Thursday 12 October 2023

 [10/12, 15:43] +91 85003 01961: ----------------------

వక్రీకరణలను దాటి బుద్ధుణ్ణి తెలుసుకు

ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిట్ పేజ్లో నా వ్యాసం...

స్థలాభావం కారణంగానో, మరో కారణంతోనో పత్రికలో నా వ్యాసం కొంత కుదింపుకు లోనైంది. ఇక్కడ పూర్తి పాఠం ఇస్తున్నాను...

ఆగస్ట్ 13న వచ్చిన 'బుద్ధుడు వైదిక మత వ్యతిరేకా?' నా వ్యాసానికి స్పందనగా బొర్రా గోవర్ధన్ ఆగస్ట్ 30న 'బుద్ధునిపై ఇన్ని అబద్ధాలా.!?' శీర్షికతో రాసిన వ్యాసానికి బదులు స్పందన...

"బుద్ధుణ్ణి లాక్కొచ్చి అమానవీయ భావజాల పంకిలంలో పడెయ్యడానికి శతవిధాలా ప్రయత్నించారు" అంటూ వ్యాసకర్త బొర్రా గోవర్ధన్  అంతర్జాతీయ అధ్యయనానికి విరుద్ధంగా మనదేశంలో విద్వేషవాదులు సనాతన బుద్ధుణ్ణి భ్రష్టుపట్టించిన వాస్తవాన్ని ఏమరుపాటున చెప్పేశారు. "శతాబ్దాలుగా బౌద్ధాన్ని, బుద్ధుణ్ణి తిరిగి తమవాడిగా ప్రకటించుకోవడానికి వైదిక మతాలు వెనుకాడడం లేదు" అనడం వ్యాసకర్తకు రచదువు లేకపోవడాన్ని పట్టిస్తోంది. THE USBORNE ENCYCLOPEDIA OF WORLD RELIGIONS వంటి అంతర్జాతీయ ఆకర గ్రంథాలు బుద్దుడు హిందువుగా పుట్టాడని, బుద్ధుడు హిందువని విశ్వవ్యాప్తంగా ఉద్ఘాటిస్తున్నాయి. సనాతన ధర్మమే హిందూ మతం అని Geoffrey Parrinder వంటి అంతర్జాతీయ పరిశోధకులు, పండితులు తెలియజెబుతూ వేదాలు, మనుస్మృతి, ఉపనిషత్తులు బుద్ధుడికన్నా పూర్వంవి అని నిగ్గుతేల్చి లోకమంతా చాటారు. బుద్ధుడు సనాతనుడు అన్నది జగమెరిగిన సత్యం. 

సోదాహరణంగా చెప్పడం చాతకాక 

"వైదికమత విరోధి అయిన బుద్ధుడు..." అని అబద్ధం చెప్పారు వ్యాసకర్త. తాను వైదిక మతానికి విరోధినని బుద్దుడు ఎక్కడా చెప్పలేదు. బుద్ధుడి వేద నిరసన అనేది విద్వేషవాదులు సృష్టించిన అబద్ధం. దశావతారాల్లోని బుద్ధుడి ప్రస్తావన త్రిపురాసుర వధ సందర్భంలో ఉంది. గౌతమ బుద్ధుడు ఏ రాక్షస వధా చెయ్యలేదు. దశావతారాల్లో బుద్దుడు, ఈ గౌతమ బుద్ధుడు వేరు, వేరు అన్నది తెలివిడి ఉన్నవాళ్లకు తెలిసిన నిజం.  "క్రీ.శ. 8వ శతాబ్దంలో శంకరాచార్యులవారు" అనడం కాలక్రమంలో ఆవిష్కృతమౌతున్న చారిత్రిక సత్యాల తెలివిడి వ్యాసకర్తకు లేకపోవడాన్ని తెలియజేస్తోంది. ఇటీవలి పరిశోధనలు ఆది శంకరుల జననం సామాన్య శకానికి పూర్వం 509 వ సంవత్సరం అని తెలియజేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా క్రీ.శ. అని కాకుండా సామాన్య శకం(common era) అని అంటున్నారు. ఇంకా క్రీ.శ. అని అనడం వ్యాసకర్త వెనకపాటును తెలియజేస్తోంది. ఆది శంకరులు దశావతార స్తోత్రం రాయలేదు. ఆది శంకరులు దశావతార స్తోత్రం రాశారని చెప్పి వ్యాసకర్త తన మాటలతో నవ్వులపాలయ్యారు. 300 వేర్వేరు సందర్భాల్లో బుద్ధుడు చేసిన బోధల సంకలనం దమ్మపదం. దమ్మపదంలో బుద్ధుడు స్వయంగా యజ్ఞం గురించి ఉన్నతంగా చెప్పాడు. "బుద్ధుడు యజ్ఞ విరోధి" అనడం వక్రత.

