంట్ గా ఉన్నారు. మిగిలిన సైనికులతోపాటు ఆయన కూడా భారత్ వస్తారు.

–0–0–0–0–

151, బెలియాటాక్, కలకత్తా…

హైదరి భవనం….మధ్యాహ్నం 3 గం.లు..

  సోధెపూర్ ఆశ్రమం నుంచి గాంధీజీ కారులో హైదరి మహల్ కు చేరుకున్నారు. ఆయనతోపాటు మను, మహదేవ్ భాయ్, మరో ఇద్దరు కార్యకర్తలు కూడా ఉన్నారు. వారి వెనుక వస్తున్న మరో కారులో ఇంకో నలుగురు కార్యకర్తలు ఉన్నారు. ఈ మధ్యనే వర్షాలు బాగా కురిసాయి. దారి అంతా బురదగా ఉంది. హైదరి మహల్ ఎదురుగా అనేకమంది గుమికూడారు. వారిలో ఎక్కువమంది హిందువులే.

  గాంధీజీ కారు వచ్చి ఆగిన వెంటనే ఆయన పేరుతో పెద్ద పెట్టున నినాదాలు మొదలయ్యాయి. అయితే అవి ఆయన స్వాగతం చెపుతూ మాత్రం కాదు. తిట్లు, శాపనార్ధాలతో ఆ నినాదాలు ఉన్నాయి. ఇలాంటి నినాదాలు విన్న వెంటనే గాంధీజీ కాస్త ఇబ్బంది పడ్డారు. కానీ ముఖంలో ఎలాంటి భావాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.

  `గాంధీజీ వెళ్లిపొండి, నౌఖాలి వెళ్ళి హిందువులను రక్షించండి, మొదట హిందువులకు రక్షణ – ఆ తరువాతే ముస్లింలకు స్థానం, హిందూ ద్రోహి గాంధీ, వెళ్లిపో, వెళ్లిపో’ అంటూ నినాదాలు మిన్నుముట్టాయి. ఈ నినాదాలతోపాటు రాళ్ళు, సీసాల వర్షం కూడా ప్రారంభమయింది. మెల్లగా నడుస్తూ వెలుతున్న గాంధీజీ శాంతంగా ఉండమని చేతితో సంజ్ఞ చేశారు. ప్రజలు కాస్త తగ్గారు.

  తక్కువ స్వరంలో గాంధీజీ ఇలా అన్నారు – “నేను ఇక్కడకు హిందువులు, ముస్లిములకు సమానంగా సేవచేయడానికి వచ్చాను. మీకు రక్షణగా నేను ఇక్కడే ఉంటాను. మీకు కావాలంటే నాపై నేరుగా దాడి చేయవచ్చును. నేను మీతోనే ఉంటాను. ఇక్కడ ఉంది నౌఖాలి హిందువుల ప్రాణాలను కూడా రక్షిస్తున్నాను. ముస్లిం నాయకులు నాకు మాట ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరు కూడా కలకత్తా ముస్లింలకు ఎలాంటి హాని తలపెట్టకండి.’’

ఇలా చెప్పి గాంధీజీ నెమ్మదిగా హైదరాలీ మహల్ లోకి వెళ్ళిపోయారు …..!

 కానీ ప్రజలలో సహనం కొద్దిసేపే ఉంది. సుహ్రవర్దీ అక్కడికి రావడంతోటే అక్కడ గుమికూడిన జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అయిదువేలమంది హిందువుల హత్యకు కారణమైన సుహ్రవర్దీ ఎదురుగా కనబడితే ఏ హిందువైన ఎలా శాంతంగా ఉండగలుగుతాడు? దానితో జనం హైదరి మహల్ చుట్టూ చేరారు. వారిలో కొద్దిమంది యువకులు రాళ్ళు విసిరారు.

భారత్ లో గాంధీజీ ఇలాంటి ప్రతికూల పరిస్థితులు, తిట్లు, చీవాట్లు ఇంతకు ముందు ఎప్పుడూ ఎదురుకాలేదు….!

