Wednesday 26 January 2022

Dandibhotla Viswanatha Sastry

Only a few years ago, the Chinese discovered some sanskrit documents in Lhasa, Tibet and sent them to the University of Chandrigarh to be translated. These documents contain directions for building interstellar spaceships!

Their method of propulsion, she said, was “anti- gravitational” and was based upon a system analogous to that of “laghima,” the unknown power of the ego existing in man’s physiological makeup, “a centrifugal force strong enough to counteract all gravitational pull.”

According to Ashta Siddis, it is this “laghima” which enables a person to levitate. (This was shown in recent hollywood movie ‘Ant Man‘ ).

These machines, which were called “Astras” by the text, the ancient Indians could have sent a detachment of men onto any planet, according to the document, which is thought to be thousands of years old. The manuscripts were also said to reveal the secret of “antima”; “the cap of invisibility” and “garima”; “how to become as heavy as a mountain of lead (used by Hanuman in Ramayana to cross ocean and reach Lanka).”

Naturally, Indian scientists did not take the texts very seriously, but then became more positive about the value of them when the Chinese announced that they were including certain parts of the data for study in their space program!

This was one of the first instances of a government admitting to be researching anti-gravity.

PS: Due to the secrecy of covert operations during WW2 not much details are divulged

Saturday 22 January 2022

 త్యాగరాజస్వామి ఆరాధన

నాదబ్రహ్మకు నాదనీరాజనం

"శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి" అని ఆర్యోక్తి.
’సంగీత మపి సాహిత్యం
సరస్వత్యా స్తనద్వయం
ఏకమాపాతమధురం
అన్యదాలోచనామృతం’
భగవతర్పన కోసం కుల మత భాష వర్గ బేధాలు లేని ఏకైక సాధనం సంగీతం. సంగీత త్రిమూర్తులలో అగ్రగణ్యుడు, నాదోపాసన చేసిన నాదలోలుడైన భగవంతుని సేవించిన నాదయోగి త్యాగయ్య. సంగీత కుటుంబాలన్ని ఒకటిగా చేసిన మహానుభావుడు.

