Friday 27 January 2023


భారత దేశాన్ని సహాయం అడగండి – పాకిస్థాన్ మీడియా 

*ప్రస్తుతం పాకిస్థాన్ కి సహాయం చేయగల ఒకే ఒక్క దేశం భారత్ మాత్రమే !*

*పాకిస్థాన్ మీడియా ప్రధాని షెహబజ్ షరీఫ్ ని ఉద్దేశిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు ఇవి!*

*పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి పర్యటనకి వెళ్తున్నాడు కానీ పక్కనే ఉన్న భారత దేశానికి ఎందుకు వెళ్లలేకపోతున్నాడు ?* *ఇదీ పాక్ మీడియా వేస్తున్న ప్రశ్న !*

*అమెరికా,చైనా లు ప్రస్తుతం గడ్డు పరిస్థితులని ఎదుర్కుంటున్నాయి కాబట్టి ఈ దేశాలు పాకిస్థాన్ కి అప్పు ఇచ్చే స్థితిలో లేవు. కనీసం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ని అభ్యర్ధించవచ్చు కదా ?* *పాక్ జర్నలిస్ట్ అర్జు కజ్మీ [Arjoo Kazmi ] సూటిగా తన న్యూస్ చానెల్ లో షహబాజ్ షరీఫ్ ని ప్రశ్నిస్తున్నది  మరియు సూచనలు కూడా చేసింది ! అర్జు కజ్మీ అనే మహిళా జర్నలిస్ట్ ఇస్లామాబాద్ కేంద్రంగా యూట్యూబ్ న్యూస్ చానెల్ నడుపుతున్నకొత్తతరం యువ మహిళా జర్నలిస్ట్. చాలా సూటిగా పాకిస్థాన్ ఆర్ధిక* *స్థితిగతుల మీద రోజూ విశ్లేషణలు చేస్తున్నది. అఫ్కోర్స్ పాకిస్థాన్ లో బాగా చదువుకున్న నవతరం యువతీ యువకులు మరియు అనుభవం కలిగిన వృద్ధులు అందరూ అంటున్న ఒకే మాట :* *ప్రస్తుత పరిస్థితులకి ప్రధాన కారణం పాక్ లోని రాజకీయ నాయకులు మరియు సైన్యం అని.*

**************************************************

*పాకిస్థాన్ లోని అన్ని ప్రధాన ఎలెక్ట్రానిక్ మీడియా సంస్థలు కూడా ఒకే రీతిలో విశ్లేషణలు చేస్తున్నాయి! ఇక యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ అయితే ప్రజలలోకి వెళ్ళి ఇప్పుడు పాకిస్థాన్ లో ఉన్న పరిస్థితులకి కారణం ఎవ్వరూ అని సూటిగా ప్రశ్నలు వేసి సమాధానాలు రాబాటుతున్నాయి అంటే అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిసిపోతున్నది !*

*10kg గోధుమ పిండి బస్తా 3100/- రూపాయల ధర పలుకుతున్నది పాకిస్థాన్ లో ! మైదా పిండి కూడా గోధుమ పిండి ధరలోనే దొరుకుతున్నది అదీ బ్లాక్ మార్కెట్ లో!* 

***********************************************

*ఇక పాక్ మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ అయితే మరీ ఘోరంగా విమర్శిస్తున్నాడు : పాక్ ప్రధాని షాహబజ్ షరీఫ్ బొచ్చె పట్టుకొని ప్రతీ దేశానికి వెళుతున్నాడు కానీ ఎవరూ దయతలచి భిక్ష వేయట్లేదు ! ఇలా ప్రతీ బహిరంగ సభలో ఇమ్రాన్ విమర్శిస్తున్నాడు ! ఇమ్రాన్ ఖాన్ అక్కసు అంతా సైనిక జెనెరల్స్ మీదనే ! అసలు ఇమ్రాన్ ఖాన్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది సైన్యం సహకారం వల్లనే !* *పాకిస్థాన్ లో పరిస్థితులు విషమించినప్పుడల్లా పౌర ప్రభుత్వాన్ని బలి పశువుని చేస్తూ ఉండడం సైన్యానికి అలవాటే ! ఇప్పుడున్న తీవ్ర ఆర్ధిక సంక్షోభం కేవలం ఇమ్రాన్ వల్లనే అని సైన్యం ప్రచారం చేసి పదవిలో నుండి దించేసి షాహాబాజ్ షరీఫ్ ని ప్రధాని పీఠం మీద కూర్చోబెట్టింది సైన్యం.*