"విష్ణుసహస్రనామాల్లోని శ్లోకాల్లో 783 నుంచి 806 వరకు పేర్లు బుద్ధానికి సంబంధించినవే" అని వ్యాసకర్త అనడం  విదూషకత్వం. ఆ పేర్లు ఏవీ బుద్ధానికి సంబంధించినవి కావు. విష్ణుసహస్రనామం చదివితే ఈ నిజం ఎవరికైనా తెలిసిపోతుంది. 'బుద్ధుడు వైదిక మత వ్యతిరేకా?' వ్యాసంలోని వాస్తవాలను జీర్ణించుకోలేక వ్యాసకర్త ఇలా పిచ్చి పేలాపనలు చేశారు. వేద ప్రమాణాన్ని అంగీకరించడం మాత్రమే కాదు వేద చింతనను సరిగ్గా గ్రహించడం, సనాతన జీవనం చెయ్యడం వైదికమే అని వ్యాసకర్త తెలుసుకోవాలి. ధర్మం అన్న పదం గురించి ప్రస్తావిస్తూ వ్యాసకర్త "ధర్మం చెయ్ బాబు" అనడాన్ని చెప్పారు. అది చదువులేనివాళ్లు చేస్తున్న తప్పు అని గ్రహించలేకపోవడం విజ్ఞతా రాహిత్యం. బుద్ధుడిపై చర్చలో పేలవంగా సినిమాల రేలంగిని తీసుకు వచ్చి వ్యాసకర్త బుద్ధుణ్ణి కించపరిచారు. అది గర్హనీయం. 

శ్లోకాలు అన్నా పద్యాలు అన్నా ఒకటే. ఈ చదువు వ్యాసకర్తకు ఇకనైనా రావాలి. తేరవాద బౌద్ధంలో చలామణిలో ఉన్న రెండు గేయ సంకలనాల్ని గాథలు అంటారు. వాటిని తేరగాథా అనీ అంటారు. దమ్మపదంలోని శ్లోకాలు లేదా పద్యాల్ని గాథలు అనరు. వ్యాసకర్తలాంటివాళ్లు బుద్ధుడి మాటను 'ఎలక' గా పరిగణించడంవల్ల వాళ్లకు 'ఎరుక' లేకుండాపోయింది. వ్యాసకర్త ఇకనైనా అంతర్జాతీయ అధ్యయనాల్ని చదివి బుద్దుడిపై తన కుళ్లిపోయిన చింతనను వదిలించుకోవాలి. వ్యాసకర్త హిందూ గురించి అసందర్భ పేలాపన చేశారు. చర్చ బుద్దుడు గురించి కానీ హిందూ గురించి కాదు.

ఆర్య అన్నది విదేశపు తెగ కాదని అంబేడ్కర్ చెప్పాడు. Oxford English Reference Dictionary "ఆర్య అనే తెగ ఉనికి ప్రాయికంగా తిరస్కరించబడింది" అని తెలియజెబుతోంది. ఆర్య అనేది తెగ లేదా జాతి సూచకం అవదు. "బుద్ధుడు విదేశీ ఆర్యుడు కాదు" అని చెబుతూ వ్యాసకర్త తన అవగాహనా రాహిత్యాన్ని చాటుకున్నారు. దమ్మపదంలో "ఆర్యులు చూపిన మార్గం", "ఆర్యులు చెప్పిన ధర్మం", "ఆర్య బోధలు", "ఆర్య సత్యాలు", "ఆర్య సందర్శనం శుభం", "ఆర్య భూమి" అంటూ బుద్ధుడు స్వయంగా చెప్పాడు. బుద్ధుడి మాటలకు విరుద్ధంగా కొందరు అమానుషంగా, అనైతికంగా బుద్ధుడికి తమ బురదను పూస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.