డిసెంబర్ జనవరి నెలలు మొదలవగానే దక్షిణభారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులో ప్రతి వీధి, ప్రతి గృహము మధురమైన సంగీతనాదంతో ప్రతిధ్వనిస్తుంది. ఆ ప్రతిధ్వని ఈ నాడు పాశ్చాత్య దేశాలకు కూడా పాకింది. చెన్నయ్ నగరంలో ప్రతిరోజూ సాయం సమయాలలో చలిని కూడా లెక్కచేయకుండా కళాభిమానులందరూ ఏదో ఒక సంగీత కార్యక్రమానికి హాజరు అయి తీరుతారు.
ఇంతటి సందడికి కారణం పుష్య బహుళ పంచమి నాడు రాబోయే త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు.
తెలుగునాట త్యాగరాజస్వామి వారి పేరు వినని వారు వుండరంటే అది అతిశయోక్తి కాదు. ఏ శుభ సందర్భమైనా దేవాలయాల్లో ఏ పర్వదినమైనా ఆయన కీర్తనలు వినబడకుండా వుంటే ఆ కార్యక్రమం అసంపూర్ణంగా మిగిలిపోతుంది. త్యాగయ్యమీద విడుదలైన సినిమాలవల్లనే కావచ్చు, అనేక ఇతర సినిమాలలో వాడుకున్న ఆయన పాటల ప్రభావమే కావచ్చు. టివిలలో జరిగే పాటలపోటీలవల్లే కావచ్చు, తిరిగిత్యాగరాజస్వామివారి కీర్తనలు బహుజన ప్రాచుర్యం పొందాయన్న మాట మాత్రం వాస్తవం.
ఇవన్ని ఒకఎత్తైతే ప్రతి సంవత్సరం తిరువయ్యూరులో జరుగుతున్న ఆరాధన ఉత్సవాలు మరొక ఎత్తు.సంగీత సాహిత్యాలను గంగా యమునలతోనూ, అంతర్లీనంగా వున్న భక్తిభావాన్ని సరస్వతితోనూ పోల్చి త్యాగబ్రహ్మ కీర్తనలను త్రివేణి సంగమంగా అభివర్ణించారు వాగ్గేయకారులు.
దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు పర్యటిస్తూ అక్కడ దేవాలయాలలోని దేవుళ్ళ మీద కీర్తనలను వ్రాసిన త్యాగయ్య ప్రముఖంగా రాముడిమీదనే కొన్ని వందల కీర్తనలు వ్రాసాడు. కొన్ని వందలమంది శిష్యులకు ఆయన స్వయంగా శిక్షణ ఇవ్వ బట్టే ఆయన కృతులు శాశ్వతంగా తరువాతి తరాలకు అందించబడ్డాయి. మొదట్లో కొన్ని సంస్కృతంలో కీర్తనలు వ్రాసినా, సింహభాగం అచ్చ తెలుగులోనే, అందరికీ అర్ధమయ్యేభాషలోనే వ్రాసాడనటం నిర్వివాదాంశం.
ఆ మహాయోగి, తనకు మరణ సమయం ఆసన్నమవుతున్నదని తెలుసుకొని అంతకు కొన్ని రోజులముందే సన్యాసాశ్రమం స్వీకరించి త్యాగబ్రహ్మ త్యాగరాజస్వామిగా మారాడని, 1847 జనవరి 6నలో సిద్ధిపొందిన త్యాగరాజు పార్ధివశరీరాన్ని ఆయన శిష్యులు ఆయన కోరిక మేరకు తిరువయ్యూరుకు తూర్పున కావేరీ నదీ తీరాన సమాధి చేసారని చరిత్ర చెప్పుతున్నది.
అక్కడే తులసి వనం ఏర్పాటు చేసి ఆ రోజుల్లో తులసి బృందావనం అని వ్యవహరించేవారు.
ప్రతిఏటా పుష్య బహుళ పంచమి నాడు ఆయన శిష్యులు సమాధి వద్ద 40 సంవత్సరాల పాటు నివాళులు అర్పించి తమ భక్తి శ్రద్ధలను చాటుకొనేవారు. ఆ తరువాత ఎవరి ప్రాంతాలలో వారు ఆరాధనలు నిర్వహించటం మొదలెట్టారు.
సమాధి శిధిలావస్థకు చేరుకొనే సమయాన కొందరు శిష్యులు విరాళాలు సేకరించి సమాధికి మరమ్మత్తులు చేయించి ఒక పూజారిని సంరక్షకుడిగా నియమించారు. అప్పటి నుండి, అంటే 1907 నుండి ఆరాధన పేరుతో భజనలు కచేరీలూ చేయసాగారు.
మెల్లిమెల్లిగా ఆ నోటా ఈ నోటా ఈ సంగతి వూరూరా పాకి భక్తిశ్రద్ధలతో ఆ నాటికి తిరువయ్యూరు చేరుకొని కచేరీలలో పాలు పంచుకోవటం కూడా మొదలయింది.
ఇది ఇట్లా వుండగా 1925లో బెంగుళూరు నాగరత్నమ్మ అనే సంగీత విద్వాంసురాలికి కలలో త్యాగరాజు కనిపించి ఆయన సమాధి దర్శించాలన్న కోరికతో తిరువయ్యూరు చేరుకున్నది. అక్కడ కేవలం సమాధి, దాని చుట్టూ తులసివనం తప్పమిగతా ప్రాంతమంతా తుప్పలూ మొక్కలతో అస్తవ్యస్తంగాకనిపించి, అక్కడ స్వామివారికి ఒక మందిరం కట్టించాలని సంకల్పించి తన ఆస్తులు అమ్మగా వచ్చిన ధనం వినియోగించి సమాధి చుట్టూ ప్రాకారం కట్టే పనులకు శ్రీకారం చుట్టింది.
అప్పటి నుండి 13 ఏళ్ళవరకు ప్రతిఏడూ నాగరత్నమ్మ సమాధివద్దకు నిరాటంకంగా వెళ్ళివస్తూ వుండగా అక్కడ ఒక సమాధిమందిరం కట్టాలన్న ఆలోచన వచ్చింది. కొంతకాలం ఆ ప్రదేశంలో రామ విగ్రహం పెట్టాలా, త్యాగరాజ విగ్రహం పెట్టాలా, అన్న సందిగ్ధం వచ్చి చివరకు త్యాగరాజస్వామి విగ్రహమే పెట్టాలన్న తీర్మానానికి వచ్చి 1939లో త్యాగరాజ విగ్రహ స్థాపన జరిగింది.
1957లో మందిర గోడలపైన పాలరాతిఫలకాలపైన త్యాగరాజకృతులు చెక్కించి వాల్మీకి మంటపాన్ని కట్టి వాల్మీకి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు.
ఆ మరుసటి సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా ఆ మందిరంలో ఆరాధన వుత్సవాలు జరుగుతూనే వున్నాయి.
వుదయం ఉంఛవృత్తి చేసి, ఆ పిమ్మట భజన చేస్తూ, ఆయన నివాస స్థలమైన తిరుమంజనవీధి నుండి బయలుదేరి ఆయన సమాధివరకు ఊరేగింపుగా వస్తారు.
ఒకపక్కన మందిరంలో స్థాపించిన స్వామి వారి విగ్రహానికి అర్చన అభిషేకాదుల వంటి వైదిక కర్మలు జరుగుతూ వుండగానే ఆవరణలో వున్న సంగీతకారులందరూ ఏక కంఠంతో ఆయన ఘనరాగంలో రూపొందించిన ప్రఖ్యాతమైన ఘనరాగ పంచరత్న కీర్తనలని ఆయనకు నివాళిగా గానం చేయటం ఒక సాంప్రదాయం. ఇక్కడ కేవలం గాత్రమే కాదు. ఏ వాయిద్యంలో నిష్ణాతులైన వారు ఆ వాద్య పరికరం మీద ఆ కీర్తనలను వాయిస్తారు.
పాల్గొనేవారంతా మహా విద్వాంసులే అనుకోవటం పొరపాటు. అప్పుడే సంగీతం నేర్చుకుంటున్న వారు కూడా పంచరత్న కీర్తనలను కరప్త్రాలలో చూస్తూ పాడటం గమనించవచ్చు.
ఈ శుభ ఘడియ కోసం సంవత్సరం పొడుగూతా ఎదురు చూస్తున్న గాయకులు వాద్యకారులు ఆ నాటికి అక్కడికి తప్పనిసరిగా చేరుకోవటంతోనే వారి భక్తి శ్రద్దలు ద్యోదకమవుతాయి.
ఎందరో ప్రతిష్టాత్మకమైన పదవులలో వున్నవారు కూడా తారతమ్యం లేకుండా సాంప్రదాయమైన దుస్తులలో అక్కడ ఆరాధన వుత్సవంలో పాల్గొనటం విశేషం. పంచలు కండువాలూ, ఘనమైన పట్టుచీరలు, పట్టుపరికిణీలు ఓణీలు, నుదిటిన విభూతి కుంకుమ బొట్టు, తమిళనాట సంవత్సరం పొడుగూతా దొరికే మల్లెచెండ్లు కనువిందు చేస్తూ, భారతీయ సాంప్రదాయమంటే ఇది అని చూపించటం మనకెంతో గర్వకారణం.
ప్రపంచవ్యాప్తిగా సంగీతప్రియులంతా ఒక్కవేదికమీద కలవటానికి కారణమైన ఈ మహోన్నత కార్యక్రమానికి మూలమైన మహానుభావుడు తెలుగువాడవటం కూడా మనం గర్వించదగ్గ విషయం.
తిరువయ్యూరులోనే కాక మన ఆంధ్రదేశంలో కూడా త్యాగరాజ ఆరాధన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించటం కనిపిస్తున్నది.
ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా వెళ్ళటానికి వీలులేనివారి సౌకర్యార్ధం దూరదర్శన్ లోని వివిధ చానెళ్ళు తిరువయ్యూరు నుండి ప్రత్యక్షప్రసారం చేయటం ముదావహం.
తెలుగు భాష వున్నంతవరకు త్యాగరాజు ప్రతిభ, సంగీతం వున్నంతవరకు, ఘనరాగ పంచరత్నాలతో పాటు ఇతర మధురమైన కీర్తనలు స్మరణకు వస్తూంటాయనటంలో ఎటువంటి సందేహమూ లేదు.
సంగీత ప్రియులమంతా కలిసి ఈ త్యాగరాజ ఆరాధనలో పాలు పంచుకొని భక్తిశ్రద్దలతో నివాళులర్పించుదాము.

