Monday 27 June 2022

 ఎవరీ తీస్తా సెతల్వాద్ !

. నిన్న అరెస్టైన తీస్తాసెతల్వాద్ ను "సామాజిక కార్యకర్త" అంటూ ప్రధానమీడియా సంస్థలన్నీ రాశాయి. సామాజిక కార్యకర్త అనగానే ఈమె ఏదో ఒక ఎన్జీవో స్థాపించి సమాజసేవ, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేసుకునే సగటు మధ్యతరగతి ఎన్జీవో నిర్వాహకురాలేమో అని భ్రమపడతాము. కానీ గుజరాత్ చరిత్రలో బాగా ధనికులై మొఘల్ సైన్యాలనుండి ఈస్టిండియా కంపెనీ సైనికుల వరకు జీతాలు సక్రమంగా చెల్లించే క్యాషియర్ లేదా మున్షీ బాధ్యతలను తరతరాలుగా నిర్వహించిన చరిత్ర తీస్తాసెతల్వాద్ కుటుంబానికి ఉంది.


తీస్తాసెతల్వాద్ తాతకు తాత అంబాశంకర్ బ్రిజ్ రాయ్ సెతల్వాద్ (1782-1853) ఈస్టిండియా కంపెనీకి వీరవిధేయుడుగా ఉంటూ సుప్రీం సివిల్ క్లెయిమ్స్ కోర్టులో రిజిస్ట్రార్ గా కెరీర్ మొదలుపెట్టి అహ్మదాబాద్ జిల్లాలో పూర్తిగా యూరోపియన్లే న్యాయమూర్తులుగా ఉండే అత్యున్నత న్యాయస్థానంలో తొలి భారతీయ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన కుమారుడు హరిలాల్ అంబాశంకర్ సెతల్వాద్ (1821–1899) కూడా బ్రిటీష్ వారికి నమ్మకస్థుడిగా ఉంటూ తనతండ్రి పొందిన పదవులతోపాటు తెల్లదొరల నుంచి రావుసాహిబ్ అనే బిరుదును కూడా సంపాదించారు.

ఇక తీస్తాసెతల్వాద్ తాత చిమన్ లాల్ హరిలాల్ సెతల్వాద్ కూడా నాటి బ్రిటీష్ ప్రభుత్వంలో అతిపెద్ద న్యాయప్రముఖుడు. ఆయన బొంబాయి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. 1924లో బీఆర్ అంబేద్కర్ తో కలిసి బహిష్కృతహితకారిణి సభ ఏర్పాటు చేసి దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. మహాత్మాగాంధీ చిమన్ లాల్ ను గొప్ప న్యాయ నిపుణుడని కీర్తించేవారు. మహాత్మాగాంధీ న్యాయ నిపుణుడు , గొప్ప దేశభక్తుడు అని కీర్తించిన చిమన్ లాల్ హరిలాల్ సెతల్వాద్ జలియన్ వాలా భాగ్ ఊచకోత మీద నాటి బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హంటర్ కమిషన్ లో సభ్యుడు కూడా. జలియన్ వాలాభాగ్ మారణకాండపై భారతదేశమంతటా తీవ్ర ఆగ్రహావేశాలు రగిలిన సందర్భంలో బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ లో విన్ స్టన్ చర్చిల్ ఒక ఓటింగ్ పెట్టి జనరల్ డయ్యర్ చేసింది దారుణం అని తీర్మానించారు.
బ్రిటన్ పార్లమెంటు కూడా తప్పని తేల్చింది కాబట్టి జనరల్ డయ్యర్ కు కోర్ట్ మార్షల్ శిక్ష తప్పదనే అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హంటర్ కమిషన్ ఏంచేసిందయ్యా అంటే నేటి కంటితుడుపు కాలయాపన కమిటీలలాగే ఎంక్వైరీ మొదలుపెట్టింది. కమిటీ సభ్యులతోపాటు జనరల్ డయ్యర్ ను చిమన్ లాల్ హరిలాల్ సెతల్వాద్ కూడా ప్రశ్నించారు. కొన్ని నెలల విచారణ తరువాత చివరికి హంటర్ కమిషన్ సభ్యులంతా కలిసి జనరల్ డయ్యర్ చేసింది తప్పే అని తేల్చి ప్రభుత్వానికి రిపోర్ట్ మాత్రం పంపించారు. అయితే శిక్షలు విధించడం కానీ కనీసం శిక్షలు సూచించడం కానీ చేయలేదు. నెలల తరబడి సాగిన హంటర్ కమిషన్ ప్రహసనం ద్వారా జరిగిన కాలయాపన వల్ల దేశప్రజల్లో ఆగ్రహావేశాలు చల్లారిన తరువాత నాటి బ్రిటీష్ ఆర్మీ కౌన్సిల్, వైశ్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు "జనరల్ డయ్యర్ చేసింది తప్పే అయినప్పటికీ రాజకీయ కారణాల దృష్ట్యా అతనిని శిక్షించడం కుదరదని" తేల్చి చెప్పి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో అతని సేవలకు గాను తాము మెచ్చి ఇచ్చిన ప్రమోషన్ లాంటివి వాటిని మాత్రం శిక్ష కింద రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఇదంతా చదివాక అతిపెద్ద అవినీతి తిమింగలాలు, నేరస్తులు దొరికితే చిన్నపాటి సస్పెన్షన్ తో సరిపెట్టి వారిని పరోక్షంగా కాపాడే ప్రభుత్వాలు, ఏసీబీలు గుర్తుకు రావడం లేదూ?
జలియన్ వాలాభాగ్ హత్యాకాండ విషయంలో శిక్షలు విధించదగ్గ అధికారంగల హంటర్ కమిషన్ లో సభ్యుడై ఉండీ నాటి బ్రిటీష్ ప్రభుత్వం స్క్రిప్ట్ ప్రకారం నడుచుకుని ప్రజాగ్రహం చల్లారేదాకా నాటకాన్ని రక్తికట్టించి శిక్ష ఏమిటో తేల్చకుండా ప్రభుత్వానికి వదిలేసి డయ్యర్ ను పరోక్షంగా కాపాడటమే చిమన్ లాల్ హరిలాల్ సెతల్వాద్ అండ్ కో భారతీయులకు చేసిన (అ)న్యాయం. ఆయన మనవరాలే తీస్తాసెతల్వాద్.
తీస్తాసెతల్వాద్ తండ్రి మోతీలాల్ చిమన్ లాల్ సెతల్వాద్ కూడా సామాన్యులు కారు. స్వతంత్ర భారతదేశానికి తొలి అటార్నీ జనరల్, తొలి లా కమిషన్ ఛైర్మన్, తొలి బార్ కౌన్సిల్ ఛైర్మన్. అంతేనా?
భారతదేశానికి అత్యధిక కాలం (13ఏళ్ళు) పనిచేసిన అటార్నీ జనరల్. జమ్మూకాశ్మీర్ వివాదంలో సరిహద్దుల నిర్ణయం కోసం ఐక్యరాజ్యసమితి ప్రొసీడింగ్ లతోపాటు రాడ్ క్లిఫ్ ట్రిబ్యునల్ ముందు కూడా ఆయన హాజరయ్యారు. అంటే జమ్మూకాశ్మీర్ విషయంలో జవహర్ లాల్ నెహ్రూ ఆలోచనలు మోతీలాల్ సెతల్వాద్ లాంటి వారి ద్వారానే దేశంలోనూ అంతర్జాతీయంగా కూడా అమలయ్యాయి.
లాకమిషన్ ఛైర్మన్ గా ప్రభుత్వానికి న్యాయ సలహాలు ఇచ్చిన ఈయన జవహర్ లాల్ నెహ్రూకు సమకాలీనుడు, అతి సన్నిహితుడు కూడా. *ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటీష్ ప్రభుత్వం దాకా గాంధీ-నెహ్రూల నుంచి సోనియా-రాహుల్ గాంధీల వరకు సెతల్వాద్ కుటుంబానికి కల సంబంధాలను దాచిపెట్టి తీస్తాసెతల్వాద్ ను కేవలం సామాజిక కార్యకర్త అని మాత్రమే సంబోధిస్తూ రాయటం మన మీడియాకు ఎంతవరకు సమంజసం*?

Saturday 25 June 2022

 A dying river ...... Varuna

For the last four-five days, one thing has shaken my mind. We have to go to the court almost every day, when we saw this scene on the first day, it was cool but did not stop, it moved forward. Saw the same the next day, the next day also... Varanasi cannot be completed without Varuna but now it seems that Varanashi will have to get used to living with this incompleteness. This river is dying... I had heard this many times but in these four to five days I felt it with great intensity.


The scene I saw five days ago was something like this... Saw some greenery on the dirty-looking water passing the bridge. When the speed of the bike was reduced, I saw that the sheet of water was spread far above the water. The view is not very strange, sometimes garbage is taken on the same flow and sometimes the white sheet of chemicals from a factory is seen spreading far away... Sleep didn't stop I moved on. The same order went on for two days but on the third day, something came to mind and stopped. Noticed that the border of the waterfall was still there where it was seen on the first day. Yep, it seemed more steady with a three-day stay.
Seeing the sheet of a waterfall on the first day, it felt that it would have come out of the surrounding drains and edges to the mainstream due to the increase of water... I will pass with the flow. But the third-day view said something else. Today again when I saw the scene of someone, it felt like the flow of water had almost ended. Today felt the rot of water stopped around the bridge. The sheet of water is spoiling the water, if there is no flow, there is no way to move forward. Many questions in mind again... What will happen to aquatic life... If Varuna ends, how much effect will it be... Those who live on the shores and roar the river in the flood will go a few feet ahead and snatch the place...
After a short journey of about 100 km from Bhadohi, this river meets Ganga in Saraymohana. Now it may look like drainage but it will not be wrong to say that many generations of 'civilization' that reside within a 100 km radius will be favored by it. Favor is that when there was no space for them to live, the river gathered its banks... Yes, once a year in hope of justice like an unlucky person she insists and says this place belongs to me. Just for the rest of the year, the limits of shimti-shrinking.
But such a thought with this unlucky person...... The plot of Bangla literature is, the story of two women living together, proposals, plans, and preparations around the world for supervising one. The new government has also made a separate ministry and ministers, tourism-water transport, and the countries all over the country. After all, the mother is there for her sake of her which is not enough...... But you should have taken care of 'aunt' along with your mother. Short, not 2525 km but 100 km life-threatening, somewhere this aunt praises her mother with her conflict. But perhaps tourists do not come here from the country and abroad, so sons do not think it is necessary to do aarti for him, even look at him.
All the prominent officers of the district and Mandal pass over the river on this way to Varuna bridge. The far-away voice on social issues also gives. The common man of the city comes on this road once in five days if not daily. Has no one seen you yet...... The bungalows of all the officers are also on the edge of this Varuna, as no one listened to his moaning. Asi was a river, Varanasi had a part of it too. But the new generation knows it by the name of Nala. Is Varuna's fate going to be the same.........