*కానీ సైన్యాన్ని బహిరంగంగా ఎవరూ విమర్శించరు!*  

*కానీ మొదటి దోషి పాకిస్థాన్ సైన్యమే ! పాకిస్థాన్ దేశపు బడ్జెట్ లో 17% సైన్యానికి కేటాయించబడుతున్నది !* *రూపాయి ఆదాయం వస్తే దానిలో 17 పైసలు సైన్యానికే వెళ్లిపోతే ఇక ఆదేశం ఆర్ధికంగా నిలదొక్కుకునేది ఎప్పుడు ? నిజానికి అధికారికంగా బడ్జెట్ లో చేసిన 17% కేటాయింపులకి తోడు సంవత్సరం మధ్యలో మరో మూడు నుండి నాలుగు శాతం బలవంతంగా లాక్కుంటూ ఉంటుంది. ఒక వేళ తమ మాట వినని ప్రధాని ఎవరన్నా ఉంటే వాళ్ళని బెదిరించి మరీ రాజీనామా చేయిస్తుంది. కొద్దో గొప్పో ఇమ్రాన్ ఖాన్ తమ దేశ ఆర్ధిక స్థితి ని దృష్టిలో పెట్టుకొని సైన్యం అడిగిన అదనపు బడ్జెట్ ని ఇవ్వడానికి నిరాకరించడాని అంటారు అందుకే ఇమ్రాన్ ని సైన్యం దింపేసింది అంటారు!*

*సైన్యానికి కేటాయించినది పోను మిగతా భాగంలో అధికారంలో ఎవరు ఉన్నా తినేస్తున్నారు. చివరికి ఇమ్రాన్ ఖాన్ మీద అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి.* *పాకిస్థాన్ లో సైనిక జెనెరల్స్ కావొచ్చు మాజీ ప్రధానులు కావొచ్చు అందరికీ బ్రిటన్,గల్ఫ్ దేశాలలో అకౌంటులు, ఆస్తులు ఉంటాయి. పదవిలో నుండి దిగిపోగానే అవినీతి చేసి కూడబెట్టిన సొమ్ము ఆల్రెడీ అటు లండన్ లోనో లేదా సౌదీ లోని బాంకులలోనో ఉంటాయి కాబట్టి దేశం విడిచిపెట్టి వెళ్లిపోతారు. వీళ్ల కేమీ ఇబ్బందులు ఉండవు. బాధలు పడేది సామాన్య ప్రజలు మాత్రమే !*

***********************************************

*అర్జూ కజ్మీ మాత్రం చాలా సూటిగా నిక్కచ్చిగా విశ్లేషణ చేస్తున్నది ! ఆమె విశ్లేషణలో భాగంగా ..*

*అమెరికా ఇప్పటివరకు చేసిన సహాయాన్ని పాక్ పౌర ప్రభుత్వం విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ వచ్చింది తప్పితే భవిష్యత్తు ని  దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలంగా పనికివచ్చి మంచి ఆదాయాన్నిచ్చే ప్రాజెక్ట్ ల మీద ఖర్చు చేయలేదు. పాకిస్థాన్ రాజకీయ నాయకత్వానికి తమ స్వంత బాంక్ ఖాతాల మీద దృష్టి తప్పితే దేశ ప్రయోజనాల గురుంచి పాటు పడిన రాజకీయ పార్టీ కానీ ప్రధాని కాని ఎవరూ లేరు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కి బ్రిటన్ లో స్టీల్ ఫాక్టరీలు ఉన్నాయి. కానీ వాటికి కావాల్సిన డబ్బుని పాకిస్థాన్ నుండే తీసుకెళ్ళాడు అక్కడే సెటిల్ అయిపోయాడు. ఇమ్రాన్ ఖాన్ కి కూడా స్వంత విల్లాలు ఉన్నాయి లండన్ లో. పాకిస్థాన్ లో తనకి ఇక ప్రయోజనం ఉండదు అని తెలుసుకున్న మరుక్షణం లండన్ వెళ్ళిపోతాడు. బయటికి నవాజ్ షరీఫ్ లేదా అతని తమ్ముడు షాబాజ్ షరీఫ్ లు నిత్యం ఇమ్రాన్ ఖాన్ ని విమర్శిస్తారు కానీ నిజానికి షాబాజ్ షరీఫ్ ప్రధానిగా వచ్చింది ఇమ్రాన్ మీద ఉన్న కేసులని మాఫీ చేయడానికి తప్పితే దేశ ప్రయోజనాల కోసం కాదు. అందరూ దొంగలే !*