–0–0–0–0–

ఉదయం 10.30 గం.లకు జూహు విమానాశ్రయం నుంచి బయలుదేరిన మౌసీజీ విమానం అహ్మదాబాద్ లో కొద్ది సేపు ఆగిన తరువాత నాలుగున్నర గంటలు ప్రయాణించి 3.గం.లకు కరాచీ విమానాశ్రయంలో దిగింది.

  మౌసీజీ అల్లుడు చోల్కర్ విమానాశ్రయానికి వచ్చారు. మౌసీజీ కుమార్తె వాత్సల భర్త చొల్కర్. వత్సలకు చదువుకోవాలని చాలా ఆసక్తి ఉండేది. అది గమనించిన మౌసీజీ టీచర్ ను ఇంటికే పిలిపించి చదువు చెప్పించారు. వత్సల కూడా రాష్ట్ర సేవికా సమితి కార్యంలో నిమగ్నమయింది. కరాచీలో సమితి శాఖ పెట్టడంలో ఆమె చాలా కృషి చేసింది.

  విమానాశ్రయానికి 15, 20 మంది సేవికలు కూడా వచ్చారు. రక్షణ దృష్ట్యా కొద్దిమంది స్వయంసేవకులు కూడా ఉన్నారు. ఒక సేవికకు చెందిన కారులో మౌసీజీ బయలుదేరారు. ఆమె వెనుకనే వీరంతా వెళుతున్నారు…

–0–0–0–0–

రాష్ట్ర సేవిక సమితి సంచాలిక మౌసీజీ కరాచీ విమానాశ్రయానికి చేరిన సమయంలోనే గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ విమానం కూడా కరాచీలో దిగింది.

  మౌంట్ బాటన్, ఆయన భార్య ఎడ్విన మౌంట్ బాటన్లు విమానం నుంచి దిగారు. వారికి స్వాగతం చెప్పడానికి కొత్తగా ఏర్పడనున్న పాకిస్థాన్ కు చెందిన ఉన్నతాధికారులు సిద్ధంగా ఉన్నారు. అక్కడ జిన్నా మాత్రం లేరు. జిన్నా, ఆయన సోదరి ఫాతిమా అధికార నివాస భవనంలో తమ కోసం ఎదురుచూస్తున్నారని అధికారులు మౌంట్ బాటన్ దంపతులకు తెలియజేశారు.

  కరాచీలో ఉన్న సింధ్ గవర్నర్ బంగాళాయే ప్రస్తుతం జిన్నా అధికారిక నివాసం. విక్టోరియా రాజా పద్దతిలో నిర్మించిన ఈ భవంతిని ఈ రోజు ప్రత్యేకంగా అలంకరించారు. బంగాళా మొత్తం హాలీవుడ్ సెట్టింగ్ మాదిరిగా కనిపిస్తోంది. అలాంటి అట్టహాసం మధ్య జిన్నా, అతని సోదరి ఫాతిమా మౌంట్ బాటన్ దంపతులకు ఘనస్వాగతం పలికారు…!

–0–0–0–0–

లాహోర్,

మధ్యాహ్నం…4 గం.లు…

  ముజాహిద్ తాజ్దీన్ మందిర్ మార్గ్ లో రొట్టెలు అమ్ముకునే ఒక సాధారణ వ్యాపారి. ఈ రోజు అతని మనస్సు అల్లకల్లోలంగా ఉంది. అతని స్నేహితులంతా ముస్లిం నేషనల్ గర్డ్స్ కార్యకర్తలే. వారితోపాటు అక్కడ పనిచేసే ముస్లిం కానిస్టేబుళ్ల ద్వారా అతనికి ఒక సమాచారం తెలిసింది. మందిర్ మార్గ్ లోని పెద్ద గురుద్వారాను ఈ రోజు పూర్తిగా ధ్వంసం చేయబోతున్నారని. పైగా అది కూడా పుణ్యకార్యమేనని వాళ్ళు అతనికి చెప్పారు కూడా.

  తాజ్దిన్ కు రొట్టెల అమ్మకం తప్ప ఏమి తెలియదు. కానీ తాను విన్న విషయం అతనిపై ప్రభావం చూపింది. మధ్యాహ్నానికే దుకాణం మూసేసి గురుద్వారాపై దాడికి ఇతరులతోపాటు సిద్ధమయ్యాడు.