Friday 24 June 2022

 స్వర్ణ సిద్ధ యోగి వాసిష్ఠ గణపతి ముని

ఆయన చదవని శాస్త్రం లేదు ,రాయని కావ్యం లేదు ,దర్శించని క్షేత్రం లేదు ,తపస్సు చేయని ప్రదేశం లేదు ,చూపని మహిమలు లేవు,,ప్రసన్నం చేసుకొని దేవత లేదు అన్నిటికి మించి అస్ప్రుస్యతనుయేవగించుకొన్న సదాచార సంపన్నుడు ,భారత జాతీయ స్వాతంత్ర ఉద్యమం లో ముందు నిలిచినకర్మిష్టి ,భగవాన్ రమణ మహర్షి చేతనే ‘’నాయనా ‘’అని పించుకొన్న అద్భుత మూర్తి .సాక్షాత్తు గణపతి అవతారమే శ్రీ వాసిష్ఠ గణ పతి ముని .వారి జీవితం అంతా పరోప కారమే .కారణ జన్ములాయన .ఆ పేరు స్మరిస్తే చాలు సర్వ పాప హారం .

జననం –విద్యా భ్యాసం –వివాహం
అసలు పేరు అయ్యల సోమయాజుల సూర్య గణపతి శాస్త్రి .తండ్రి నరసింహ శాస్త్రి-గణపతి ఉపాసకుడు .తల్లి నరసమ్మ సూర్య ఉపాసకురాలు .వీరి సంతానమే గణపతి శాస్త్రి .శ్రీ కాకుళం జిల్లా బొబ్బిలి దగ్గర ‘’కలువ రాయి ‘’గ్రామం లో 17-11-1878 న జన్మించారు .ఆరామద్రావిడ కుటుంబం .తండ్రికి గణపతి తన దగ్గరకు వస్తున్నట్లు కని పించింది .తల్లికి సూర్యుని శక్తి అయిన అగ్ని పూర్ణ స్వర్ణ కలశం కల లో కన్పించింది ..బిడ్డ జన్మించినప్పుడు అతన్ని ఒక దివ్య తేజస్సు ఆవరించి ఉన్నట్లు చూసింది .పదేళ్ళకే తల్లిని పోగొట్టు కొన్నదురదృష్ట వంతుడు గణ పతి .ఈయన దైవాంశ సంభూతుడు అని భావిస్తున్నారు తల్లీ ,తండ్రీ .కాని మన వాడికి ఆరేళ్ళ దాకా మాటలే రాలేదు ..తండ్రి కాల్చిన లోహపు ముల్లును కొడుకు నాడిలో గుచ్చాడు .వెంటనే జలపాతం లాగా మాటలు జారి వచ్చాయి .
పిన తండ్రి ప్రకాశ శాస్త్రి దగ్గర కావ్యాలు చదివటమే కాక పంచాంగ గణనం లోను దిట్ట అని పించుకొన్నాడు .పన్నెండవ ఏట విశాలక్షమ్మ తో వివాహం జరిగింది .కాళిదాసు గారి మేఘ దూతం లాగా ‘’భ్రున్గా దూతం ‘’అనే రెండు సర్గల కావ్యం రాశాడు ..పద్దెనిమిదేళ్ళు వచ్చే సరికి వ్యాకరణ ,అలంకార ,సాహత్యా లనుకరతలా మలకం చేసుకొన్నాడు .పురాణ ,ఇతి హాసాల లోతులు తరచాడు .పదమూడవ ఏటి నుండి తండ్రి వద్దే మేధా దక్షిణా మూర్తి ,నారాయనాక్షరి ,సౌరాస్త్రాక్షరి ,చండి నవాక్షరి ,మాతంగి ,బాల ,వారాహి ,భువనేశ్వరి ,మహాగణపతి ,పంచ దశి ,షోడశి అనే పన్నెండు మహా మంత్రాలను సాధన చేసి వశం చేసుకొన్నాడు .తపస్సు చేసుకోవాలనే కోరిక బల మైంది .ఆరు నెలలు ఇంటి దగ్గర ,ఆరు నెలలు తపస్సు చేసుకోవటానికి భార్య అనుమతి పొందాడు .ఇద్దరు పిల్లలు కన్న తర్వాతతనకు కూడా తపస్సు చేసుకొనే అవకాశం ఇమ్మని భార్య కోరితే సరే నన్నాడు .వెంటనే భార్యకు మహాగణపతి మంత్రం ,శ్రీ దీక్ష ఇచ్చాడు .
దేశ సంచారం –శాస్త్ర చర్చలు –తపస్సు
1896లో అంటే పదహారేల్లప్పుడు కౌశికీ నదీ తీరాన పేరమ్మ అగ్రహారం లో రెండు నెలలు తీవ్ర తపస్సు చేశాడు ..కాశీ కి బయల్దేరి నంది గ్రామం లో ధర్మ శాలాధి కారిచే సన్మానం పొంది ఇంటికి వచ్చాడు .కలువ రాయి లో ధ్యానం లో ఉండగా భద్రకుడు అనే అనే ఆయన కన్పించిగణపతి గణకుడు అని జ్ఞాపకం చేశాడు .తండ్రి అనుమతి తో ప్రయాగ వెళ్లి హంస తీర్ధం లో కొంత కాలం తపస్సు చేసి ,కాశీ చేరి తండ్రి మేన మామ భవాని శంకరం ఇంట్లో ఉండి దర్భాంగా సంస్థానం లో ఉండే ‘’శివ కుమార పండితుడి ‘’ని తన కవిత్వం తో మెప్పించాడు .నవద్వీపం లో జరిగే విద్వత్ పరీక్ష కు హాజరవమని పరిచయ పత్రం పొందాడు .ఒక రోజు ఆయనకు అయ్యల సోమయాజుల సూర్య నారాయణ యోగి కని పించి భద్రకుడు మొదలైన తాము పదహారు మంది లోక కళ్యాణం కోసం జన్మించామని తాను’’ సుకేతుడని’’ ,అతను గణపతి అని ,యే పని చేయాలో’’ స్తూల శిరస్సు’’ అనే వాడు తెలుపుతా డని చెప్పాడు .నాసిక్ లో తపస్సు చేయాలని స్వప్నం లో తెలియ జేయ బడటం తో అక్కడికి చేరి నీలామ్బికా ఆలయం లో తపస్సు చేశాడు .అక్కడే మొదటి అష్టావదానమూ చేశాడు .అక్కడ తనను అవమానించిన పూజారిని శపించి ,పాప పరిహారం కోసం ‘’నవ చూతి ‘’లో 72 రోజులు ఘోర తపస్సు చేశాడు .అప్పుడే’’ తెల్లని దిగంబరుడు’’ కల్లో కనిపించి ఇంటికి వెళ్ళమని ఆదేశించాడు ..ఒరిస్సా చేరి భువనేశ్వర్ లోతోమ్మిది రోజులు తపస్సు చేశాడు . భువనేశ్వరి దేవి సాక్షాత్కారించి బంగారు గిన్నె లోని తేనె ను అతనితో తాగించింది ..దానితో కవితా మాధుర్యం పెరిగింది .బుద్ధి సూక్ష్మత రెట్టింపైంది .ఇంటికి వస్తే భార్య కొడుకుని కన్నది .మహాదేవుడనే పేరు పెట్టాడు .కేశ న కుర్రు లో తర్క వేదాంత ,వ్యాకరణ మహా భాష్యాలను ,నీతి శాస్త్రాన్ని ఆపోసన పట్టాడు .1900 లో మదసా సంస్థానం లో రాజ గురువును ఓడించి ,అష్టావధానం చేసి ,రాజకుమారుడికి శివ పంచాక్షరి ఉపదేశించి రాజు ప్రోత్సాహం టో నవద్వీపం చేరాడు .అక్కడ ‘’సితి కంథ వాచస్పతి ఆదరం పొందాడు .పరీక్షాధికారి అయిన ‘’అంబికా దత్తుఆయన అంబికకు దత్తుడు అయితే తాను సాక్షాత్తు అంబిక కు ఔరస పుత్రుడిని గణపతిని అనే ‘’శ్లోకం తో మెప్పించి ,ఆయన మెప్పు పొంది పరీక్ష లో పాల్గొన్నాడు .నవద్వీప పండితులను మెప్పించటం మహా కష్టం .కాని మన గణపతి అక్కడి పండిత పరిషత్తు పెట్టిన అన్ని పరీక్షల్లో నెగ్గి ,తన పాండిత్యం ,కవిత్వాలతో అందర్ని మెప్పించి ‘’కావ్య కంథ గణపతి ‘’బిరుదును 20-6-1900 న పొందాడు .అప్పటి నుంచి ఆపేరు తో నే సార్ధక నామదేయుడైనాడు .
వైద్యనాద్ వెళ్లి తపస్సు చేసి సురేష మిత్రుని వద్ద ‘’తారా’’మంత్రోపదేశం పొందాడు .గణపతి గారి వల్లే ఉత్తరాదికే పరిమిత మైన ఈ మంత్రం దక్షిణాదికి చేరింది .పదవ రోజు రాత్రి శివుడు కలలో కన్పించి నిర్విషయ ధ్యాన రూపం అయిన ‘’స్మృతి మార్గం ;;చూపించి ,విభూతి చల్లి అదృశ్యమైనాడు .గద్వాల్ చేరి మహారాజుకు ఆప్తుడై ,కాన్పూర్ వెళ్లి మూడు నెలలు తపస్సు చేసి ,మళ్ళీ ఇంటికి వెళ్లి తండ్రికి నేత్ర చికిత్స చేయించాడు .1902 లో భార్య తో సహా మంద సా వెళ్లి రాజు గారి ఆతిధ్యం పొంది ,భార్యను పుట్టింటికి పంపి ,తమ్ముడు శివ రామ శాస్త్రి తో కలిసి భువనేశ్వర్ లో మళ్ళీ తపస్సు చేసి కలకత్తా చేరాడు .అక్కడినుంచి దక్షిణ దేశం చేరి క్షీరవతీ ,వేగావతీ నాడు మద్య శివ పంచాక్షరి జపించి ,,అరుణాచలం చేరి తన తపో సాధనకు అదే సరైన ప్రదేశం గా భావించి అక్కడే ఉందామని నిర్ణ ఇంచుకొన్నాడు .
కానీ అన్నదమ్ములిద్దరికి పిడికెడు అన్నం పెట్టె వారే కరువైనారు .గణతి కి ఆ క్షేత్ర దేవత పై కోపం వచ్చింది .ఆకలి దహిస్తోంది .వెంటనే ఒక బ్రాహ్మణుడు వచ్చి తన భార్య వ్రతం చేసి పారణ ను బ్రాహ్మణులకు ఇవ్వాలని అనుకుంటున్నది భోజ నానికి రమ్మని చెప్పి తీసుకొని వెళ్లాడు .అక్కడ ఆమె మృష్టాన్న భోజనం పెట్టింది .సంతృప్తిగా తిన్నారు ..ఆ ఇంట్లోనే విశ్రాంతి తీసుకొన్నారు .తెల్ల వారి లేచి చూస్తె అక్కడ ఇల్లే లేదు .అరుణా చలేశ్వరుడే తమల్ని పిలుచుకొని వెళ్ళాడని అమ్మ వారు’’ ఆపీత కుచామ్బే’’ తమకు భోజనం పెట్టిందని గ్రహించాడు .కాని నోట్లో తాంబూలం అట్లాగే ఉండటం ఆశ్చర్యం వేసింది .అది కల కాదు నిజం అని తెలుసు కొన్నాడు .అప్పటికి గణపతి అయిదు కోట్ల శివ పంచాక్షరి ని జపించి నందుకు అమ్మవారే స్వయం గా కన్పించి ఆతిధ్యం ఇచ్చిందని అర్ధ మయింది .ఇక మానవ మాత్రులేవారిని దేహీ అని అర్ధించ రాదనీ నిశ్చయించు కొన్నాడు .రోజు అరుణాచల నందీశ్వరుని ముందు నిలిచి శ్లోకాలను అరుణా చలేశ్వరునికి విని పిస్తూ ‘’హరస్తుతి ‘’కావ్యం రచించాడు .చివరి రోజు న అరుణాచల యోగులు శేషాద్రి స్వామి ,బ్రాహ్మణ స్వామి (రమణ మహర్షి )ఆ కావ్యం విని ఆనదించారు .అక్కడి విద్యాలయం లో ఈయనకు సంస్కృత అధ్యాపక పదవి లభించింది .పది రోజుల్లో తమిళం నేర్చి ,ఆ భాష లో బోధించటం ప్రారంభించి మెప్పు పొందాడు .1903 లో రమణ మహర్షిని దర్శించాడు .ఆయనేదుర్గా మందిర యోగి చెప్పిన ‘’స్థూల శిరస్సు ‘’అని గుర్తించి నమస్కరించాడు .అప్పుడు రమణుల వయస్సు ఇరవై రెండు .గణపతి వయస్సు ఇరవై అయిదు .అలా చారిత్రాత్మకం గా కలిసిన వారిద్దరూ జీవికా జీవులు గా ఉండి పోయారు .