Thursday 20 January 2022

 "రాణి వేలు నాచియార్"    "వీరమంగై ( వీరవనిత )"


◆ మనలో చాలామంది 1857 లో జరిగిన సిపాయిల తిరుగుబాటే బ్రిటిష్ వారిమీద తొలి స్వాతంత్ర్య పోరాటం అనుకుంటారు.. కానీ భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ( బ్రిటిష్ ) వారిపై పోరాటం సాగించిన మొట్టమొదటి వ్యక్తి "రాణి వేలు నాచియార్". ఈమె ధైర్యసాహసాలకి గుర్తుగా తమిళులు ఈమెమీద అభిమానంతో వీరమంగై ("వీరవనిత") అని పిలుచుకుంటారు..అంతకుముందు 16 వ శతాబ్దంలో కర్ణాటకకు చెందిన అబ్బక్క చౌతా పోర్చుగీస్ వారి మీద సుధీర్ఘ పోరాటం జరిపి నాలుగు దశాబ్దాల పాటు వారిని నిలువరించి ఎందరో స్వాతంత్ర్య సమరయోధులకు స్ఫూర్తిగా నిలిచారు..
◆ తమిళనాడు , రామనాడు ( ప్రస్తుత రామనాధ్ పురం జిల్లా - రామేశ్వరం ) రాజ్యాన్ని పరిపాలించిన రాజా చెల్లముత్తు విజయరఘునాథ సేతుపతి , రాణి సాకందిముత్తల్ ల ఏకైక పుత్రిక. "రాణి వేలు నాచియార్" 3 జనవరి 1730 న జన్మించారు. ఆ రాజ దంపతులకు పుత్ర సంతానం లేదు.
◆ రాణి వేలు నాచియార్ చిన్నతనం నుండే యుద్ధవిద్యలలో ఆరితేరింది. కత్తిసాము, విలువిద్య, గుర్రపుస్వారీ, వలరి, సిలంబం(కర్రసాము) వంటి యుద్ధనైపుణ్యాలలో దిట్ట. అంతే కాదు,
ఫ్రెంచి, ఆంగ్లము మరియు ఊర్దూ మొదలగు
బహుభాషలలో కోవిదురాలు... ఆవిడకి తన పదహారవ ఏట, శివగంగై రాజైన మన్నార్ ముత్తువడుగనాథ పెరియవ ఉడైతేవర్ తో వివాహంజరిగింది. వీరికి ఒక పుత్రిక కూడా జన్మించింది.
◆ 1772 బ్రిటీష్ వాళ్ళు శివగంగ రాజ్యం మీద దండెత్తారు.. 'కైలయార్ కోయిల్' యుద్ధంలో ఈమె భర్తను బ్రిటిష్ సైనికులు, ఆర్కాట్ నవాబు కొడుకు కలిసి హతమార్చారు. దీంతో నాచియార్ యుద్ధానికి సన్నద్ధమైంది. కానీ తగిన సైన్యం లేకపోవడంతో దిండిగల్ వద్ద విరూపాక్షి ప్రాంతంలో పలయకారర్ గోపాల నాయక్కర్ అండలో తన కుమార్తెతో కలిసి ఎనిమిదేళ్లపాటు తలదాచుకోవలసి వచ్చింది.
◆ ఈ కాలంలోనే గోపాల్ నాయకర్, సుల్తాన్ హైదర్ అలీ సహకారంతో సైన్యాన్ని సమకూర్చుకుని, 1780 లో బ్రిటిష్ వారిపై సమరశంఖం పూరించింది "వీరమంగై వేలు నాచియార్". ఈస్ట్ ఇండియా కంపెనీ ( బ్రిటిష్ ) వారి ఆయుధాగారన్ని కనుగొని తన సేనా నాయికురాలైన కుయిలి ఆత్మాహుతి ద్వారా నాశనం చేసింది
"ఉడైయాల్" అనే స్త్రీ సేనను పోరాటంలో మరణించిన తన దత్తపుత్రిక పేరుతో స్థాపించింది. తన సాహసంతో రాజ్యాన్ని తిరిగి కైవశం చేసుకుంది. ఎన్నో కష్టాలకోర్చి చివరికి తన రాజ్యాన్ని తిరిగి సంపాదించిన అతికొద్దిమందిలో నాచియార్ ఒకరు..
తదనంతరం హైదర్ ఆలీ సైన్యం సహాయంతో ఆర్కాట్ నవాబును కూడా ఓడించి, వీరవనిత అనే నామాన్ని సార్ధకం చేసుకొంది.
◆ 1790 సంవత్సరంలో తన కుమార్తె 'వెల్లచ్చి' కి రాజ్యాధికారాన్ని అప్పగించిన "రాణి వేలు నాచియార్" 25 డిసెంబర్ 1796 లో మరణించారు.. ఆమెను "జోన్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఇండియా" అని పిలుస్తారు. "వీరమంగై రాణి వేలు నాచియార్" స్మృతిలో భారత ప్రభుత్వం 2008 లో ఒక పోస్టల్ స్టాంపు ను కూడా విడుదల చేసింది..
ఇటువంటి ఎందరో వీరులను వీరమాతలను కన్న "మేరా భారత్ మహాన్"....

Wednesday 19 January 2022

ఒక ప్రయాణీకుల రైలు మొత్తం మాయం అయిపోయిన అరుదైన వివరాలు

కొన్నేళ్ల క్రితం భారతీయ రైల్వేకు సంబంధించిన ఒక ప్రయాణీకుల రైలు మొత్తం మాయం అయిపోయిన అరుదైన వివరాలు తెలుసుకోండి.
ఈ రైలు పోయిన నెల 18న (18 డిసెంబర్2019)ఒక చిన్న రైల్వే స్టేషన్లలో చాలా ఊహించని విధముగా బయటపడింది. టిన్ సుకియా
అనే ఊరికి నలభై కిలోమీటర్ల దూరంలో దొరికింది. ఈ టిన్ సుకియా చైనాకు అనుకోనివున్న అరుణాచల ప్రదేశ్ కు దగ్గరగా అంటే ఎనభై కిలోమీటర్లు దగ్గరలో ఉంటుంది.గౌహతి నుంచి 480 కిలోమీటర్లు.
ఎప్పుడో 1976లో ఆ పల్లెటూరులో మెయిన్ ట్రాక్ మీద నిలపడనికి స్థలం లేక , వాడకం లేని , రైల్వే పరిభాషలో చెప్పాలంటే disused sliding , కొద్దిగా దూరంలో , రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రాక్ మీద వుండమన్నారు.