  లాహోర్ లోని మందిర్ మార్గ్ లో ఉన్న గురుద్వారా సిక్కులకు చాలా విశేషమైనది. మహారాజా రంజిత్ సింగ్ ఈ గురుద్వారాను కట్టించారు. 1619లో గురు హరగోవింద్ సింగ్ జీ, దివాన్ చందు తో పాటు లాహోర్ వచ్చారు. అప్పుడు ఆయన ఎక్కడ నివసించారో ఆ స్థానంలోనే ఈ గురుద్వారా నిర్మించారు.

  గురుద్వారాలో ప్రతిరోజూ క్రమం తప్పకుండా అర్దాస్, లంగర్ జరుగుతాయి. గురుద్వారా రక్షణ కోసం నిహంగ్ సంత్ లు కత్తులతో పహారా కాస్తుంటారు. కానీ వాళ్ళు కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. చాలా మంది సిక్కులు వ్యాపారులే. ఉదయం పూట వ్యాపారం జోరుగా సాగుతుంది. అందుకని దాదాపు అందరూ రాత్రిపూటే గురుద్వారాకు వస్తారు. ఇప్పుడు అక్కడ చాలా తక్కువమంది ఉన్నారు.

   సరిగ్గా 4. గం.లకు ముస్లిం నేషన గార్డ్స్ ఈ గురుద్వారపై దాడి చేశారు. తాజ్దిన్ అందరికంటే ముందున్నాడు. అందరికంటే ముందు పెట్రోల్ బాంబు అతనే విసిరాడు. అన్నీ రకాల ఆయుధాలతో హఠాత్తుగా విరిచుకుపడిన 40, 50 మంది ముస్లిం గూండాల ముందు నలుగురు నిహంగ్ సంత్ లు ఎంతసేపు నిలవగలుగుతారు…? అయినా అసామాన్యమైన ధైర్యసాహసాలను ప్రదర్శిస్తూ వాళ్ళు ముగ్గురు, నలుగురు ముస్లింలను నరికారు. ఎనిమిదిమందిని గాయపరచారు. కానీ ఆ నలుగురు నిహంగ్ సంత్ లు రక్తపు మడుగులో ఒరిగిపోయారు.

మహారాజ రంజిత్ సింగ్ ద్వారా నిర్మితమైన ఈ పవిత్ర గురుద్వారా నిర్దోషులైన సిక్కుల రక్తంతో తడిసిపోయింది.

–0–0–0–0–

పెషావర్..

  `నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్’(NWFP) రాజధాని. పెషావర్ కోటలోని తన విశాలమైన నివాసంలో 70ఏళ్ల ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఏదో ఆలోచిస్తూ కూర్చుని ఉన్నారు… చుట్టూ ఎవరు లేరు.. ఆయన మాత్రం విచారంగా ఉన్నారు..

   ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ది పేరులాగానే చాలా భారీ వ్యక్తిత్వం. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ కు చెందిన ముఖ్యమైన నాయకుడు. ఆయన గాంధీగారి పరమ భక్తుడు. అందుకనే ఆయనకు `సరిహద్దు గాంధీ’ అనే పేరు కూడా వచ్చింది. కానీ పఠాన్ లలో ఆయన `బాద్షా ఖాన్’ అనే తెలుసు. ఈ కొండ ప్రాంతంలోని గిరిజన తెగలకు చెందిన వారందరినీ కాంగ్రెస్ జెండా కిందకు తీసుకు వచ్చింది గఫార్ ఖాన్ గారే.