Wednesday 22 June 2022

 భారత రాష్ట్రపతి కానున్న ఆదివాసీ మహిళ


ద్రౌపది ముర్ము 1958 లో బైడపోసి అనే గ్రామంలో మయుర్బంజ్ జిల్లా ఒరిస్సాలో జన్మించారు.
ఆమె BA పాస్ అయి ఆరోబిందో కాలేజిలో హానరరీ ప్రొఫెసర్ పదవిలో పని చేసి ఒరిస్సా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు.



1997 లో ఆమె బీజేపీలో జాయిన్ అయ్యారు. 1997లోనే రాయ్ రంగపూర్ లో కౌన్సిలర్ గా మొట్టమొదటి సారిగా ఎన్నికల్లో గెలిచారు. తరువాత అదే సం. లో ఆమె రాయ్ రంగ్ పూర్ వైస్ చైర్మన్ అయ్యారు.
2000 సం. లో ఆమె అక్కడ నుండే MLA గా గెలిచి బీజేడీ-బిజెపి ప్రభుత్వం లో నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి క్రింద రవాణా శాఖా మంత్రిగా, 2002 లో ఫిషరీస్ మరియు ఆనిమల్ హాజ్బండ్రి మంత్రిగా 2004 వరకు చేశారు. 2004లో అక్కడ నుండే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి 2009వరకు వున్నారు. మధ్యలో కొన్ని సం. లు తప్ప 2002 నుండి 2015 వరకు ఆమె మయుర్బంజ్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ గా వున్నారు. ఆమె ఒరిస్సా బిజెపి రాష్ట్ర ఎస్టీ మోర్చా ప్రెసిడెంట్ గా కూడా చేశారు.
2015లో ఆమె జార్ఖండ్ మొదటి మహిళా గవర్నర్ గా నియమింపబడ్డారు. ఆమె 2021 వరకు ఈ పదవిలో వున్నారు. ఈమె ఒరిస్సా నుండి ఎంపిక కాబడిన మొదటి మహిళా ట్రైబల్ గవర్నర్. అంతే కాదు ఈమె దేశంలో నియమింపబడ్డ మొట్ట మొదటి ట్రైబల్ గవర్నర్ కూడా.
NDA ఈ సారి రాష్ట్రపతి ఎన్నికలకు ఈమె పేరు నామినేట్ చేశారు. 2017 రాష్ట్రపతి ఎన్నికలు అప్పుడు కూడా ఈమె పేరు పరిశీలన లోకి వచ్చినా అప్పుడు రామనాధ్ కోవింద్ పేరు చివరికి ఖరారు అయింది.
ఈ సారి కూడా NDA సుమారు 20 పేర్లు పరిశీలించి చివరకు మూర్మ్ గారి పేరు ఖరారు చేశారు.
ఈమె మత మార్పిడి ప్రలోభాలకు లోను కాలేదు. పక్కా ఆదివాసీగా నే శ్యామ్ చరణ్ ముర్ము అనే ఆయన్ను వివాహం చేసుకున్నారు. అయితే ఆయన తొందరలోనే కాలం చేశారు. ఈమెకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు వున్నారు. దురదృష్టవశాత్తు ఒక కొడుకు ప్రమాదంలో మరో కొడుకు అనారోగ్యంతో మరణించారు. ఇప్పుడు కూతురు ఇతి ముర్ము మాత్రమే వున్నారు. ఈమెకు చదువు పూర్తి అయ్యాక బాంక్ లో ఉద్యోగం వచ్చింది. భర్త గణేష్ కూతురు ఆరాధ్య తో కలసి ఈమె రాంచీలో నివసిస్తోంది.
ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిస్తే ఆమె దేశ మొట్టమొదటి ఆదివాసీ రాష్ట్రపతి అవుతారు.
మొట్టమొదటి దళిత మరియు మొట్టమొదటి ఆదివాసీ రాష్ట్రపతులను దేశానికి ఇచ్చిన ఘనత బిజెపి సాధించినట్లు అవుతుంది.
భారత్ కి స్వాతంత్రం వచ్చి 75 సం. ల అజాది కా అమృత్ మహోత్సవ్ జరుపు కుంటున్న ఈ సంవత్సరంలో దేశానికి ఒక ఆదివాసీ మహిళా రాష్ట్రపతి గా ఎన్నిక కాబోవడం నిజంగా ఒక అమృత ఘడియ.
కోపరటివ్ బాంక్ ఫ్రాడ్ కేసులో ఆరోపణలు ఉన్న ప్రతిభా పాటిల్ వంటి వారిని కాంగ్రెస్ ఈ ఉన్నత పదవిలో మొదటి మహిళా రాష్ట్రపతి గా కూర్చోబెడితే ఎటువంటి మచ్చలేని ముర్ము గారిని ఆ పదవికి ఎంపిక చేసిన ఘనత బిజెపి ది.
బిజెపికి అవకాశం వచ్చిన మూడు సార్లు ఏ మాత్రం వివాదాలు లేని వ్యక్తులను, మైనార్టీ, దళిత, ఆదివాసీ వారిని బిజెపి రాష్ట్రపతి అభ్యర్థులు గా ఎన్నిక చేసింది.
ఆమె పదవిలో ఉండగా దేశం ఉన్నత శిఖరాలను చేరాలి అని ఆశిస్తూ...
.