రైల్వే రికార్డ్స్ ప్రకారం ఆ రైలు
16 జూన్ 1976 ఉదయం 11.08 నిముషాలకు ఆ స్టేషన్ చేరుకొంది. రైలు ఇంజిన్ ను విడదీసి, స్టేషన్కు తెప్పించి ట్రాక్ మీద వున్న గూడ్స్ బండి లాగడానికి వాడినట్టు ఉంది.
అదే రోజు 11.31 నిముషాలకు కుంభవృష్టిగా వర్షం కురిసింది
రైల్వే బోర్డు వారు నియమించిన కమిటీ తేల్చినదేమిటంటే, రైల్వే ట్రాక్ నిర్వహణ సిబ్బంది ఆ సమయంలో ట్రాక్ రిపైర్లు, వర్షం ముంపు వుండే ప్రాంతాల్లో పర్యవేక్షణ, విపరీతంగా కురిసిన వర్షాలవల్ల వొచ్చేపోయే రైళ్ల క్రమబద్ధీకరణ నిర్వహణలో మునిగిపోయారు. ఆ చిన్న రైల్వేస్టేషన్ అతిగా కురిసిన వర్షాలకు ఐదు ఆరు అడుగుల నీటిలో మునిగిపోయివుంది.
ఆ రైలులో ఉన్న ప్రయాణీకులు అందరూ దిగి వారి వారి గమ్యాలకు చేరుకొన్నారు, సహజంగానే చాలా ఇబ్బందులు పడుతూ, అక్కడ ఉన్న గ్రామీణుల సహకారంతో కొద్దిమంది లబ్ది పొందారు.
ఇదే సమయంలో ఆ రైల్వేస్టేషన్ మాస్టారు, కొద్దిమంది సిబ్బంది బదలీలమీద వేరే ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు.
ఈ లోపల మిగిలిన సిబ్బంది , అధికారులు, మెయిన్ స్టేషన్ నుంచి అసలు వాడకం లేని రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రాక్ మీద వున్న ఈ రైల్ పెట్టెల గురించి పూర్తిగా మర్చిపోయారు.పైగా అటువైపు జనసంచారం ఉండదు.నెమ్మది నెమ్మదిగా ప్రకృతి తనపని తాను చేసుకుపోయింది. ఆ రైలు చుట్టూ పొదలు , చెట్లు పెరిగాయి.
మిగిలిన ట్రాక్ మీద రైళ్ల రాకపోకలు, మనుష సంచారం లేకపోయేసరికి , ఆ రైలు పెట్టెలు, ట్రాక్ మొత్తం చిన్నాపెద్దా పొదలతో చెట్లు వృక్షాలుగా ఎదిగాయి. సముద్రంలో మునిగిపోయిన ఓడల్లో ఎలాగైతే సముద్రజీవులు ఆవాసం ఏర్పరుచుకుంటాయో అలా ఆ రైలు బండిలో పక్షులు, పాములు, జంతువులు , క్రూరమృగాలు నివాసం ఏర్పరుచుకున్నాయి.
కాలం గడుస్తోంది, ఆ సెక్షన్లలో ఉన్న సిబ్బంది రిటైర్మెంట్ పొందారు, కొద్దిమంది స్వర్గస్థులయ్యారు. ఆ రైల్ గురించి అందరూ మర్చిపోయారు. ఆ ట్రైన్ ను అక్కడికి తెచ్చిన డ్రైవర్ డేనియల్ స్మిత్ సెప్టెంబర్1976లో ఆస్ట్రేలియాకు వలస వెళ్ళిపోయాడు.
పోయిన సంవత్సరం(2019) డిసెంబర్ ఇదో తారీఖు నాడు, నాసావారి ఉపగ్రహం ఆ ప్రాంతాన్ని మ్యాప్పింగ్ చేస్తున్నప్పుడు (ఆసియ ఆఫ్రికా ప్రాంతాలను)తీసిన ఫోటోలలో ఈ రైలుబండి కనిపించి కనిపించకుండా అనుమానాస్పదంగా కనిపించింది దట్టంగా పెరిగిన వన సంపదవలన.
ఘనత వహించిన నాసా వారు ఇదేదో భారత ప్రభుత్వ రహస్య ప్రాజెక్ట్ అని అనుమానించారు. సరే ఇది మన పనికాదు అని పెంటగన్ వారికి సమాచారం అందించారు.
నాలుగైదు రోజుల్లోనే ఆ ప్రాంతంలో అనూహ్యమైన ఉపగ్రహ సంచారం భారత దేశ ఇస్రో వారు గమనించారు.
ఇస్రో వారికి అర్ధంకాలేదు ఎందుకు ఇన్ని దేశాల ఉపగ్రహాలు ఆ ప్రదేశంలో సంచరిస్తున్నాయి ఆని? విషయమేమిటో తెలుసుకోవడాని కోసం ఆ ప్రాంతంలో అని వారు కూడా ఫోటోలు తీశారు మన ఉపగ్రహంతో.
ఈ లోపల మనం రహస్యంగా పోషిస్తున్న చైనా , రష్యాలో ఉన్న గుఢచారులు RAWకు (మన దేశ గూఢచారి వ్యవస్థ) ఈ వింతైన , అనూహ్యమైన , భారతదేశ ఉపరితలంపై వివిధదేశాల ఉపగ్రహ సంచారాన్ని అది కూడా చైనా సరిహద్దుల్లో సంచరిస్తున్న విషయాన్ని తెలియచేసారు.
ఇహ వెంటనే ప్రమాధఘంటికలు మొగసాగాయి, ఇదేమైనా భారతదేశ సివిలియన్ కానీ మిలట్రీ వ్యవహారం అవ్వొచ్చ? అని వివిధ దేశాలకు అనుమానం వొచ్చింది.
భారత దేశం తరఫు నుంచి విషయం ఏమిటి అని పరిశోధన మొదలైంది.PMO ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు,, DIA, డిఫెన్స్ గూఢచార సంస్థ,NIA, జాతీయ పరిశోధక సంస్థ, CCS, కేబినెట్ భద్రతా కమిటీ, MoD, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్,
అందరూ కలిశారు.
అంతర్గత మెమో ఒకటి సంబంధిత శాఖలకు పంపించారు. అందుకు జవాబుగా IHQ, ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ వారు,Space Command and SFC (Strategic Forces Command) వారు మేము ఆటువంటి రైలును మెమోలో చెప్పబడిన ప్రదేశంలో ఉంచలేదు అని బదులిచ్చారు.
ఆ తరువాత జరిపిన ఆకాశ రెక్కీలోనూ ( యుద్ధ విమానాలతో), మన ఉపగ్రహ ఫోటోల వల్లను మన భారత దేశ వైమానిక దళం మరియు (ARC) ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ వారు ఆప్రదేశంలో కనిపించీ కనిపించనట్టు ఒక రైలుబండి ఆ అడవిలాంటి ప్రాంతంలో పూర్తిగా కప్పబడి ఉంది అని నిర్ధారించారు.
మొత్తానికి ఒక నిజనిర్ధారణ పార్టీ ఏర్పడింది విషయం ఏమిటి అని తెలుసుకోవడానికి.
ఆ పార్టీలో ఉన్నవారి వివరాలు మనము సాధారణంగా వినివుండం కూడా.
ఆ సెర్చ్ పార్టీలో MARCOS అంటే మెరికల్లాంటి మెరైన్ కమాండోస్ మరియు GARUD's దేశ వైమానిక దళానికి సంబంధించిన గరుడా కమండోస్ వున్నారు. వారితో పాటు ఒక ఉన్నత స్థాయికి చెందిన గూఢచారి అధికారి కలిసి ఎవరికి తెలియకుండా అత్యంత రహస్యంగా విషయం తెలుసుకోవడానికి వెళ్లారు.
అదండి నలభై మూడేళ్ళ క్రితం మాయమైపోయిన రైలు బండి కధ.
నమ్మకశక్యం కాకపోయినా ఎన్నో దేశాలు, ఎన్నో దేశాల వివిధ పరిశోధనా సంస్థలు
ఉత్సాహం చూపిన,
భారతదేశ భూభాగంలో చైనా సరిహద్దుల్లో జరిగిన సంఘటన.