బుద్ధుడి చివరి దశ  మాటలుగా కొన్ని ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో "అప్పొ దీపో భవ" కూడా ఉంది.

"అత్త దీపో...! అత్త సరణో...! అనణ్ణ సరణో...!"  అంటూ వ్యాసకర్త చెప్పింది తప్పు. "దమ్మ దీపా, దమ్మ సరణా, అనన్న సరణా" అన్నది సరైంది. వ్యాసకర్త తాను పోగేసుకున్న చెత్తను బుద్దుడిపై వెయ్యడం బుద్ది దోషం, బుద్ధ ద్రోహం. ధర్మ అనేది పాళీ పదంగా చెబుతూ  బొర్రా గోవర్ధన్ తన అజ్ఞానాన్ని వెళ్లగక్కుకున్నారు. ధర్మ పదం సంస్కృత పదం పాలీ (ళీ కాదు) పదం కాదు. Geoffrey Parrinder,  A DICTIONARY OF NON-CHRISTIAN RELIGIONS గ్రంథంలో ధర్మ పదం సంస్కృతపదం అని తెలియజెబుతూ ఆ పదానికి 'ధృ' ధాతువు అని చెప్పాడు. ఆపై 'దమ్మ' అన్న పదం 'ధర్మ' అన్న సంస్కృతపదానికి పాలీ రూపం అని కూడా తెలివిడినిచ్చాడు. వ్యాసకర్త ఆ తెలివిడితో తన అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. ధర్మ పదానికి పాలీ రూపం దమ్మ కాబట్టి ధర్మ పదానికున్న అర్థాలే దమ్మ పదానికి అన్వయమౌతాయి. ధర్మం దీపం వంటిది, ధర్మమే శరణం, మరొకటి శరణం కాదు అని బోధిస్తూ బుద్ధుడు "దమ్మ దీపా, దమ్మ సరణా, అనన్న సరణా" అనడమూ సనాతనమే. "ఆర్యులు చెప్పిన ధర్మం" అని బుద్ధుడు చెప్పిందాన్ని మరిచిపోకూడదు; మరుగుపరచకూడదు. "బుద్ధుడి మూల బోధలు వైదిక లేదా సనాతనత్వానికి వ్యతిరేకమైనవి కావు" అని అంతర్జాతీయ బౌద్ధ పరిశోధకుడు, పండితుడు ఎకె.కూమారస్వామి 1943లోనే విశ్వవ్యాప్తంగా ఘోషించాడు. బుద్దుడి గురించి చెబుతూ Chambers Biographical Dictionary "అతడి (బుద్ధుడి)విధానం ఒక కొత్త మత విశ్వాసం అవడంకన్నా బహుశా బ్రాహ్మణ మత పునర్నిర్మాణం అవుతుంది" అని అవగాహననిచ్చింది. 

పామరులు సంస్కృతాన్ని అర్థం చేసుకోలేరని బుద్ధుడు తన మాటల్ని సంస్కృతంలోకి తీసుకురావద్దన్నాడు కానీ మరొకందుకు కాదు. ఆ సంస్కృతం ద్వారానే బుద్ధుడి మాటలు ఇండోనేషియా, చైనా, జపాన్ వంటి పలుదేశాలకు వెళ్లి బుద్ధుడికి గుర్తింపును, ఖ్యాతిని, వ్యాప్తిని తెచ్చాయి. శ్రీలంక, బర్మా దేశాలకు మాత్రమే పాలీ ద్వారా బుద్ధుడి మాటలు చేరాయి. బుద్దుడి మాటల్ని ముందుగా సంస్కృతంలోకి తీసుకెళ్లి విశ్వవ్యాప్తం చేసింది కాశ్మీరీ పండిత్‌లు. పుట్టుకతో బ్రాహ్మణత్వం రాదని వేద కాలం, మనువు కాలం నుంచీ చెప్పబడుతోంది. దమ్మపదంలో బ్రాహ్మణుల గురించి బుద్ధుడు 166 పంక్తుల్లో చెప్పింది ఆ వేద  చింతననే. బొర్రా గోవర్ధన్‌ ఇలాంటి నిజాల్ని ఇకనైనా చదువుతో తెలుసుకోవాలి. అంతేకాదు బుద్ధుడి గురించి అంతర్జాతీయ అధ్యయనాల్ని చదవాలి. ఆ చదవుతో వ్యాసకర్త తన మానసిక పాచిని, మాటల పాచిని శుభ్రం చేసుకోవాలి.