Saturday 18 June 2022

 స్టువర్ట్ పురం దొంగలు



🔸
అసలు దానికి కారణం ఏమిటి..? స్టువర్ట్ పురం అంతా ఒకే కులం ఎందుకు ఉంటుంది.వాళ్ళని దొంగలని బ్రిటిష్ కాలం నాటి రికార్డ్స్ ఎందుకు చెప్తున్నాయి...?
🔸
అసలు ఆ ఊరు ఎలా పుట్టింది...?
ఈ విషయాలు అన్ని తెలుసుకోవాలంటే ఈ పోస్ట్ చదవండి..
🔸
ఇండియన్ క్రిమినల్ ట్రైబల్ ఆక్ట్ 1871 అనేది చాలామందికి తెలియని బ్రిటిష్ కాలం నాటి చట్టం దీనిని 1871 న అమలులోకి తెచ్చారు..
🔸
మనిషి పుట్టగానే వాడిని దొంగ అని,నేరస్తుడు అని ముద్ర వేయడం అనేది విన్నారా...?
ఒక కులాన్ని దొంగలుగా / నేరస్తులుగా ముద్ర వేసి వాళ్ళనందరినీ ఒక చోట పెట్టి చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఏ నేరం జరిగినా వీరిని తీసుకొని వెళ్ళి నానా హింసలు పెట్టి చంపడం గురించి విన్నారా..?
🔸
అదే ఈ ఇండియన్ క్రిమినల్ ట్రైబల్ ఆక్ట్ యొక్క ఉద్దేశ్యం..
🔸
ఈ చట్టం పరిధిలోకి 237 కులాలను తీసుకుని వచ్చారు.. అంటే ఈ చట్టం ప్రకారం ఈ 237 కులాలలో అప్పుడే పుట్టిన శిశువు కూడా దొంగ /నేరస్థుడుగా పరిగణింపబడతారు...
🔸
వీరిని బ్రిటిష్ ప్రభుత్వం వారి మీద యుద్ధం చేసిన వర్గాల వారిని నేరస్తులుగా ముద్ర వేసి , విదేశీయులతో వీటి మీద పుస్తకాలు,లోకల్ వార్తా పత్రికలలో వార్తా కధనాలు రాయించి. ఊర్లలో పాలెగాళ్ళ చేత,జమిందార్ల చేత దండోరాలు వేయించి పుకార్లు సృష్టించి,కొన్ని కులాలను నేరస్తులుగా ముద్ర వేయించి, జనాల నుండి సరైన తిరుగుబాటు రాకుండా జాగ్రత్త పడ్డారు...
🔸
ఆ తరువాత ఆయా కులాలకి వేరే ఊర్లు కట్టి వారిని ఊరు వదిలి భయటకి వెళ్ళకుండా హుకుం జారీ చేసారు. పోనీ ఊర్లలో పని దొరక్క ఊరు దాటాలంటే పోలీస్ చెక్ పోస్ట్ దాటాలి ఒక వేళ బయట ఊర్లలో దొంగతనం జరిగితే నిర్దాక్షిణ్యంగా అక్రమ కేసులు బుక్ చేసేవారు. దానితో చాలామంది సరైన తిండి దొరక్క , వైద్య సదుపాయాలూ లేక చాలా చిన్న వయస్సులోనే ప్రాణాలు వదిలేవారు, ఇక దిక్కు లేక దొంగతనాలకి అలవాటుపడ్డారు...
🔸
సరిగ్గా ఈ సమయంలోనే క్రైస్తవ మిషనరిలను వైద్యం పేరుతో, తిండి పేరుతోనో ఇతర సమాజం నుండి వేరుచేయబడ్డ ఆ గ్రామంలోకి దింపేవారు,ఇంకేముంది గ్రామం మొత్తం క్రైస్తవమయం అయింది..తద్వారా ఆయా కులాలవారు మిగతా సమాజానికి దూరం అయ్యారు..
🔸
ఈ విధంగా వేరు చేయబడ్డ గ్రామమే #స్టువర్ట్_పురం_ అక్కడ దాదాపు అందరూ క్రైస్తవులే..
🔸
ఇలా వేరు చేసిన కులాలను తగ్గీస్ (Thuggees) అనగా తెలుగులో బందిపోటు దొంగలు అని ముద్ర వేసి చాలామందిని జైలులో పెట్టి చంపేశారు..
🔸
అటవీ సంపదని దోచుకుంటున్న బ్రిటిష్ పాలకులని అడ్డుకున్నందుకు దాదాపు అన్ని ST కులాలను బందిపోట్లుగా ముద్ర వేసారు.. వాళ్ల తండాల నుండి తరిమివేసారు. ఆ బాధితులలో లంబాడి తెగకు చెందినవారు ఒకరు ఈ బాధలు పడలేక ఒకప్పుడు బాంబే ప్రెసిడెన్సీ నుండి చాలా మంది వలస పోయి ఇప్పటి పాకిస్తాన్ లో ఉండిపోయారు.వాళ్ళలో చాలామంది ఇస్లాం స్వీకరించారు,మిగిలినవాళ్ళు హిందువులుగా ఉన్నారు వాళ్ళు ఇప్పటికి బంజారా / లంబాడి బాష మాట్లాడతారు..
🔸
ఈ కిరాతక చట్టం ద్వారా నానా కష్టాలు అనుభవించిన కులాలు చాలావరకు ప్రస్తుత SCలు , STలు, OBC ల వర్గానికి చెందినవారే..వారిలో దోపిడీ దొంగలుగా ముద్ర వేయబడ్డ వారు.. చమార్లు, గుజ్జర్లు, లోదిలు,హర్నిలు,బోయ.. Bowreah, Budducks, Bedyas, Domes, Dormas, Gujar, Bhar, Pasi, Dasads, Koneriahs, Moosaheers, Rajwars, Gahsees Boayas, Dharees, Sowakhyas మొదలగునవి..
🔸
ఖాకీ సినిమా చూసే ఉంటారుగా అందులో తెగ పేరు బవరియా వాళ్ళు ఇప్పటికి రాజస్థాన్ లో ఉన్నారు..
🔸
అది ఒక్కటే కాదు బ్రిటిష్ వారు భారతీయులను రెండు వర్గాలుగా అనగా #మార్షల్_రేస్_,
#నాన్_మార్షల్_రేస్_ గా విభజించారు..
🔸
బ్రిటిష్ వారి ప్రకారం మార్షల్ రేస్ అంటే రాజ్యపాలనకి పనికోచ్చేవారు, యుద్ధానికి పనికోచ్చేవారు,తెలివైన వాళ్ళు, బలవంతులు..
వీరిని బ్రిటిష్ వారు పాలెగాళ్ళుగా,జమిందారులుగా, వారి ఆఫీసులలో ప్రధాన సహాయకులుగా, మునసబులుగా నియమించేవారు..
సైనిక నియామకంలో వీరినే తీసుకునేవారు..
బ్రిటిష్ వారు వారి పిల్లల్ని చదివించే స్కూల్ లలో హోదాని బట్టి అడ్మిషన్ ఇచ్చేవారు...
🔸
అదేవిధంగా నాన్ మార్షల్ రేస్ బ్రిటిష్ వారి పుస్తకాల ప్రకారం చిన్న పనులు చేయడానికి పనికోచ్చేవారు, శరీర ఆకృతి బలంగా లేని వాళ్ళు..
వీరిని సైనిక నియామకాలలోకి తీసుకునేవారు కాదు, వీరిని జమిందార్లుగా,గ్రామ మునసబులుగా బ్రిటిష్ వారు నియమించినట్టు నేను పాత రికార్డులలో ఎక్కడా చూడలేదు, అందుకే బ్రిటిష్ వారి కాలంలో పుట్టిన జమీందారి వ్యవస్థలో, మునసాబు దారి వ్యవస్థలో పాలేగాళ్ల వ్యవస్థలో ఒక్కరు కూడా దళితులు లేరూ...
🔸
ఉదాహరణకి మహార్ లని తీసుకుందాం మొదటి ప్రపంచ యుద్దంలో 1914 వరకు మహార్ కులస్తులకు ఆర్మీలో పెర్మనంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు.. 1941 వ సంవత్సరం వరకు మహార్ ల పేరు మీద రెజిమెంట్ నే ఇవ్వలేదు.. కారేగావ్ యుద్ధంలో సైనికుల బలం చాలక అవకాశం ఇచ్చినా మహార్ కులస్తులను మొదటి ప్రపంచ యుద్ధం వరకు వారికి ఆర్మీలో పనిచేసే అవకాశం ఇవ్వలేదు..
🔸
ఇంకా అర్ధమయ్యేలా చెప్పాలంటే భారతరత్న భీమ్ రావ్ రాం జి అంబేద్కర్ గారు చదివిన స్కూల్ ని తీసుకుందాం.. ఆ స్కూల్ పేరు ఎల్ఫిన్ స్టోన్ హై స్కూల్ ఆ స్కూల్ బ్రిటిష్ వారు వారి పిల్లల సౌలభ్యం కోసం 1822 లో ఈ స్కూల్ ని నిర్మించారు.. అంబేద్కర్ గారు ఆ స్కూల్ లో 1906లో అడ్మిషన్ తీసుకున్నారు. ఆ స్కూల్ లో అడ్మిషన్ తీసుకున్న మొట్టమొదటి దళితుడు కూడా అంబేద్కర్ గారు కావడం గమనార్హం.
🔸
కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే 1822 లో పెట్టిన స్కూల్ లో ఒక దళితుడిని చేర్చుకోవడానికి 90 సంవత్సరాలు పట్టింది. ఆ స్కూల్ కట్టించి, నడిపిస్తున్నది, బోధిస్తున్నది బ్రిటిష్ వారే. దీనిని బట్టి మీకు బ్రిటిష్ వారు సోషల్ ఇంజనీరింగ్ ని ఎంతబలంగా నమ్మేవారో అర్ధం అవుతుంది...
🔸
ముస్లిం రాజ్యాలు 1000 ఏళ్ళు షరియా చట్టాన్ని ఆధారంగా చేసుకొని పాలించాక, ఆ తరువాత బ్రిటిష్ వారు 300 ఏళ్ళు చర్చిచే డ్రాఫ్ట్ చేయబడిన కంపెనీ చట్టం బ్రిటిష్ రాజ్యాంగం ద్వారా పాలించాక..ఇంకా ఒక వర్గాన్ని తక్కువ చేసి చూసే దురాచారానికి హిందువులు మొత్తానికి ఆపాదించడం చాలా తప్పు. సమాజంలో దురాచారాలని కట్టడి చేసే అధికారం రాజులకే ఉంటుంది,అది సమాజానికి మొత్తానికి ఎట్లా ఆపాదిస్తాం...?
🔸
జనాలలో ఇంత వైషమ్యాలు రేపి విడగొట్టిన బ్రిటిషర్ లను సమాజోద్ధరణకి పాటుపడినవారిలా కొన్ని మిషనరీలకి అమ్ముడుపోయిన శక్తులు అభివర్ణించడం చాల హాస్యాస్పదం..
🔸
మీరు అడపాదడపా వీడియోలలో క్రైస్తవ మత ప్రచారకులు బ్రిటిష్ వారిని పొగుడుతూ అవి తెచ్చారు,ఇవి ఇచ్చారు అంటూ నోటికొచ్చింది వాగుతూ ఉంటారు.. మన అమాయక హిందువులు గుడ్డిగా గంగిరేద్దుల్లా తల ఊపుతున్నారు..
🇮🇳
🚩
ఇకనైనా మేలుకోండి... జై హింద్..
🚩
🇮🇳