*****************************************

*పాకిస్థాన్ లో బయటి దేశాలనుండి వచ్చి పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ కల్పన చేసేవాళ్ళు ఎవరూ లేరు ఒక్క చైనా తప్పితే ! ఎందుకు ఇలా జరుగుతున్నది ? మత పరమయిన ఉగ్రవాదం ప్రధాన కారణం ! ఇక విదేశీ పెట్టుబడులు ఎలా వస్తాయి పాకిస్థాన్ కి ?ఎవరో ఫ్రాన్స్ లో అల్లా మీద కార్టూన్ వేశాడని పాకిస్థాన్ లోని ఫ్రాన్స్ రాయబారిని దేశం నుండి వెళ్ళగొట్టారు. ప్రపంచంలో ఒక్క పాకిస్థాన్ దేశంలోనే ముస్లిమ్స్ ఉన్నారా ? సౌదీ కానీ UAE  కానీ ఎందుకు స్పందించలేదు ?వాళ్ళకి లేని బాధ మన దేశానికి ఎందుకు ? పాకిస్థాన్ లో ఒక సెక్షన్ అధికారులు పాకిస్థాన్ ఆర్ధిక ఇబ్బందులకి భారత దేశమే కారణం అంటూ విష ప్రచారం చేస్తున్నాయి కానీ మన రాజకీయ నాయకత్వం బాగుంటే ఎందుకు ఇలా జరిగేది !1947 నుండి పాక్ రాజాకీయ నాయుకులు భారత్ ని బూచిగా చూపిస్తూ తమ అవినీతిని కొనసాగిస్తూ వచ్చారు అన్న సంగతిని ప్రజలు గుర్తిస్తే మేలు జరిగిఉండేది కానీ అలా జరగలేదు !*

*ఇప్పటికయినా మించిపోయింది లేదు ! భారత్ తో స్నేహం కలుపుకోండి మళ్ళీ ! కనీసం టమోటాలు,ఆలుగడ్డలు,గోధుమలు,మైదా పిండి, అత్యవసర మందులు మోడీజీ పంపిస్తారు ! ఇలా సాగింది Arzoo Kazmi అనే మహిళా జర్నలిస్ట్ విశ్లేషణ !*

*************************************

*పాకిస్థాన్ కి చెందిన పత్రిక ఎక్స్ప్రెస్స్ ట్రిబ్యూన్ కి వ్రాసిన వ్యాసంలో అక్కడి డిఫెన్స్ విశ్లేషకుడు అయిన షాహజాద్ చౌదరి మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న ప్రపంచంలో భారతదేశం పరపతి వేరుగా ఉంది. మోడీ నాయకత్వంలో భారదేశాన్ని అమెరికా కానీ రష్యా కానీ ఎదిరించే స్థితిలో లేవు. భారత్ లో ఇప్పటివరకు ఏ ప్రధాని చేయలేని పనిని మోడీజీ చేశారు,ఇంకా చేస్తున్నారు. పాకిస్థాన్ అనే దేశం భారత్ తో పోల్చుకొని విర్రవీగే స్థితి లేదు. పాకిస్థాన్ కి అందనంత ఎత్తులో ప్రస్తుతం భారత్ ఉన్నది. మోడీజీ లాగా పనిచేయగల రాజకీయ నాయకుడు పాకిస్థాన్ లో ఎవరూ లేరు.*

***************************************

*ఎవరో సలహా ఇచ్చారనో లేక స్వయంగా పాక్ ప్రధాని అడిగారనో మోడీజీ సహాయం చేస్తారా ?*

*అసలు దీనికి ముందు చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది !*

*పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో తాను ప్రధానిగా ఉన్న కాలంలో ఒక మాట అన్నది : పాకిస్థాన్ దేశం తినడానికి తిండి లేకపోయినా గడ్డి తిని అయినా బ్రతుకుతుంది కానీ అణ్వస్త్రాలు తయారుచేయడం మాత్రం ఆపము. మాకు అణ్వస్త్రాలు కావాల్సిందే ! ఆఫ్కోర్స్ సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడగలిగే ధైర్యం 1947 నుండి ఇప్పటివరకు ఏ ప్రధాని చేయలేదు.*