Sunday 16 January 2022

ఇండియన్ హెర్క్యులెస్'  కలియుగ భీమ, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్,వీరకంఠీరవ, ప్రముఖ మల్లయోధుడు, బలశాలి కోడి రామ్మూర్తి నాయుడు గారి వర్థంతి సందర్భంగా


గుండె మీద ఒకటిన్నర టన్ను బరువును మోపితే చిరునవ్వుతో మోసేవారు. ఉక్కు సంకెళ్లతో ఒంటిని బంధిస్తే ఊపిరితిత్తుల నిండా గాలి బిగించి రెండు క్షణాల్లో తెంపేసేవారు. ఏనుగు ఛాతీ మీదకు ఎక్కితే ఐదు నిమిషాల పాటు ఆ బరువును మోయగలిగేవారు. ఆయన పేరు కోడి రామ్మూర్తి నాయుడు. సిక్కోలు తొలితరం నిజమైన కథానాయకుడు. వెండితెరపై వెలిగిపోయిన బాహుబలికి బాబు లాంటి వారు. వందేళ్ల కిందట ఆయన చేసిన విన్యాసాలను ఈ తరం దాదాపు మర్చి పోయింది. సిక్కోలు కీర్తి బావుటాను దేశవిదేశాల్లో సగర్వంగా ఎగురవేశారు.

మన పురాణాలలో బలానికి మారుపేరు శ్రీ ఆంజనేయాడు,మరియు భీముడు అలాగే గ్రీక్ పురాణాలలో బలానికి పేరుగాంచినవాడు హెర్క్యులస్ కాబట్టి పాశ్చాత్యులు అప్పట్లో ఇండియన్ హెర్క్యులెస్ గా బ్రిటన్ పాలకులైన కింగ్ జార్జ్, క్వీన్ మేరీ ల చే బకింగ్ హమ్  ప్యాలెస్  లో వారితో విందు తీసుకొని బిరుదు పొందిన మహానుభావుడు శ్రీ కోడి రామ్మూర్తి గారు ఇంకా కలియుగ భీమ, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ వంటి బిరుదులను కూడా సొంతం చేసుకున్నరు. కోడి రామ్మూర్తి నాయుడు గారు ఈపేరు నేటి యువతకు అంతగా పరిచయము లేని  పేరు ఈయన ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు మల్ల యోధులు పురాణాలలో భీముడి గురించి విన్నాము గాని చూసే అదృష్టము లేదు కానీ కలియుగ భీముడిగా ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు.రామ్మూర్తి నాయుడు గారు. 

కోడి రామ్మూర్తినాయుడు 1883 నవంబరు 8న జిల్లాలోని వీరఘట్టంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అప్పలకొండమ్మ, వెంకన్ననాయుడు.

కోడిరామ్మూర్తి తండ్రి పోలీస్‌శాఖలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేసేవారు.

 రామ్మూర్తినాయుడు వీరఘట్టంలోని కూరాకుల వీధి పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. ఆయనకు చిన్న వయస్సు నుంచి వ్యాయాంపై ఎక్కువ మక్కువ చూపేవారు. రోజూ వేకువజామున వీరఘట్టం రాతి చెరువు సమీపాన వ్యాయామం చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఆ రహదారిలో వెళ్తున్న ఒక వ్యక్తి కోడి రామ్మూర్తినాయుడు చేస్తున్న వ్యాయామ సాధన చూసి ముగ్ధుడై ఆయనకు యోగా నేర్పించే వారు. అప్పటి నుంచి మరింత సాధన చేసి ప్రావీణ్యం సంపాదించారు. విజయనగరంలో ఎస్‌ఐగా పనిచేస్తున్న కోడి వెంకట్రావునాయుడు అనే తన బంధువు ఇంట్లో విద్య అభ్యాసం కొనసాగిస్తూ తనకు ప్రీతిపాత్రమైన వ్యాయామ విద్యలో అసాధారణ ప్రతిభ చూపించారు. మరింత మందికి అందించాలని భావించిన రామ్మూర్తి నాయుడు వ్యాయామ ఉపాధ్యాయునిగా విజయనగరంలోని సేవలను అందించారు.

విజయనగరంలో పొట్టి పంతులు అనే మిత్రుని సలహా, సహకారంతో రామ్మూర్తి సర్కస్ కంపెనీ నెలకొల్పారు. రామ్మూర్తి సర్కస్ కంపెనీ పలుచోట్ల ప్రదర్శనలిచ్చి మంచిపేరు తెచ్చుకుంది. 1912లో మద్రాసులో సర్కస్‌ను ఏర్పాటు చేశారు. పులులు, ఏనుగులు, గుర్రాలతో రామ్మూర్తి చేసే బల ప్రదర్శనలు అందరినీ ఆకర్షించేవి'' అని ఆయన వివరించారు.

''శరీరానికి కట్టిన ఉక్కు గొలుసును ముక్కలు చేయడం, రెండు కార్లను భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకుని... వాటిని కదలకుండా చేయడం, ఛాతీపై ఏనుగును ఎక్కించుని 5 నిమిషాల పాటు అలాగే ఉండటం వంటి ప్రదర్శనలు చూసేందుకు రామ్మూర్తి సర్కస్ ఎక్కడుంటే అక్కడికి తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చేవారు. సర్కస్ కంపెనీ ద్వారా రామ్మూర్తి నాయుడు కోట్ల రూపాయలు సంపాదించారు". 