Thursday 16 June 2022

 తిరుమల కొండమీద వేంకటేశ్వరుని    ఆలయంలో                                                                                                                     ధ్వజస్తంభం మాను పుచ్చిపోయింది! 

 


శ్రీవారి ఆలయంపై వున్న ఆనంద నిలయం విమానాన్ని పాలిష్‍ చేయడం సహా అనేక మరమ్మత్తు పనులు చేపట్టాం. అకస్మాత్తుగా ఒక రోజు ఇంజనీర్ వచ్చి, ఖంగారు ఖంగారుగా చెప్పాడు.

"ధ్వజస్థంభం పుచ్చిపోయింది."

...  మెల్లగా బంగారు తొడుగులు తీస్తుంటే,  ఆ మాను క్రిందకంటా పుచ్చిపోయి ఉంది.                                     మరి ఎలా నిలబడింది ? ధ్వజస్థంభంపై నున్న  బంగారు తొడుగులు ఆధారంగా మాత్రమే. ...

పుచ్చిపోయిన ధ్వజస్థంభంతో స్వామికి సేవలా? … అపచారం జరిగిపోతోంది.  

నాకు ఆందోళన ... ఆదుర్దా ... ఆరాటం ... భయం ... 

రికార్డుల ప్రకారం చూస్తే, పాత మాను ఎప్పుడు పెట్టారో ఆధారాలు లభించలేదు... 

మాకు లభ్యమైన గత 180-190 సంవత్సరాల రికార్డ్సులో ఎక్కడా ఈ ధ్వజస్తంభం ప్రస్తావనే లేదు. అంటే ఇది ఎంతపాతదో? ఇప్పుడేమిటి చేయాలి? ... 

50-75 అడుగుల ఎత్తయిన టేకు మ్రానుని  సంపాదించి  ప్రతిష్టించాలి.  

ఆ మ్రానుకి తొర్రలు ఉండకూడదు. 

కొమ్మలు ఉండకూడదు. 

ఎలాంటి పగుళ్ళు వుండకూడదు.

దానికి వంపు ఉండకూడదు. నిటారుగా ఉండాలి. 

... నిస్పృహ వస్తోంది. ఇది జరిగేదేనా?  

అయినా ఆశ చావలేదు. క్షణాల మీద మన రాష్ట్ర ప్రభుత్వ అటవీశాఖ అధికారుల్ని సంప్రదించాను. ‘‘ఇలాంటి లక్షణాలుండే టేకు చెట్లు మన రాష్ట్రంలో దొరకడం అసాధ్యం’’ అని తేల్చారు. కర్నాటకలోగానీ, కేరళలోగానీ పడమటి కనుమల అడవుల్లో దొరకవచ్చు అని కూడా స్పష్టం చేశారు. 

... ఇవన్నీ వినేసరికి నాకు నీరసం వచ్చేసింది.  ఈ లోపల ధ్వజస్థంభం క్రింద నిధి ఉందని మీడియా మిత్రుల ప్రచారం !! 

ఒక నిర్వేదం చుట్టుముట్టేసింది... దిక్కు తోచని ఆ స్థితిలో ఆ శ్రీనివాసుడే శరణ్యం అనుకున్నాను…

అలా ఆలోచిస్తూనే ఆ రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఇక ఆలయం నుండి బయల్దేర బోతుండగా, బెంగుళూరు నుంచి హెచ్‍. ఎస్‍. ఆర్‍. అయ్యంగార్‍ అనే భక్తుడు నాకోసం టెలిఫోన్‍ కాల్‍ చేశారు. అసహనంగానే ఆ ఫోన్‍ అందుకొని నేను మాట్లాడగానే, ఆయన ప్రవాహంలాగా చెప్పుకుంటూ పోతున్నాడు.... ‘‘అయ్యా, మీరు ధ్వజస్తంభాన్ని మార్చాలనుకుంటున్నారని రేడియాలో విన్నాను. అలాంటి ధ్వజస్తంభానికి మాను కావాలంటే కనీసం 280-300 సంవత్సరాల వయసున్న టేకు చెట్టు కావాలి. కర్నాటకలోని దండేలి అడవుల్లో మాత్రమే అది దొరికే అవకాశంవుంది.... ఇక్కడి అటవీశాఖ ఛీఫ్‍ కన్సర్వేటర్‍ నాకు చాలా మిత్రుడు.... మీరు అనుమతిస్తే, నేను నా మిత్రుడి సహాయంతో అడవుల్లో గాలించి అలాంటి చెట్టుని ఎంపిక చేయిస్తా. మీరు లాంఛనప్రాయంగా ఒక లెటర్‍ ఆయనకి వ్రాయండి. మిగతా సమన్వయం బాధ్యత అంతా నాకు వదిలేయండి…..’’

అంతే, మరుక్షణం నేను అక్కడే ఆలయంలో కూర్చునే, కర్నాటక ఛీఫ్‍ సెక్రటరీతో, ఛీఫ్‍ కన్సర్వేటర్ తో  లాంఛనప్రాయంగా టెలిఫోన్‍లో మాట్లాడి, వాళ్ళ హామీ కూడా తీసుకున్నాను. ఇదంతా అయ్యేసరికి రాత్రి 11 గంటలు దాటింది....  

బెంగుళూరులో అయ్యంగార్‍ ప్రోద్బలంతో ఛీఫ్‍ కన్సర్వేటరూ, వారి సిబ్బందీ గాలింపు జరిపి, ఒక వందచెట్లు పరీక్షించాక, దండేలి ప్రాంతంలోని కొండవాలుల్లో ఒక పదహారు టేకుచెట్లు వరకూ మాకు పనికి రావచ్చని తేల్చారు. సరిగ్గా అదే వారంలో కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ గుండూరావు సకుటుంబంగా తిరుమలకు రావడం, నేను ఈ ధ్వజస్తంభం విషయం వారికి చెప్పడం, ఆయన వెంటనే ‘‘నూతన ధ్వజస్తంభం మానుని టిటిడికి కర్నాటక విరాళంగా తీసుకోండి’’ అని ప్రకటించడం జరిగిపోయాయి. 

ఆ వారాంతంలో నేను, మా ఇంజనీర్లతో కలిసి వెళ్ళి, అయ్యంగార్‍, ఛీఫ్‍ కన్సర్వేటర్‍ వెంటరాగా, ఆ 16 టేకు చెట్లు పరీక్షించాం. చివరకి వాటిల్లో మా కంటికి కనుపించినంతవరకు ఆరు చెట్లు మాత్రమే నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా వున్నాయి. వాటిల్లో రెండు మా అవసరానికి మించిన ఎత్తులో వున్నాయి. నేను టిటిడి అవసరాలు దృష్టిలో వుంచుకొని, మొత్తం ఆరు చెట్లూ మాకే కావాలన్నాను.

అద్భుతం ! బెంగుళూరుకు తిరిగివచ్చి, ముఖ్యమంత్రిని, ఛీఫ్‍ సెక్రటరీని కలిసి మాట్లాడితే, ఆ ఆరు చెట్లూ విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతే, చెట్లు నరకడం ఆరంభమైంది. కానీ అప్పుడే ఎదురైంది - మరో జటిలమైన సమస్య.... ఆ ఎత్తుపల్లాల అడవుల్లో కొన్ని కిలోమీటర్ల దూరం వస్తేగాని మెయిన్ రోడ్డు రాదు. అంతదూరం వాటిని మోసుకుంటూ తేవటం ఎలా ?

విచిత్రం! ఆ అడవిలో సోమానీ వారి పేపర్‍ మిల్లుకోసం కలప నరికే వాళ్ళకి తెలిసింది మా హడావుడి అంతా. ఆ మిల్లు యాజమాన్యం, సిబ్బందీ వచ్చేశారు. ‘‘అయ్యా! ఈ పని మాకు వదిలేయండి. ఇది శ్రీనివాసునికి మా సేవగా భావించండి’’ అంటూ ఆ కార్యభారం వాళ్ళు తలకెత్తుకున్నారు. ఇంక చెప్పేదేముంది. 