    అందుకనే 1945 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ముస్లింలు అధికంగా ఉన్నప్పటికి కాంగ్రెస్ గెలుపొందింది. ముస్లిం లీగ్ కు పెద్దగా సీట్లు రాలేదు. ఇక ఇప్పుడు విభజన తప్పదని స్పష్టమైపోయిన తరుణంలో ఎటువైపు వెళ్ళాలి అనేది పఠాన్ ల ముందున్న ప్రశ్న. పఠాన్ లు, పాకిస్థాన్ పంజాబ్ ల మధ్య వైరం ఈనాటిది కాదు. అందువల్ల ఈ ప్రాంతానికి చెందిన పఠాన్ లంతా భారత్ లో కలవాలని భావించారు. ప్రాంతీయ అసెంబ్లీలో కూడా అందరూ దీనికే సమ్మతి తెలిపారు. ఒక్క భౌగోళికమైన దూరం ఒక్కటే సమస్య. అయితే మరి తూర్పు, పశ్చిమ పాకిస్థాన్ ల మధ్య కూడా వందల మైళ్ళ దూరం ఉందికదా అనే ప్రశ్న వచ్చింది. కాశ్మీర్ భారత్ లో విలీనం అయిపోతే ఈ భౌగోళిక సమస్య కూడా పరిష్కారం అయిపోతుంది. ఎందుకంటే గిల్గిట్ దక్షిణ ప్రాంతం నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ సరిహద్దునే ఉంది.

  కానీ వాళ్ళ మొత్తం ప్రణాళికకు నెహ్రూ మోకాలు అడ్డుపెట్టారు. `అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా నిర్ణయించాలి’అన్నది నెహ్రూ వాదన. కాంగ్రెస్ సమావేశంలో కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణను సర్దార్ పటేల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఏ దేశంలో విలీనం కావాలో ప్రాంతీయ అసెంబ్లీ నిర్ణయిస్తుందని పటేల్ అన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే పద్దతిని అనుసరించాము కాబట్టి ఇక్కడ కూడా అలాగే చేయాలని ఆయన అన్నారు.

  ఎక్కడెక్కడ ముస్లిం జనాభా ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలు పాకిస్థాన్ లో విలీనం అవుతున్నట్లుగానే నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ రాజ్యం భారత్ లో విలీనం కావాలి. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పాలనలో ఉంది. కానీ నెహ్రూ తన పట్టు వదలలేదు. `నేను ప్రజాస్వామ్యవాదిని’ అంటూ నెహ్రూ ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిందేనని వాదించారు.

  బాద్షా ఖాన్ కు తమ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపించాలని నిర్ణయించినట్లు పత్రికల ద్వారా తెలిసింది. ఏ వ్యక్తి ముస్లిములు అధికంగా ఉన్న ప్రాంతంలో కూడా కాంగ్రెస్ ను గెలిపించాడో, ఆ ప్రాంతాన్ని గురించి నిర్ణయం తీసుకునే ముందు కనీసం ఆ వ్యక్తిని సంప్రదించాలన్న ఆలోచన కూడా నెహ్రూకు కలగలేదు. అందుకనే ప్రజాభిప్రాయ సేకరణ వార్త విన్నవెంటనే విచారంలో మునిగిపోయిన గఫార్ ఖాన్ ` కాంగ్రెస్ ఈ ప్రాంతాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి ముస్లిం లీగ్ కు అప్పగిస్తోంది’ అని బాధపడ్డారు…!

  ఈ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ 20 జులై, 1947 న ప్రారంభమయింది. పది రోజులపాటు సాగింది. ఈ ప్రక్రియకు ముందు, తరువాత కూడా ముస్లిం లీగ్ మతపరమైన భావనలను బాగా రెచ్చగొట్టింది. దానితో కాంగ్రెస్ పూర్తిగా పక్కకు తప్పుకుంది. `నెహ్రూ తప్పిదానికి ఇక్కడి ప్రజలు ఎలాంటి మూల్యం చెల్లించుకోవలసి వస్తుందో’ అంటూ గఫార్ ఖాన్ విచారించారు.

  ఈ ప్రజాభిప్రాయ సేకరణ వట్టి మోసమే. ఏ గిరిజన ప్రాంతాలపై గఫార్ ఖాన్ ప్రభావం బాగా ఉందో ఆ ప్రాంతాల ప్రజలకు ఓటింగ్ లో పాల్గొనే అవకాశమే ఇవ్వలేదు. మొత్తం 35 లక్షల జనాభాలో కేవలం ఐదు లక్షల 72వేల మందికి మాత్రమే ఓటింగ్ హక్కు ఉన్నదని తేల్చారు. సవత్, అంబా, చిత్రాలయిన్ తాలూకాల్లో ఓటింగే జరగలేదు.