మహనీయుడు బుద్దుడిపై చర్చలో సినిమాల  ప్రస్తావన చెయ్యడం వ్యాసకర్త వెకిలితనం. "బుద్ధునిపై ఇన్ని అబద్ధాలా?' శీర్షిక వ్యాసానికి తగ్గట్టుగా ఉంది. అబద్ధాలతో, అసంబద్ధతతో, అజ్ఞానంతో, పేలాపనతో, చదువులేమితో బుద్ధుడి గురించిన వాస్తవాల్ని రూపుమాపేందుకు విఫల యత్నం చేసి బొర్రా గోవర్ధన్ భంగపడ్డారు. 

చదువు, అవగాహన ప్రాతిపదికలుగా బుద్ధుడిపై చర్చలకు బొర్రా గోవర్ధన్ తగిన వ్యక్తి కాదు. 

బుద్ధుడు సనాతనుడు కాబట్టే "బ్రహ్మణ్ణతా"  అంటూ బ్రహ్మన్ స్థితిని దమ్మపదం, అధ్యాయం 23, శ్లోకం 13లో ఇలా తెలియజేస్తున్నాడు: "లోకంలో‌ మాతృత్వం‌ సుఖం;  ఆపై పితృత్వం సుఖం; లోకంలో సన్యాసం(సామణ్ణతా) సుఖం; ఆపై బ్రహ్మత్వం (బ్రహ్మణ్ణతా) సుఖం" (పాలీ: సుఖా మత్తెయ్యతా లోకె/అథో పెత్తెయ్యతా సుఖా/సుఖా సామణ్ణతా లోకె/ అథో బ్రహ్మణ్ణతా సుఖా).  "ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్" అన్న తైత్తిరీయ ఉపనిషత్ మాటనే తన మాటగానూ బుద్ధుడు  "బ్రహ్మణ్ణతా సుఖం" అని చెప్పాడు. (ఇక్కడ బ్రహ్మణ్ణతా అన్నది బ్రాహ్మణత్వాన్ని సూచించదు)

ప్రపంచానికి విరుద్ధంగా, జనబాహుళ్యానికి కంటకంగా మనదేశంలో లోపాయకారీ కారణాలవల్ల జరుగుతున్న విద్వేషవాదుల వక్రీకరణలకు, విధ్వంసక శక్తుల కుట్రలకు అతీతంగా మన బుద్ధుణ్ణి మనం సరిగ్గా ఆకళింపు చేసుకుందాం; బుద్ధుణ్ణి యథాతథంగా అందుకుందాం.

- రోచిష్మాన్

[10/12, 15:43] +91 85003 01961: శాంతికి ప్రయత్నిస్తున్నది ఎవరు?

విఘాతం కలిగిస్తున్నది ఎవరు?

1947లో, ఐక్యరాజ్యసమితి 181వ తీర్మానాన్ని ఆమోదించింది, దీనిని విభజన ప్రణాళిక అని పిలుస్తారు.  ఈ తీర్మానం ద్వారా  బ్రిటీష్ ఈ పాలస్తీనా ప్రాంతాన్ని అరబ్ మరియు యూదు రాష్ట్రాలుగా విభజించడానికి ప్రయత్నించింది.

పాలస్తీనాను,  ఇజ్రాయిలీలు మరియు అరబ్బుల మధ్య విభజించిన 1948 బ్రిటిష్ ఆదేశాన్ని ఎవరు ఉల్లంఘించారు? ఎలా ఉల్లంఘించారు?

అరబ్బులు

1948లో ఇజ్రాయెల్‌పై ఎవరు దాడి చేశారు?