వారం రోజుల్లో చెట్లు నరకటం, వాటిని సోమానీ మిల్లు సిబ్బంది - తాళ్ళు, కప్పీలు, గొలుసులు వగయిరా సామగ్రి వుపయోగించి రోడ్డు మీదకు చేర్చటం పూర్తయిపోయింది. ఈ లోపల అయ్యంగార్‍ మళ్ళీ చొరవ తీసుకుని, ఒక 16 చక్రాలుండే పొడవాటి ట్రక్‍ని మాట్లాడాడు.

రెండురోజుల్లో ఆరుమానుల్నీ తీసుకుని ఆ ట్రక్‍ బెంగుళూరు వచ్చింది. అక్కడ విధానసౌధ దగ్గర చిన్న పూజా కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి వాటిని టిటిడికి విరాళంగా ఇస్తున్నట్లు లాంఛనప్రాయంగా ప్రకటించి, నా చేతికి అప్పగించారు. వేలాది ప్రజల సమక్షంలో జరిగిన ఆ అప్పగింతలో ఆ మానుల్ని తాకగానే అనిర్వచనీయమైన ఆనందంతో నా ఒళ్ళు పులకించింది. (ఎందుకలా?)....... 

ఆ మర్నాడు సాయంత్రం నాలుగు గంటలకే ట్రక్‍ తిరుపతి చేరుకుంది. వూరి బయట డెయిరీ ఫారం దగ్గర వేలాది స్త్రీ, పురుషులు గుమికూడారు. ఆ మానులు రాగానే హారతులిచ్చారు. ‘గోవిందా, గోవిందా’ అనుకుంటూ తన్మయత్వంతో నినాదాలు చేశారు. మరో గంటలో ఆ ట్రక్‍ ఘాట్‍ రోడ్డు మొదలుకి (అలిపిరి) చేరుకుంది. అక్కడిదాకా అంతా ఆనందమే. డ్రైవర్‍ ట్రక్‍ దిగాడు. కొండకేసి చూశాడు. ఘాట్‍రోడ్డు 18-19 కిలోమీటర్ల దూరం.... ఏడెనిమిది సంక్లిష్టమైన మలుపులు.... నా దగ్గరకు వచ్చాడు.

‘సర్‍, ఇది నా జీవితంలో ఒక గొప్ప సాహసం. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రక్‍ ఆపకుండా కొండమీదకు నడపగలగాలి. అలా నడిపితేనే నాకు సంతృప్తి. మధ్యలో ఘాట్‍రోడ్డు పిట్టగోడలు దెబ్బతినొచ్చు.... ట్రెయిలర్‍ తగిలి బండరాళ్ళు దొర్లిపడొచ్చు.... ఎన్నిరోజులు పడుతుందో తెలీదు. ఏమైనా కానీ, నేను ఇది చేసి తీరాలి.....’’ 

నేను హామీ ఇచ్చాను - ‘‘బండలు విరిగిపడినా, పిట్టగోడ కూలిపోయినా, నీకు బాధ్యతలేదు. అదంతా మేం చూసుకుంటాం....’’ (అక్కడికేదో అంతా మేమే చేస్తున్నట్లు, మా శక్తితోనే అంతా నడిచిపోతున్నట్లు ఆత్మవిశ్వాసం. నిజమా?)

ఈ లోపల తిరుమలకి వెళ్లే  ట్రాఫిక్ ని కూడా (క్రిందకి దిగే) పాత ఘాట్ రోడ్డు మీదకి మళ్లించాము.  

మొత్తంమీద ఆ సంధ్యా సమయంలో అరుణ కాంతుల వెలుగులో ఆ టేకుమానులు భగవంతుని ముంగిట్లో ధ్వజస్తంభాలుగా మారటం కోసం ఆ ట్రక్‍మీద ఘాట్‍ రోడ్డులో ప్రయాణం సాగించాయి....

భయపడినట్లుగానే ట్రక్‍ మలుపుతిరిగినప్పుడల్లా కొన్నిచోట్ల ట్రెయిలర్‍ పైన మానులు కొండని కొట్టుకుని బండలు పడ్డాయి...

కొన్ని మలుపుల్లో లోయవైపున్న పిట్టగోడకూలిపోయింది....

మరికొన్ని మలుపుల్లో ట్రెయిలర్‍ వెనకాల ఒకవైపు చక్రాలు పిట్టగోడని గుద్దేసి, లోయ మీంచి దూకేశాయి....

వెనకాల కారులో వెళ్తున్న నాకూ, మా ఇంజనీర్లకీ ఈ ఫీట్లు చూస్తుంటే ఒళ్లు జలదరిస్తోంది. ఒకటి రెండు మలుపుల్లో సగం ట్రెయిలర్‍ లోయ అంచుమీంచి గెంతినట్లే అయింది.                            

‘‘ఆఁ ఆఁ..’’ అనుకుంటూ వెనకాల కార్లలో మేం ఆందోళనతో వూగిపోతున్నాం.

ఏ మలుపులో నయినా ట్రెయిలర్‍ క్రిందపడిపోతే.... ! ఇలాంటి ఆలోచనలు నాలో టెన్షన్‍ పెంచేస్తున్నాయి. క్షణాలు- నిముషాలు - గంటలు దొర్లిపోయాయి. "గోవిందా ... గోవిందా ..."

... గంటలు కాదు.   ఒక గంట దొర్లేలోపలే, అంటే 55 నిమిషాల్లోనే ఫీట్లు చేసుకుంటూ, మా సంభ్రమాశ్చర్యాలమధ్య ధ్వజస్తంభాల మానులతో ట్రక్‍ తిరుమలకి చేరిపోయింది. 


ఒక్కసారిగా వందలాది భక్తులు, టిటిడి ఉద్యోగులు ఆనందోత్సాహాలతో చేస్తున్న ‘‘గోవిందా-గోవిందా’’ పిలుపులతో తిరుమల గిరులు ప్రతిధ్వనించాయి.

నా కళ్లని నేనే నమ్మలేకపోతున్నాను.

నాలో ఆనందపు అలలు పొంగి ఆకాశాన్ని తాకుతున్నంత ఉద్వేగం కలిగింది. నాకు తెలీకుండానే నా కంట్లోంచి ఆనంద (భక్తి) బాష్పాలు రాలుతున్నాయి. ఆ ఆనంద రసానుభూతిలో కొన్ని క్షణాలపాటు చేష్టలుడిగి అలా వుండిపోయాను!!

ఏమిటా అద్భుతం! సూర్యాస్తమయం ఆరంభమయ్యే సమయంలో అలిపిరిలో బయల్దేరిన ట్రక్‍, సూర్యుడు పశ్చిమాద్రిన పూర్తిగా అస్తమించే సమయానికి కొండకి చేరిపోయింది. ఇంకా విచిత్రం, ట్రక్‍ యజమాని మా వెనకాలే కారులో వచ్చి నమస్కారం పెడుతూ అన్నాడు - ‘‘స్వామి వారికి ఇంత గొప్ప సేవ చేసే అవకాశం లభించడం నా అదృష్టం. అందుకే నేను ఒక్క నయాపైసా కూడ రవాణా ఛార్జీలు తీసుకోవటం లేదు’’. (అతనికా ప్రేరణ ఎక్కడ్నుంచి కలిగింది?) 

- అయ్యంగార్‍ ని, ట్రక్‍ యజమానిని, డ్రైవర్‍ ని వేదపండితుల ఆశీర్వచనాలమధ్య, ప్రత్యేక దర్శనంతో, శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించాం. 

మరి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడం ఎలా? ఎలా? - అలా రోజంతా నేనూ, మా ఇంజనీర్లు, అధికారులూ తలలు బద్ద్లయ్యేలా అర్ధరాత్రిదాకా చర్చలు జరిపి, ఇక జరిపే శక్తిలేక మర్నాటికి వాయిదా వేసుకుని వెళ్లిపోయాం. నాకు ఒక పట్టాన నిద్ర రాలేదు. మూడు వారాల పాటు అష్టకష్టాలు పడి టేకు మానులు తీసువచ్చాక, వాటి ప్రతిష్ఠ ఎలా చేయాలీ అన్నదానిమీద ఇంత తర్జనభర్జన ఎందుకు జరుగుతోంది? ఇంతమంది ఇంజనీర్లు, మేధావులం కలిసి కూడా ఈ చిన్నపని చేయలేకపోతున్నామా? ఎందుకు చేయలేకపోతున్నాం... ? 

అలా ఆలోచిస్తుంటే, అప్పుడే మళ్లీ స్ఫురించింది - ‘‘ఏ శక్తి ఇంతపని చేయించిందో, ఆ శక్తి మిగతా పనికూడా చేయించదా?... ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపజేసే ప్రాప్తం నాకుంటే నా చేతుల మీదుగా జరుగుతుంది. లేకపోతే లేదు..’’ 

ఈ ఆలోచన రాగానే మనసు కుదుటపడింది. ప్రశాంతంగా నిద్రపోయాను. 

అందుకు భిన్నంగా జరగలేదు. ఉదయం చర్చల్లో కూర్చున్న కొద్దిసేపట్లోనే ఎవరో అన్నారు - ‘‘ఎందుకండీ ఇదంతా, మానుని మహద్వారంలోంచి మోసుకువచ్చేటప్పుడే దాని తలభాగం వీలైనంత ఎత్తుకి లేపి వుంచుతూ, మొదలు భాగం నేలమీదకే వుంచుతూ, ఏతాం ఆకారంలో తీసుకువద్దాం. అది సరిగ్గా మంటపం క్రిందకు వచ్చేసరికి, దాన్ని ఆ రంధ్రంలోంచి పైకి దోపుదాం. మన పాపనాశనం డామ్‍ కడుతున్న ఇంజనీరింగ్‍ సిబ్బంది, అక్కడి కళాసీల సహాయం తీసుకుందాం..’’- 

బ్రహ్మాండమైన ఆలోచన. (ఎక్కడిదీ ప్రేరణ?) ఆగమేఘాల మీద ఇంజనీర్లు కొలతలు వేసి, మహద్వారంలోపల్నుంచి బలిపీఠం వరకు నేలని లోతుగా తవ్వుకుంటూ వెళితే, ఈ ప్లానుని అమలు చేయటం సాధ్యమవుతుందని తేల్చారు. పైగా మహద్వారానికీ, బలిపీఠంకీ మధ్య ఎంత తవ్వినా, ఏం చేసినా యాత్రికుల వరుసలకి  ఏమాత్రం అవరోధం వుండదనికూడా స్పష్టం చేశారు. 