  ఎంతమందికి ఓటు హక్కు ఉన్నదో వారిలో కూడా కేవలం 51శాతం మాత్రమే ఓటు వేశారు. ఈ ప్రాంతాన్ని పాకిస్థాన్ లో విలీనం చేయాలని కోరుకునేవారికోసం పచ్చ డబ్బా, భారత్ లో కలవాలనేవారి కోసం ఎర్ర డబ్బా పెట్టారు. పచ్చ డబ్బాలో 2 లక్షల 89 వేల వోట్లు, ఎర్ర డబ్బాలో 2 లక్షల 87 వేల ఓట్లు పడ్డాయి. అంటే 36 లక్షల ప్రజల్లో కేవలం మూడు లక్షల మంది మాత్రమే పాకిస్థాన్ కు ఓటు వేశారు.

`నెహ్రూ, గాంధీజీ మమ్మల్ని అనాధాలుగా వదిలేశారు. అదికూడా ఈ పాకిస్థానీ తోడేళ్ళ ముందు…’అంటూ గఫూర్ ఖాన్ మనస్సులో తీవ్రమైన అసంతృప్తి ఆగ్రహం పెల్లుబికాయి…

  పెషావర్, కోహట్, బాను, స్వాత్ ప్రాంత ప్రజలు మనం భారత్ లో కాలుస్తున్నామా అంటూ ప్రశ్నించినప్పుడు వారికి ఏం సమాధానం చెప్పాలో సరిహద్దు గాంధీకి అర్ధం కాలేదు.

–0–0–0–0–

కరాచీ..

జిన్నా ఇల్లు…రాత్రి తొమ్మిదయింది..

  పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం ముందు రోజు సాయంత్రం జిన్నా ఒక విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. మౌంట్ బాటన్ దంపతులతోపాటు కొన్ని దేశాల రాయబారులు కూడా ఆ విందుకు హాజరయ్యారు. ఖరీదైన మధ్యం ఎరులై పారింది. కానీ ఆ విందు ఏర్పాటు చేసిన జిన్నా మాత్రం అన్య మనస్కంగా ఉన్నారు.

   విందు ప్రారంభం కావడానికి అతిధి ఉపన్యాస కార్యక్రమం ఉంటుంది. జిన్నా ఇలా మొదలు పెట్టారు – “యువర్ ఎక్సలేన్సీ, యువర్ హైనెస్, హిజ్ మేజేస్టి సామ్రాట్ దీర్ఘ, ఆరోగ్యవంతమైన జీవనాన్ని కోరుకుంటూ ఈ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. జూన్ 3న జరిగిన సమావేశంలో నిర్ణయించిన అంశాలను మీరు ఎంత చక్కగా, నైపుణ్యంతో అమలు చేశారో, అందుకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. పాకిస్థాన్, అలాగే హిందూస్థాన్ లు తమ కృషిని ఎప్పటికీ మరచిపోవు..’’

   విచిత్రమైన విషయం ఏమిటంటే ఇస్లాం కోసం, ఇస్లాం సిద్ధాంతాల కోసం ఏర్పడుతున్న దేశపు స్వాగతం మద్య ప్రవాహం మధ్య పలుకుతున్నారు…!

–0–0–0–0–

   ఆకాశవాణి, లాహోర్ కేంద్రం. రాత్రి 11గం.ల 50 నిముషాలు అయింది. ఇలా ప్రకటన వెలువడింది – “ఇది ఆకాశవాణి లాహోర్ కేంద్రం. తదుపరి ప్రకటన కోసం వేచి ఉండండి.’’ తరువాత 10 ని.లు వాయిద్య సంగీతం ప్రసారమయింది.

సరిగా 12 గం.ల 1 ని.కి…..

  “అస్లామ్ ఆలేకుమ్. పాకిస్థాన్ బ్రాడ్ కాస్టింగ్ సర్వీస్ కు స్వాగతం. లాహోర్ నుంచి ప్రసారాలు…కుబూల్ – ఏ – సుబహ్ – ఆజాదీ ‘’!!