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

*కాబట్టి పాక్ ప్రధాని కాదు సహాయం ఆడగాల్సింది! పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు అడగాలి ! అప్పుడే ప్రధానే మోడీజీ ఆలోచించాలి సహాయం చేయాలా వద్దా అని ! భారత్ తో ద్వైపాక్షిక వాణిజ్యం మీద నిషేధం విధించింది ఎవరు ? ఇమ్రాన్ ఖాన్ పేరుకే అయినా ఆ పనిచేయించింది జెనెరల్ బజ్వ !*

********************************************************

*ఇంతకీ ఎవరు పాకిస్థాన్ కి సహాయం చేస్తారు ?*

*భారత్ ? పాకిస్థాన్ తనకి తాను బద్ధ శత్రువుగా భావించే భారత్ ఎలా సహాయం చేస్తుంది ?*

*ఇజ్రాయెల్ ? అసలు ఇజ్రాయెల్ అనే దేశమే లేదు పాకిస్థాన్ దృష్టిలో కాబట్టి కుదరదు.*

*ఫ్రాన్స్ ? చార్లీ హెబ్దో ఉదంతంలో ఫ్రాన్స్ జెండాని తగులబెట్టి రాయబారికి దేశ బహిష్కరణ చేసిన ఫ్రాన్స్ ని ఎలా సహాయం ఆడగగలదు ?*

*అమెరికా ? తమ దేశం మీద కుట్రలు పన్నుతున్నదని పాక్ ప్రజలకి విద్వేషం నూరి పోస్తున్నది అక్కడి ప్రభుత్వం అలాంటిది అమెరికాని ఎలా సహాయం ఆడగగలదు?*

*గల్ఫ్ దేశాలు ? సహాయం చేసి చేసి అలిసిపోయాయి. ఇక మా వల్ల కాదు అంటున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ అప్పు మాత్రం ఇవ్వము అంటున్నాయి !*

*IMF ? అప్పు ఇవ్వడానికి రెడీ కానీ షరతులు మాత్రం భారీగా ఉన్నాయి. ఇప్పటికే పెంచిన పన్నులు కాకుండా ఇంకా పెంచితేనే అప్పు ఇస్తానంటున్నది అదీ స్పెషల్ పర్పస్ వెహికల్ మీద మాత్రమే ! అంటే ఒక పనికి ఎంత ఖర్చు అయ్యింది ? ఖర్చుపెట్టింది వాస్తమేనా ? అని ప్రతిసారీ పరిశీలించి వాయిదాలలో ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.* *ఎందుకంటే దేని కోసం అయితే అప్పు తీసుకుంటున్నదో దాని కోసమే ఖర్చు చేయాలి అంతే కానీ పాత బాకీలు ఇతర దేశాలకి తీర్చడానికి మాత్రం అప్పు ఇవ్వను అంటున్నది కాబట్టి పాకిస్థాన్ కి ఇది నచ్చదు.*

*చైనా ? ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడులకి దిక్కు లేదు ఇక పెట్టుబడులు పెట్టను అప్పు ఇవ్వను అంటున్నది ఆల్ వెదర్ ఫ్రెండ్ !*

*టర్కీ ? ఇప్పటివరకు అప్పు ఇవ్వలేదు ! తానే FAFT బ్లాక్ లిస్ట్ లో ఉన్నది ! భారత్ కి వ్యతిరేకంగా పాకిస్థాన్ ని రెచ్చగొట్టడం లో మాత్రం తన వంతు సహాయం చేస్తూ వస్తున్నది. కాశ్మీర్ లో చొరబడి యుద్ధం చేయడానికి గాను తన వంతుగా కిరాయి సైనికులని పంపడానికి మాట ఇచ్చింది పాకిస్థాన్ కి.

*జై శ్రీ రామ్ జై భారత్ భారత్ మాతాకీ జై 

*Sri panjarla Mahendar Reddy*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...