ఇంక ఆలస్యం చేయలేదు. ముహూర్తం చూసి, హెచ్‍సిఎల్‍ ఇంజనీరింగ్‍ సిబ్బంది, కళాసీల సాయంతో ధ్వజస్తంభానికి ఎంచుకున్న టేకు మానుని సన్నిధి వీధిలోంచి, గొల్లమండపంలోంచి, మహద్వారంలోంచి ఆలయంలోకి ప్రవేశపెట్టాం. అక్కడ్నుంచి మానుశిఖర భాగం మంటపం పై కప్పును చూస్తూ లేచేలా ఎక్కడికక్కడ సర్వే బాదులతో స్టాండ్‍లు ఏర్పాటు చేశారు. మెల్లగా కళాసీలు మానుని ముందుకు తోస్తుంటే, అది అలా అలా లేచి సరిగ్గా మంటపం పై కప్పులో రంధ్రాన్ని క్రిందనుంచి చేరుకుంది. మహద్వారం దగ్గర్నుంచి బలిపీఠం దాకా నేలమీద గోతిలో మాను మొదలుని ముందుకు తోసుకు వెళ్తుంటే, ఇంజనీర్ల నైపుణ్యం ఫలించి, ఆ మాను శిఖరం మంటపం పైన రంధ్రం లోంచి పైకి, ఆకాశాన్ని చూస్తూ లేచి నిటారుగా నిలబడింది. మంటపం ఏ మాత్రం దెబ్బతినకుండా ఆ సాయంత్రానికల్లా దండేలీ అడవుల్లోని టేకుచెట్టు తిరుమలేశుని ఆలయంలో ధ్వజస్తంభంగా ప్రతిష్ఠకు సిద్ధంగా నిలబడింది. 

అద్భుతం ! … ఏమా శ్రీనివాసుడి కరుణ….. ?

అప్పుడే ఓ చిన్న కొసమెరుపు !  

ధ్వజస్తంభం క్రింద శాస్త్రానుసారంగా నవరత్నాలు, నవ ధాన్యాలు వగైరా వుంచాలన్నారు. అవి రెండు పెట్టెల్లో పెట్టి ధ్వజస్తంభం క్రింద పునాది భాగంలో పెట్టాం. అకస్మాత్తుగా నాకు ఏదో తోచింది. వెంటనే నా మెడలో శ్రీనివాసుని డాలర్‍తో వున్న గోల్డ్ చైన్‍ తీసి ఒక పెట్టెలో వేశాను. క్షణాల్లో చుట్టూ చేరివున్న అర్చకులు, మిరాసీదార్లు, విఐపిలు, ఇతర భక్తులు కూడా ముందుకు వచ్చారు - శ్రీవారి ధ్వజస్తంభానికి తమ భక్తి పూర్వక బహుమానం ఇవ్వటానికి. అంతే! ఉంగరాలు, చైన్‍లు వగయిరా ఆభరణాలతో మరో పెట్టె నిండిపోయింది. అలా ఆ పెట్టెల్ని నిక్షిప్తం చేసి, వాటిపై కాంక్రీట్‍ పోశాక, దానిపైన ధ్వజస్తంభాన్ని సరిగ్గా 90 డిగ్రీల కోణంలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠింపజేశాం. (పాత ధ్వజస్తంభం మానుని పాపనాశనం డామ్‍లో వేదోక్తంగా విశ్రమింపజేశాం) ఒక నెల రోజులకి నూతన ధ్వజస్తంభానికి ప్లాట్‍ఫారమ్‍ నిర్మాణం, పైన బంగారు ప్లేట్లు తొడగటం, శిఖర భాగాన పతాకాన్ని నిలబెట్టడం, ధ్వజస్తంభానికిముందు బలిపీఠం నిర్మించడం పూర్తయ్యాయి. 

ఒక మినీ బ్రహ్మోత్సవం తలపెట్టి (మిగతా అన్ని మరమ్మతులు, బంగారు ప్లేట్లకు మెరుగు పెట్టడాలు వగయిరా అన్నీ పూర్తిచేశాక), ఆ బ్రహ్మోత్సవంలో భాగంగా ఆస్థాన పండితుల ఆశీర్వచనాల మధ్య, వేద మంత్రోచ్చారణలతో తిరుమల గిరులు ప్రతిధ్వనిస్తుండగా 1982 జూన్‍ 10న ధ్వజస్తంభాన్ని, బలిపీఠాన్ని పవిత్రం చేశారు. 

ఇది జరిగిన ఆరో రోజున (జూన్‍ 16న) నేను మరొకరికి పదవీబాధ్యతలు అప్పగించి, బదిలీ అయి వెళ్లిపోయాను. 

ఆ ఉదయం అలా బదిలీ అయి వెళ్లిపోతూ, దండకారణ్యం నుంచి వచ్చి ఆలయంలో స్థిరపడిన టేకు చెట్టు (ఇప్పుడది ధ్వజస్తంభం) కేసి చూశాను. పతాక భాగంలో గంటలు నన్ను చూసి పలకరిస్తున్నట్లుగా చిరు సవ్వడులు చేస్తూ వూగుతున్నాయి. ఏదో వింత అనుభూతి ...! 

అక్కడే వున్న ఒక వృద్ధ పండితుడు చిరునవ్వు నవ్వి, ఒక శ్లోకం చదివారు : 

‘‘నాహం కర్తా హరిః కర్తా

తత్పూజా కర్మ చాఖిలం

తదాపి మత్కృతా పూజా

తత్ప్రసాదేన నా అన్యథా’’

“నేను కాదు కర్తని. చేసేది చేయించేది అంతా ఆ శ్రీహరే. నా ద్వారా ఏ సత్కార్యం జరిగినా అది భగవంతుడి ప్రసాదమే తప్ప వేరేమీ కాదు.”

(Source: పూర్వ ఐఏఎస్ అధికారి  పివిఆర్ కె ప్రసాద్ రచన  'నాహం కర్తా, హరిః కర్తా')

 ------- -———— ————- ————- 

(This happened on June 10, 1982 i.e 40 years ago. I was a witness to the episode... Valliswar)

Wednesday 15 June 2022



 నెల్లూరు మహనీయురాలు పొణకా కనకమ్మ గారు





Monday 13 June 2022

క్రిటికల్ థింకింగ్ అంటే ఇంగిత జ్ఞానం .


 "నాన్నా ! నాకు ఈ పరీక్షల్లో గత పరీక్షతో పోలిస్తే అయిదు రెట్లు ఎక్కువ మార్కులు వచ్చాయి " చెప్పాడా అబ్బాయి .