*అప్పట పూనాలో లోకమాన్య తిలక్‌ కోరిక మేరకు ప్రదర్శనలిచ్చారు. దీంతో తిలక్‌ రామ్మూర్తికి మల్లమార్తాండ, మల్లరాజ తిలక్‌ బిరుదులిచ్చారు. విదేశాల్లోనూ ప్రదర్శనలు ఇవ్వాలని ప్రోత్సహించారు. 

*హైదరాబాద్‌లో ఆంధ్రభాషా నిలయం పెద్దలు ఘనసత్కారం చేసి జగదేకవీర బిరుదునిచ్చారు. 

*అప్పటి వైస్రాయి లార్డ్‌ మింటో రామ్మూర్తి ప్రదర్శనలు చూ డాలని వచ్చి తనే కారును నడుపుతూ ఆ కారును రామ్మూర్తి ఆపేయడం చూసి ముగ్ధుడైపోయాడు. 

*అలహాబాదులో అఖిల భారత కాంగ్రెస్‌ సభ జరిగింది. రామ్మూర్తి సర్కస్‌ అక్కడ ప్రదర్శనలిచ్చింది. జాతీయ నాయకులెందరో చూసి అభినందించారు. పండిత మదనమోహన మాలవ్యా ఎంతగానో మెచ్చుకున్నారు.   

*లండన్‌లో రాజదంపతులు జార్జిరాజు, రాణి మేరి రామ్మూర్తి ప్రదర్శనలకు అభిమానులైపోయారు. వారే తమ రాజభవనానికి ఆహ్వానించి ‘ఇండియన్‌ హెర్క్యులస్‌’ బిరుదునిచ్చారు. 

*స్పెయిన్‌లోని బుల్‌ ఫైట్‌లో రామ్మూర్తి పంతులు పాల్గొన్న తీరును వేలాది మంది ప్రేక్షకులు మెచ్చుకున్నారు.  

*జపాన్, చైనా, బర్మాలలో రామ్మూర్తి ప్రదర్శనలు ఎంతో వైభవంగా సాగాయి. 

ఓ పుస్తక కథనం ప్రకారం కోడి రామ్మూర్తిలో ప్రతి భాపాటవాలు బయటపడడానికి ఓ సంఘటన దోహదపడింది. అప్పట్లో ఆయన విజయనగరంలో ఉండేటప్పుడు.. అదే నగరానికి చెందిన పేర్ల రామ్మూర్తి శెట్టి ఇంటి ముందట కాలువలో ఓ ఎద్దు పడిపోయింది. ఆ జమిందారు 20 మంది బలవంతులను రప్పించి ఎద్దును బయటకు లాగడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. సరిగ్గా అదే సమయానికి అటుగా వస్తున్న రామ్మూర్తిని చూసి జమిందారు హాస్యంగా ‘అదిగో మన శాండోగారు వస్తున్నారు. మీరంతా తప్పుకోండి. తను ఒక్కరే ఆ ఎద్దును బయటపడేయగలడు’ అని అన్నారు. దీంతో రామ్మూర్తి ఆ ఎద్దు పరిస్థితిని గమనించి దాని వద్దకు వెళ్లి మెడను, వెనుక కాళ్లను, తోకను గట్టిగా పట్టుకుని ఒకే ఉదుటన బయ ట పడేశారు. దీంతో రామ్మూర్తిలోని అసలు బలం అందరికీ ఆ ఘటనతోనే తెలియవచ్చింది.  

పూనాలో లోకమాన్య తిలక్ గారి కోరిక మేరకు ప్రదర్శనలిచ్చాడు. తిలక్ రామమూర్తిగారికి మల్లమార్తాండ, మల్లరాజ తిలక్ బిరుదములిచ్చారు. విదేశాలలో భారత ప్రతిభను ప్రదర్శించమని ప్రోత్సహించాడు తిలక్.

లండన్లో రాజదంపతులు జార్జిరాజు, రాణి మేరి, రామమూర్తిగారి ప్రదర్శనలను చూచి తన్మయులయ్యారు. రామమూర్తిగారిని తమ బక్కింగి హామ్‌ రాజభవనానికి ఆహ్వానించి, విందు ఇచ్చిన తర్వాత 'ఇండియన్ హెర్కులస్' బిరుదంతో సత్కరించారు.

జపాన్, చైనా, బర్మాలలో రామ్మూర్తి ప్రదర్శనలు ఎంతో వైభవంగా సాగాయి.

ఒకప్పుడు 1985–1995 మధ్య కాలంలో కోడి రామ్మూర్తినాయుడు జీవిత చరిత్రపై తెలుగులో ఒక పా ఠ్యాంశం ఉండేది. కాలక్రమేణా సిలబస్‌ మారడంతో ఆ పాఠ్యాంశాన్ని తొలగించారు. ఇలాంటి మహానుభావుల జీవిత చరిత్రలు విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తాయి. ప్రభుత్వం ఆయన ఘనతను గుర్తించి సముచిత స్థానం కల్పించాలి.

ఒకసారి బర్మాలో హత్యాయత్నం జరిగాక ఆయన ప్రదర్శనలకు అడ్డు పడింది. 

 ఎంత డబ్బు గడించారో అంత కంటే గొప్పగా దానాలు కూడా చేశారాయన. ఆఖరి రోజుల్లో ఆయన కాలిపై రాచపుండు వచ్చి కాలే తీసేయాల్సి వచ్చింది. శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఎలాటి మత్తుమందును (క్లోరోఫామ్‌) తీసుకోలేదని ఓ పుస్తకంలో పేర్కొని ఉంది. ప్రాణాయామం చేసి నిబ్బరంగా ఉండిపోయారట. చివరిరోజులు బలంఘర్, పాటా్నలో కలహండి (ఒడిశా) పరగణా ప్రభువు పోషణలో ఉంటూ 1942 జనవరి 16న కన్ను మూశారు.

కోడి రామ్మూర్తినాయుడు పుట్టిన వీరఘట్టంలో, విశాఖ, శ్రీకాకుళం పట్టణాల్లో ఆయన విగ్రహాలు పెట్టారు. ఏయూలో జిమ్‌కు, శ్రీకాకుళంలో స్టేడియానికి ఆయన పేరు పెట్టారు.

 గొడుగు పాలుడు అనే భూమా నాయని కథ-

మనం విజయ నగర సామ్రాజ్య వైభవం గూర్చి చెప్పుకున్నపుడు ఎంత సేపూ రాయల విజయాలు, భువనవిజయ సాహిత్య విశేషాలు , రాయలు కట్టించిన ఆలయాలు , పరిపాలనా వైభవం వీటిని గూర్చి మనం ఎన్నెన్నో చెప్పుకుంటాము కదా!!