ఆ విధంగా పాకిస్థాన్ ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ప్రకటన జరిగింది….!

Sunday 13 August 2023

భారతీయ న్యాయ సంహిత

పదునైన దంతాలు & దవడలను జోడిస్తూ క్రిమినల్ చట్టాన్ని మార్చడానికి మోడీ ప్రభుత్వం ల్యాండ్ మార్క్ బిల్లులను ప్రవేశపెట్టింది!

బ్రిటీష్ కాలం నాటి క్రిమినల్ చట్టాలను పునరుద్ధరించడానికి భారతీయ శిక్షాస్మృతి (IPC) స్థానంలో భారతీయ న్యాయ సంహితను ఏర్పాటు చేయనున్నారు!!


మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన ప్రతిదీ:


🔸భారత శిక్షాస్మృతి రద్దు చేయబడి, భారతీయ న్యాయ సంహిత బిల్లు, 2023తో భర్తీ చేయబడుతుంది


🔸క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023


🔸సాక్ష్యాధారాల చట్టం భారతీయ సాక్ష్యా బిల్లు, 2023కి దారి తీస్తుంది


🔥 లాయర్లు మరియు న్యాయమూర్తులు చేతులు కలిపి పనిచేసే సర్జికల్ స్ట్రైక్ తరీఖ్ పే తారీఖ్ వ్యవస్థ.


ఎలా?👇🏾👇🏾👇🏾


నిర్ధిష్ట సమయపాలన నిర్దేశించబడిన సమయానుకూల విచారణ, విచారణ & తీర్పుల ప్రకటన


🔥మాబ్ లిన్చింగ్ కేసులు:


మాబ్ లిన్చింగ్ కేసుల్లో ఉరిశిక్ష విధించడం.


మొత్తం సమూహానికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు లేదా 7 సంవత్సరాల కంటే తక్కువ ఉండని జైలు శిక్ష విధించబడుతుంది.


దర్యాప్తు సంస్థకు హెచ్చరిక -- నేరారోపణ నిష్పత్తి తప్పనిసరిగా 90% కంటే ఎక్కువగా తీసుకోవాలి


🔥విద్రోహ చట్టం "రద్దు చేయబడింది".


చింతించకు. ఇది తుక్డే-తుక్డే గ్యాంగ్ లేదా నక్సల్స్ లేదా టెర్రరిస్టులకు స్వేచ్ఛనివ్వదు.


ఎలా?👇🏾👇🏾👇🏾


ప్రతిపాదిత చట్టంలో కేవలం "విద్రోహం" అనే పదం లేదు. భారత్ సార్వభౌమత్వం, ఐక్యత మరియు సమగ్రతకు హాని కలిగించే చట్టాల కోసం సెక్షన్ 150 ద్వారా దాని స్థానంలో ఉంది. ఇప్పటికీ జీవిత ఖైదు శిక్షార్హమైనది.


క్లుప్తంగా చెప్పాలంటే.... "విద్రోహం" అనే పదాన్ని సవాలు చేస్తూ కేసులను పలుచన చేసేందుకు ప్రయత్నిస్తున్న ఆ సిక్యులర్‌లు & వారి లాయర్ల లాబీకి గట్టి ఝలక్! ఇప్పుడు... అన్ని ఛాలెంజ్ అప్పీళ్లు కొట్టివేయబడ్డాయి, అదే శిక్షతో విచారణ కొనసాగుతుంది.


🔥రేప్ కేసులు:


మైనర్లపై అత్యాచారానికి మరణశిక్ష విధించే నిబంధనలు (పోక్సో చట్టం వలె)


అపరిపక్వ మీడియా, సోషల్ మీడియా & ఫాక్ట్ చెకర్స్ అని పిలవబడే వారికి కఠినమైన పాఠాలు బోధించడానికి....రేప్ బాధితుల గుర్తింపును బహిర్గతం చేసినందుకు శిక్షకు సంబంధించిన నిబంధనలు చట్టంలో జోడించబడ్డాయి.