తండ్రి ఆనందం తో ఉబ్బితబ్బిబై స్నేహితులకు పార్టీ ఇచ్చాడు ." మా అబ్బాయి సూపర్!" అని చెప్పాడు .పార్టీ లో ఒకడు "ఇంతకీ, మీ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయి?" అని అడిగాడు . తండ్రి అప్పుడు కొడుకుకు ఫోన్ చేసి విషయం కనుకొన్నాడు . వాడికి గత పరీక్షలో నూటికి ఒక మార్కు వచ్చింది . ఇప్పుడు నూటికి అయిదు మార్కులు వచ్చాయి . విషయం అర్థం అయ్యే సరికి పార్టీ లో ఒకడి మొఖం లో కళ లేకుండా పోయింది .
ఇంకో చోట .. రియల్ ఎస్టేట్ ప్రకటన . "మార్కెట్ రేట్ కోటి రూపాయిలు .. మా దగ్గర కేవలం యాభై lakhs . హాట్ కేకుల్లా కాదు కాదు .. రెండిసివెర్ మందులా అమ్ముడు పోయింది .
విషయం ఏమిటంటే మార్కెట్ లో అయిదు వందల గజాల సైట్ కోటి రూపాయిలు . వీడు అమ్ముతున్నది రెండు వందల గజాల సైట్ .దాన్ని కింద కనిపించి కనిపించకుండా బ్రోచర్ లో ప్రింట్ చేసాడు
రానున్నది అపసమాచార యుగం ... విషసమాచార యుగం .
ఒకప్పుడైతే సమాచారం లేక అనేక సమస్యలు ఎదురయ్యేవి . ఇప్పుడు సమాచారం పుంఖానుపుంఖాలుగా లభిస్తోంది . జనాల్ని మోసం చేసేటోడు తెలివిగా సమాచారాన్ని వక్రీకరించి గణాంకాలతో మోసం చేస్తాడు .
ఇప్పుడు కోవిద్ కేసుల గాలి లెక్కలే తీసుకోండి . గత వారం నుండి కోవిద్ టెస్ట్ లను మూడు- నాలుగు రెట్లు పెంచారు . ఆ విషయం దాచేసి "వామ్మో నాలుగు రెట్లు పెరిగిన కోవిద్ కేసులు" అని ప్రచారం . రెండుళ్లుగా ఇదే పద్దతి .ఇదే మోసం
వాక్ సీన్ సంగతే తీసుకొందాం . మొన్నటి దాకా ఏమి చెప్పారు ?" అసలు వాక్ సీన్ కు సైడ్ రియాక్షన్ ఏంటండీ ? బుద్ది ఉందా ? సైన్స్ తెలుసా ? ఇంత అజ్ఞానమా ?" అని దబాయించారు . వేల కేసుల్లో ఒకటో రెండు ప్రభుత్వం దాక చట్టబద్ధ సంస్థల దాక వెళ్లి వాక్ సీన్ వల్లే అని రుజువు కావడం తో ఇప్పుడు మాట మార్చారు . " అబ్బే .. ఎక్కడో నూటికో కోటికో ఒక్కటండి..... అయినా వాక్ సీన్ మా తల్లి చేసిన మేలు ముందు ఈ కీడు ఎంత ?" అని అనునయిస్తున్నారు .
ఇది కేవలం ప్రారంభం . రానున్న రోజుల్లో ఇలా అందమైన అబద్దాలు, గణాంకాలు, పట్టికలు తో జిగాబైట్ల కొద్దీ అబద్దాలు ప్రచారం లోకి వస్తాయి .మోసాలు నేరాలు ఘోరాలు సాధారణం అయిపోతాయి .
రానున్నది రోబో యుగం . కృత్రిమ మేధ యుగం
రోబో యుగం లో క్రిటికల్ థింకింగ్ వున్నవారే బతికి జీన్స్ పాంట్స్ ధరిస్తారు . మిగతా వారు బకరాలుగా మోసపోయి దుర్భర జీవితం గడుపుతారు
క్రిటికల్ థింకింగ్ అంటే ఇంగిత జ్ఞానం .
విన దగు నెవ్వరు చెప్పిన... వినినంతనే వేగ పడక వివరింప తగున్. .....
పేపర్ లో వచ్చింది ... టీవీ లో వచ్చింది... వాట్సప్ లో వచ్చింది.... అని గుడ్డిగా నమ్మితే ఆస్తులు ప్రాణాలూ హరీ మంటాయి . దేన్నీ గుడ్డిగా నమ్మొదు. ఆలోచించండి . విచారించండి . తర్క విచారణ అవసరం . లాజికల్ థింకింగ్ .. లాటరల్ థింకింగ్ . క్రిటికల్ థింకింగ్ అవసరం . రోబో యుగం లో బతకడానికి అదే ఆక్సిజన్
హెడ్లైన్స్ చూసి గుడ్డిగా నమ్మేవాళ్ళు .. మెసేజ్ చదివీ చదవక వెంటనే ఫార్వర్డ్ చేసేవారు .. ఇలాంటి వారిని వెబకూఫ్ అంటారు . బేవకూఫ్ అంటే తెలివితక్కువ వ్యక్తి అని . వెబ్ అంటే నెట్ లో వచ్చింది ప్రతిదీ నిజం అని నమ్మేవాడు వెబ్ కూఫ్ .వెబ్ కూఫ్ లను మనం బాలరాజులు అని చెప్పుకొందాము
భావి రోబో ప్రపంచ విధాత గేట్ల తాత !
గేట్ల తాత నాలుగో పారిశ్రామిక యుగం లో ప్రపంచం ఎలా ఉండాలో నిర్ణయిస్తున్నాడు .రోబో యుగపు బ్రహ్మ . ఎక్కడో దూరంగా కూర్చొని మన తలరాతలు రాస్తున్నాడు .చిత్రమైన గారడీ చేస్తూ... తమాషాలు చూస్తున్నాడు
వెబ్ కూఫ్ ల గురించి గేట్ల తాత ఆలోచనలు ఇలా వున్నాయి ..
"ఏమిరా బాల రాజులూ! . ఏమిరా మీ వల్ల ప్రపంచానికి ఉపయోగం? . వృధాగా పుట్టి పుడిసినారు . రోజూ తిని పుడిసినారు . మీ వల్ల పర్యావరణం నాశనం . ప్రకృతి విలయం . రోబో యుగం లో మీ లాంటి గొర్రెల వల్ల ప్రయోజనం ఏందిరా ? పాండిరా . సూది మందు వేసుకోండి రా . ఈ భూమి భారాన్ని తగ్గించాలి . ఇంగిత జ్ఞానం వున్నవాడు ఉంటే చాలు . . పాండిరా బలరాజులు/ రాణులూ "
మీకు అర్థం అయ్యిందా ? అర్థం అయితే వెంటనే నమ్మేయకండి . ఇది నిజామా అని ఆలోచించండి . క్రిటికల్ థింకింగ్ . ఆ దారిలో ఆలోచించాలి . ప్రతి విషయం గురించి ఆలోచించాలి . కొన్ని ఉదాహరణలు ఇస్తాను . బాగా ఆలోచించండి .
1 . "కంచి దగ్గర స్కూల్ బస్సు ఆక్సిడెంట్ కు గురయింది .గాయపడ్డ బాలబాలిక చికిత్స కోసం రక్తం కావాలి" అని మెసేజ్ . అయ్యో అంటూ ఫార్వర్డ్ చేసారు బాలారాజులు. పాపం జాలి గుండె . అసలు ఆక్సిడెంట్ అయ్యింది ఎప్పుడు? డేట్ ఏంటి? అని చెక్ చేసారా ? ఆ మెసేజ్ బలరాజుల పుణ్యమా అని ఇంకా వాట్సాప్ లో తిరుగుతూనే వుంది . ఆ పిల్లలు చదువు ముగించుకొని ఉదోగాల్లో స్థిరపడి ఉంటారు. మెసేజ్ మాత్రం ఇంకా వైరల్
2 . బెంగళూరు లో ఆక్సిడెంట్ కు గురయిన దంపతుల కిడ్నీ లు ఉన్నాయి అనే మెసేజ్ వైరల్ . కిడ్నీ లు దొరకడానికి ఇదేమైనా పంజాగుట్ట మటన్ షాపా? అసలు కిడ్నీ లను ఆలా ఎవరైనా రోజుల తరబడి మెసేజ్ లు పెట్టి , ఫార్వర్డ్ లు చేసి దానం ఇస్తారా ? ఏమిరా జాలిగుండె బాలరాజులూ !
3 . బెంగళూరు లో ఎవరో ఉచిత విద్య ఇస్తున్నారు అని మెసేజ్ వైరల్ . కనీసం అక్కడి ఇచ్చిన నెంబర్ ల కు ఫోన్ చేస్తే అవన్నీ ఎందుకు స్విచ్ ఆఫ్ అయివున్నాయో అర్థం అయ్యేది . కానీ మనోళ్లు బాలరాజులు . డేటా ఎక్కువ వినియోగం .. సర్వీస్ ప్రొవైడర్ ఆనందం లో . బాల రాజుల వల్ల లాభపడేది వారే . అసలు ఇలాంటి మెసేజ్ లకు పుట్టిల్లు వారే
4 . సంవత్సరాల తరబడి తెగ తిని ఒక్క సారి నిద్రలేచి స్లిమ్ అయిపోవాలి అనుకొని డైట్ కంట్రోల్ చేయలేక, వ్యాయామం చేయలేక హెర్బల్ మెడిసిన్ తింటే సన్నబడి పోతాము అనుకొని తిని కిడ్నీ లను కోల్పయిన బాల రాజు లు బాల రాణులు కోకొల్లలు . యెవడేమి చెప్పినా నమ్మేయడమేనా ? కుందేళ్ళ యాపారం, టేకు చెట్ల యాపారం ,గంధపు చెక్క యాపారం లో పెట్టుబడులు పెట్టి కోటీశ్వరులయిన అయినా వారు ఎంత మంది ? .. జపాన్ చాప పై పడుకొని .. రూమ్ లో మెషిన్ పెట్టుకొని ఆరోగ్యవంతులయిన వారెంతమంది ? ఏమిరా బాల రాజూ !
5 . మనం భారతీయులం . మన జాతీయ గీతం అంటే మనకు ఎంతో ఇష్టం . గర్వ కారణం . బాగుంది . కానీ 180 కి పైగా దేశాలు, నూరుకు పైగా భాషలు ఉన్న ప్రపంచం లో ఇన్ని భాషల్లోని జాతీయ గీతాలను విని అర్థం చేసుకొని అందులో ఒక జాతీయ గీతం ఉత్తమం అని నిర్ణయించడం సాధ్యమా? అని ఆలోచించకుండా మన జాతీయ గీతానికి ఉత్తమ గీతం అవార్డు వచ్చిందనే మెసేజ్ ని వైరల్ చేసిన బాల రాజులు .. గేట్ల తాత ఉన్నాడు. పైకి పంపించేస్తాడు . జాగ్రత్త
బాలరాజుల పట్ల గేట్ల తాత జీరో టాలరెన్స్ పాలసీ లో వున్నాడు . వాడికో పెద్ద అంతర్జాతీయ బృందం . మైక్ లు.. కరపత్రాలు .. అమ్ముడు పోయిన వారు .... మేళగాళ్ళు . బ్రోకర్ లు . ప్రచారం చేసేవారు . నిజం చెప్పేవారు పై ఎదురు దాడి చేసేవారు . తస్మాత్ జాగ్రత్త్త . బుర్ర ఉపయోగించండి .
ఇంగిత జ్ఞానం ఉన్నోనిదే రేపటి ప్రపంచం .
ఇంగిత జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని అనుకొంటున్నారా ? ఇది సూపర్ మార్కెట్ లో . చైనా వారి కోళ్ల ఫారాల్లో దొరకదు .
తెనాలి రామలింగడి కథలు .. అక్బర్- బీర్బల్ కథలు .. పంచ తంత్రకథలు ..
చందమామ .. బాలమిత్ర ..
రోబో యుగం లో ముందుకు వెళ్ళాలి అంటే మీరు ఎప్పుడో పనికి రాదని వదిలేసిన పాత పద్ధతుల్లోకి, పాత ప్రపంచం లోకి మళ్ళీ వెళ్లాల్సిందే .
కృత్రిమ మేధ యుగం లో సహజ మేధ ఉన్నోడిదే బతుకు . దాన్ని పెంచుకోండి . మేధ అంటే బట్టి కొట్టడం కాదు . గుడ్డిగా నమ్మడం కాదు . మేధ అంటే ఒక తెనాలి రామలింగడు . ఒక బీర్బల్ .
సహజ మేధ .. అదే బతుకు .. అదే భవిత

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...