ఈజిప్ట్, సిరియా, జోర్డాన్ మరియు ఇరాకీ దళాలు. వారు పాలస్తీనాలోకి ప్రవేశించి, దాని ద్వారా ఇజ్రాయెల్ దళాలు మరియు యూదు నివాసాలపై దాడి చేశారు.

ఈ దాడుల పై ఇజ్రాయెల్ ఏమి చేసింది?

9 నెలల పాటు సాగిన యుద్ధంలో ఇజ్రెయేల్ ప్రతీకారం తీర్చుకుంది మరియు తనను తాను రక్షించుకుంది. ఇజ్రాయెల్ ఈ అరబ్ దేశాల ఆక్షేపణీయ యుద్ధంలో గెలిచింది మరియు UN ప్రతిపాదిత యూదు రాజ్యంపై నియంత్రణ తిరిగి పొందింది. అంతేకాకుండా అరబ్ రాష్ట్రంలో కూడా సగానికి పైగా గెలుచుకుంది.

ఇజ్రాయెల్‌ను నాశనం చేయడానికి 1967లో దాడికి ప్లాన్ చేసినది ఎవరు?

అరబ్ నేషన్స్.  ముఖ్యంగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ గమాల్ నాసర్.

అయితే వారి దురదృష్టవశాత్తూ ముందస్తు ఇంటెలిజెన్స్ సూచనలు ఆధారంగా ఇజ్రాయెలే దాడులను ముందస్తుగా చేసి ఈజిప్షియన్ మరియు సిరియన్ వైమానిక దళాలపై దాడిని ప్రారంభించింది. ఇజ్రాయెల్ గెలిచింది మరియు సినాయ్ ద్వీపకల్పం, గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం మరియు గోలన్ హైట్స్‌పై ప్రాదేశిక నియంత్రణ 

సంపాదించింది.

1973లో యోమ్ కిప్పూర్ యుద్ధాన్ని (అకా రంజాన్ యుద్ధం) ఎవరు ప్రారంభించారు?

 ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఈజిప్ట్ మరియు సిరియా నేతృత్వంలోని అరబ్ దేశాల కూటమి.

ఇజ్రాయెల్ మళ్లీ తనను తాను రక్షించుకుని గెలిచింది.

1993 OSLO శాంతి ఒప్పందాల వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు?

ఇజ్రాయెల్ రెండు రాష్ట్ర పరిష్కారాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉంది. అయితే, 

అనేక పాలస్తీనా మిలిటెంట్ గ్రూపులతో సహా పాలస్తీనియన్ జనాభాలో అధిక భాగం ఓస్లో ఒప్పందాలను వ్యతిరేకించారు.

2005 ఏకపక్ష కాల్పుల విరమణ ఎవరు ప్రారంభించారు?ఎవరు ప్రాంతాన్ని విభజించారు?

ఇజ్రాయెల్.

ఇజ్రెయేల్ యూనిలేటరల్ డిజ్ ఎంగేజ్మెంట్ ప్రక్రియ ఆగష్టు 2005లో ప్రారంభమైంది.  సెప్టెంబర్ నాటికి, 25 స్థావరాలలో నివసిస్తున్న దాదాపు 9,000 మంది యూదులు తొలగించబడ్డారు. ఇజ్రాయెల్ దళాలు గాజా స్ట్రిప్ నుండి గ్రీన్ లైన్‌ అంటే -- 1949 యుద్ధ విరమణ రేఖ (ఇజ్రాయెల్ మరియు దాని ఇరుగుపొరుగు అరబ్ మధ్య సరిహద్దుల గీత) వరకు వైదొలిగాయి.

2006లో గాజాను  పాలించడానికి హమాస్‌ను ఎవరు ఎన్నుకున్నారు?

పాలస్తీనా ఓటర్లు.

హమాస్ పాలనా శైలి ఏమిటి?

తీవ్రవాదం. 

హమాస్ అజెండా ఏమిటి?

వారు ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలని మరియు ఇజ్రాయీలను నిర్మూలించాలని కోరిక.

కాబట్టి ఇక్కడ నిజమైన బాధితుడు ఎవరు? 

ఇజ్రాయెల్

అందుకే మనం ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వాలి.

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...