మరి రాయల ఆంతరంగికులు,సేవకులు ,రాయల విజయాలలో తోడ్పడిన వారు అందరినీ గూర్చి తెలియక పోయినా కొందరు గూర్చి మనకు తెలిసే ఉంటుంది. అలాంటివారిలో గొడుగు పాలుడు ఒకడు. ఈ గొడుగు పాలుని అసలు పేరు భూమా నాయుడు. ఈతడు గండికోట ప్రాంతంలో నుండి ఆనాడు తన రాజ భక్తిని ప్రదర్శించి విజయనగర సామ్రాజ్య రాజధాని హంపికి చేరుకుని అక్కడ సాక్షాత్ రాయల వారి అనుగ్రహం సంపాదించాడు.కేవలం అనుగ్రహమేనా చిరకీర్తినీ ఆర్జించాడు తన ఉన్నత మానసత్వముతో.
గొడుగు పాలుని ప్రత్యేకత ఏమిటీ అంటే మహా అశ్వాలను సైతం తట్టుకుని వాటితో పాటు పరుగు పెట్టే సామర్థ్యం కలిగినవాడు. రాయల వారు రాచ నగరులో విహారానికి వెళ్లినా, యుద్ధ క్షేత్ర సందర్శనకు వెళ్లినా,తిరుమల ఆలయాన్ని సందర్శించడం కోసం రాచ మహలు హంపి నుండి కదలి వచ్చినా ఎక్కడకు పోతే అక్కడకు తెల్లని వారాహ ధ్వజం కట్టిన చలువ ఛత్రాన్ని పట్టుకుని రాయల మీద ఎండ కన్ను పడకుండా చూసేవాడు.
విజయనగర సామ్రాజ్యమునకు రాజధానులు హంపి, ఘనగిరి గా పేరుగాంచిన పెనుగొండ, చంద్రగిరి. వేసవి కాలము రాయలవారు పెనుగొండలో సేద దీరేవారు. అప్పటిలో శిక్షలు వేస్తే ఆ శిక్షల అమలు పెనుగొండ లోనే జరిగేవి. రాచ మహల్లో జరిగిన అనేక గుప్త హత్యలకు పెనుగొండ సాక్షీభూతం.
ఓ సంవత్సరం సాహితీ సమరాంగణ సార్వభౌములు శ్రీకృష్ణ దేవ రాయలు పెనుగొండలో ఉన్న కోటకు అంతః పుర దాస దాసీ జనంతో సహా వేసవి విడిది అయిన పెనుగొండకు విచ్చేసారు. అక్కడ ఉన్న చలువరాతి మండపాలు, మహళ్ళ లో అందరూ సేద తీరారు.
హంపి కి అపుడే విచ్చేసిన శృంగేరి పీఠాధిపతులు విరూపాక్ష ఆలయములో జరుగుతున్న ప్రత్యేక క్రతువునకు కు రాయలవారు రావలసిందిగా ఆరాధన జరిగే త్రయోదశి నాడు వారు తప్పక అక్కడ ఉండాల్సిందిగా ఆజ్ఞాపించారు. ఈ విషయం రాయల వారికి వార్తాహరులు మరియు పీఠాధిపతి శిష్యులు పెనుకొండకు చేరవేశారు.
కేవలము కొన్ని గంటల్లో త్రయోదశి ఘడియలు ముగుస్తాయి.హంపికి పెనుగొండకు అశ్వికుల దారిలో వెడితే నూట ఇరువది మైళ్ళు,అదే భూగర్బ రహదారి సొరంగములో వెడితే ఎనుబది మైళ్ళు అయినా ప్రయాణ వ్యవధి ఎక్కువ అవుతుంది. రాయలు త్వరగా ఆలయానికి చేరుకోవాలని తన అశ్వాన్ని కొంతమంది మహావీరులు అయిన ఆంతరంగికులు మాత్రం వెంబడించగా గుఱ్ఱము మీద అశ్వికుల దారిలో ప్రయాణం సాగించాడు. రాయల వారు వెడుతుంటే ఆయనకు ఛత్రాన్ని పట్టే ఆంతరంగికుడు గొడుగు పాలుడు కూడా సిద్ధం అయ్యాడు.
త్రయోదశి ఘడియలు మీరక ముందే రాజధాని హంపి చేరి ఆలయ సందర్శనము చేసుకుని పీఠాధిపతుల దీవెనలు అందాలని రాయలు గుఱ్ఱాన్ని దౌడు తీయించసాగాడు. ఆ గుఱ్ఱం తో పోటీ పడుతూ ఛత్రాన్ని పట్టుకుని గొడుగు పాలుడూ పరుగుకు సిద్ధం అయ్యాడు. రాయల మీద ఎండ పడకుండా గుఱ్ఱముతో పాటు తానూ పరుగు అందుకుని ఛత్రాన్ని పట్టుకుని రాయలు ఎటు వైపు గుఱ్ఱాన్ని పరుగు తీయిస్తే అటువైపు ఛత్రాన్ని పట్టుకుని పరుగులు తీశాడు. సమయానికి చేర్చాలి అన్న భక్తి గుఱ్ఱానిది అయితే, రాయలు మీద ఎండ పొడ పడరాదన్న భక్తి గొడుగు పాలునిది.
గుఱ్ఱము, గొడుగు పాలుడు పోటీ పడుతూ రాయలవారిని హంపికి చేర్చారు. గుఱ్ఱాన్ని వదలి అక్కడ వేచియున్న పండిత వర్గం అంతా వెంటరాగా మంగళా ధ్వానములతో రాయల వారికి బ్రాహ్మణులు ఎదురేగి స్వాగతించి అక్కడ సిద్ధం చేయించిన మంగళ ద్రవ్యాలతో స్నానమాచరింపజేసి క్రతువు చేస్తున్న మండపానికి తీసుకుని పోయారు. క్రతువు ముగిశాక దీవెనలంది రాయలు రాచనగరుకు పల్లకీలో చేరి విశ్రమించారు.
అలసిపోయిన గుఱ్ఱం సకిలిస్తూ విరూపాక్ష ఆలయ ప్రాకారానికి సమీపములో సేద దీరుతోంది. గుఱ్ఱం తో బాటు పరుగులెత్తిన గొడుగు పాలుడు తీవ్రంగా డస్సి పోయి సొమ్మసిల్లి ఆలయ రాజ మంటపం వద్దే కూల పడిపోయాడు. ఛత్రం మీద పడిపోయింది..కాబట్టి ఆ క్రతు కార్యములో మునిగిన వారు ఎవరూ అతనిని పరికించ లేదు.
సేదదీరిన కృష్ణ రాయలు మెలకువ వచ్చి తాను వచ్చిన విధానాన్ని ఆంతరంగికులతో చెబుతూ అన్నట్టు గొడుగు పాలుడు ఏడీ అని అందరి వంకా చూడగా ఎక్కడా గొడుగు పాలుడు కనిపించలేదు. గొడుగు పాలుడు ఏమయ్యాడో కనుక్కుని తీసుకు రమ్మనగా వెళ్ళిన పరివారము విరుపాక్ష ఆలయ ప్రాకారం గోడవద్ద సొమ్మసిల్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని కనుగొని వెంటనే వైద్యులు అమిత నైపుణ్యం తో అతడికి చికిత్స చేసి అపస్మారక స్థితి నుండి బయటపడేశారు.
గొడుగు పాలుని పరామర్శించడానికి వచ్చిన రాయలు ఆతని రాజ భక్తికి మెచ్చి అనేక బహుమానాలు అందజేశారు. కోలుకున్న గొడుగు పాలుడు కొలువుకు రాగానే రాజసభలో అతడి రాజభక్తికి సన్మానించారు. ఇంకేమైనా కోరుకో అని కూడా అడుగగా.. గొడుగు పాలుడు తనకు ఏమీ వలదని ఒక్క రోజులో తాను ఎన్ని ఆగ్రహారాలను భూసురులకు దానమిచ్చి శాసన పత్రాలు చేయించ గలడో ఆ అధికారాన్ని మాత్రం ఇమ్మని కోరాడు. మల్లె పూమాల లో ఉన్న దారానికి సైతం పరిమళం అలదుకున్నట్టు దానవీరమున్న రాయని సాంగత్యం కలిగిన గొడుగు పాలుడు అనే భూమానాయనికీ అదే గొప్పదనం అబ్బింది.
రాయల వారిచ్చిన అధికారముతో తన ధర్మ పత్నులతో కలసి భూమానాయుడు రాయల రాజ్యంలో అనేక పల్లెలు కట్టించి భూసురులకు దాన ధర్మాలు చేసి తరించాడు. ఇప్పటికీ భూమానాయుని పేరుతో సీమలో అనేక పల్లెలు ఉన్నాయి.