🔥ఇది ఖచ్చితంగా IPC లేదా CRPC పేరు మార్చడం కంటే ఎక్కువ కాదు. ఇది దాని కంటే చాలా ఎక్కువ.


మరి మీరు నిశితంగా గమనిస్తే....

మోడీ ప్రభుత్వం వలసవాద బ్రిటీష్ చట్టాలను తొలగించడమే కాకుండా, క్రిమినల్ చట్టాలకు కఠినతను జోడిస్తోంది, అదే సమయంలో "భారతీయుడు" స్థానంలో "భారతీయ"గా ఉంది.


🔥🔥భారత్ వైపు భారత ప్రయాణం 2014లోనే మొదలైంది, ఇప్పుడు.... దానికి లీగల్ కాస్ట్యూమ్ ఇచ్చే ప్రయాణం మొదలైంది.


మరియు గుర్తుంచుకోండి, చట్టం పోలీసుల ప్రకారం పనిచేయదు, పోలీసులు చట్టం ప్రకారం పని చేస్తారు. కాబట్టి మొదటి చట్టం అమలులోకి రావాలి


మరియు న్యాయవ్యవస్థ దాని స్వంత తీర్పును ఇవ్వదు, అది పోలీసు విచారణపై ఆధారపడి ఉంటుంది


కాబట్టి ప్రక్రియ..


చట్టం

పోలీసు

న్యాయవ్యవస్థ


ఓపిక పట్టండి, ఇది సుదీర్ఘమైన ప్రక్రియ మరియు కొంతమంది రాజకీయ తలలేని కోడి SC లాయర్లలా ప్రవర్తించకండి


https://t.me/DGPIndia/30624


Modi Government tables Land Mark Bills to change face of Criminal Law while adding sharp teeth & jaws!


Indian Penal Code (IPC) set to be replaced by Bharatiya Nyaya Sanhita to revamp British-era criminal laws!!


Everything important you must know:


🔸Indian Penal Code to be repealed & replaced with Bharatiya Nyaya Sanhita Bill, 2023 


🔸Code of Criminal Procedure Code to be replaced by Bharatiya Nagarik Suraksha Sanhita, 2023


🔸Evidence Act will make way for Bharatiya Sakshya Bill, 2023


🔥 Surgical Strike tareekh pe tareekh system where lawyers and judges work hand in hand.


How?👇🏾👇🏾👇🏾


SPECIFIC TIMELINES prescribed for time bound investigation, trial & pronouncement of judgements 


🔥Mob Lynching Cases:


Provision of Capital Punishment in mob lynching cases.


The Entire group shall be punished with death or with imprisonment for life or imprisonment for a term which shall not be less than 7 years.


Warning to Investigating Agency -- Conviction Ratio must be taken above 90%


🔥Sedition Law “has been repealed”.


Don't worry. It won't give free hand to Tukde-Tukde Gang or Naxals or Terrorists.


How?👇🏾👇🏾👇🏾


The proposed law does not JUST have the word "sedition". It's replaced by Section 150 for Acts endangering the sovereignty, unity and integrity of Bharat. STILL punishable with life imprisonment.


In short....tight slap to those Sickulars & their Lawyers Lobby which were trying to dilute cases by challenging the word “Sedition"! Now....all challenge appeals dismissed while proceedings stay with same punishment.


🔥Rape Cases:


Provisions for death penalty for rape of minors (same as POCSO Act)


To teach hard lessons to Immature Media, Social Media & so-called Fact Checkers....Provisions for punishment for disclosing the identity of rape survivors, added in law.


🔥It's definitely not above changing name of IPC or CRPC. It's much more than that.


And if you minutely observed....

Modi Govt is not only getting rid of Colonial British Laws, but adding stringency to Criminal Laws while replacing “Indian" to “Bhartiya”.


🔥🔥Journey of India towards Bharat had started in 2014 itself, Now.... Journey to give it Legal Costume has started.


And remember, law doesn't work as per police, police work as per law. So first law need to be in place


And judiciary doesn't pass judgement of its own, it depends on police investigation


So the process is..


Law

Police

Judiciary


Have patience, it's a long process and don't behave like few political headless chicken SC Lawyers


https://t.me/DGPIndia/30624

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...