 ధ న్యు డైన, గాజుల వ్యాపారి



సరస్వతీ నదీ తీరంలో ఒక రమణీయమైన గ్రామం. అక్కడ ఒకప్పుడు ఉద్దాలకుడనే వైష్ణ వుడు వుండేవాడు. అతడు రాధా దేవిని భక్తి గాకొలిచేవాడు. ఒకరొజు నదీ తీరంలో ఒకస్త్రీ, బట్టలు ఉతుకుతంది. అపుడు తిరంవెంట వెళుతున్న ఒకగాజుల వర్తకుడిని చూసి ఆమె పిలిచింది. బాబూ గాజుల అబ్బీ. ఇలా వచ్చి నాకు గాజులు ఇస్తావా. తనకు కావలసిన గాజులూ వేయించుకుంది. అమ్మా నీవూ వేయించు కున్న గాజుల ఖరీదు మూడు రూపాయలు. కానీ నీవు, రెండున్నర రూపాయలు ఇవ్వు చాలు అన్నాడు ఆగాజుల వ్యాపారి, మాయి ల్లు, పక్కనే గ్రామంలో వుంది అక్కడ మానాన్న గారు ఉద్దాలకుడు ఉంటారు. ఆయన దగ్గరకు వెళ్లి, ఈ గాజుల ఖరీదు తీసుకో అనిచెప్పినది. నేనూ ఆయనకు ఏమీ చెప్పాలి. మికూతురు నదీ తీరం లో నావద్ద గాజులూ వేయించుకుంది. ఖరీదు మీదగ్గర తీసుకోమని చెప్పింది. మీపూజగదిలో రాధ విగ్రహం వెనుక పైకం వుందని కూడా చెప్పింది.
ఈమె నావద్ద గాజులూ వేయించుకునీ,డబ్బివ్వకుందా, మోసం చేస్తుందేమో అని అనుమానం వచ్చి కూడా,, అలా ఐవుండడు. మంచి అమ్మాయ్ లాగా కనిపిస్తుంది చక్కగా మాట్లాడుతుంది. అమెచెప్పినట్లు గానే తండ్రి వద్దకు వెళ్ళి డబ్బు తీసుకుంటాను. ఆమె ప్రసన్న వదనం చూసి గాజుల వ్యాపారికి నమ్మకం కుదిరింది. ఉద్దాలకుని ఇంటికి వచ్చాడు, సా మీ, నేనుఒక గాజుల వర్టకుడిని, ఉద్దాలకు డిని కలుసుకోవాలని వచ్చాను. నేనే వుద్దాలకు డిని, నీకు ఏమి కావాలి. అనాన్నడు. ఆమునీ. మీకూతూరు, నదీ తీరం లోనావద్ద గాజులూ వేయించుకుంది. దాని ఖరీదు, మీవద్ద తీసుకోమని చెప్పింది అన్నాడు. నేనూ బ్రహ్మచారిని, నాకూ, కూతురు ఎవరూ లేరే. ఆమేమీకూతురిని అనేచెప్పింది. ఆయన నివ్వెర పోయాడు. నకూతురి నని చెప్పిందా అని అడిగితే అవును సామి, పూజగదిలో రాధ విగ్రహము వెనుకపైకం వుందని కూడా చెప్పింది. వెళ్ళి చూడండి అన్నాడు. నేనూ అక్కడ పైకం పెట్టలేదే. అయినా వెల్లిచూస్తాను అని వుద్దాలకుడు, ఆవర్తకుడిని కూడా పూజ గదిలోకి తీసుకెళ్ళాడు. అక్కడ రాధా దేవి, విగ్రహం వెనక చిన్నసంచి కనబడింది. అదిగో అక్కడ చిన్నాసంచి వుంది. ఉద్దాలకుదు ఆసంచి తెరిచి చూస్తే అందులో సరిగ్గా ఆవ్యాపారికి ఇవ్వ వలసిన పై కం వుంది. ఆక్షణం లో, అతనికీ జ్ఞానో దయము కలిగింది. నేనూ చాలా కాలం గా రాధా దేవిని పూజించు, తున్నా నూ. కానీ అమే దర్శనం నాకూ ఇంతవరకూ కాలేదు. మీకు అమేదర్శనం లభించింది. రాధాదేవి యే, నదీ తీరంలో మీకు కనిపించి గాజులూ వేయించుకుంది. మీరు ఎంతో ధన్యులు, నన్ను ఆశీర్వ దించండి. అనీ ఆయన గాజుల వ్యాపారి కాళ్ళముందు మొకరిల్లాడు.

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...