Tuesday 10 January 2023

 భారతదేశం మన ప్రాచీన హైందవ దేశం

అసలు చరిత్ర

*వాళ్ళు,వీళ్ళు అన్ని ఇన్ని వందలేళ్ళు పాలించారు అంటూ "చరిత్ర" పాఠాలలో మొఘలులు,ఆంగ్లేయుల పాలన తప్ప వేరే లేదంటూ అందరూ షేరింగ్ చేసేసారు!🙋‍♂️*

*ఇపుడు "అసలు చరిత్ర

" క్లుప్తంగా తెలుసుకుందాం!*

*"మహాభారత యుద్ధం" తరువాత ధర్మరాజు అశ్వమేథ యాగం చేసి పాలన చేసిన కాలం నుండి "యుధిష్టర శకం" ఆరంభం అయింది . అప్పటికే "కలియుగం" ఆరంభం అవడం శ్రీకృష్ణ నిర్యాణం జరిగింది. ధర్మరాజు తరువాత "పరీక్షిత్తు" అతని కుమారుడు "జనమేజయుడు" ఇలా పాలన సాగింది. ఆ పిమ్మట వేయేండ్లు "బార్హద్రథ వాసం" మొత్తం ఇరువది రెండు మంది 1006 సంవత్సరాల కాలం పాలించారు. ఆ పిమ్మట "ప్రద్యోతన" వంశపు రాజులు అయిదుగురు దాదాపు 138 సంవత్సరాల పాలన చేసారు. ఆ తరువాత "శిశునాగులు" మొత్తం పదిమంది రాజులు 362 సంవత్సరాల కాలం పాలించారు. శిశునాగ వంశము తరువాత "నంద వంశము" పరిపాలించారు. వీరి పాలనాకాలం మొత్తం మొత్తం వంద సంవత్సరాలు. తొమ్మండుగురు రాజులు పరిపాలించారు. నంద వంశము తరువాత "మౌర్యులు" మొత్తం పండ్రెండు మంది రాజులు ౩౧౬ సంవత్సరాల కాలం పరిపాలించారు. మౌర్యుల కాలం తరువాత "పుష్యమిత్ర శుంగ" అశ్వమేథ యాగం చేసి ధర్మ సంరక్షణం చేసి వేద భారతిగా మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టాడు. శుంగవంశ రాజులు దాదాపు పది మంది మూడు వందల ఏళ్ళ పాలన సాగించారు. శుంగ వంశ రాజుల తరువాత "కాణ్వ వంశ" రాజులు నలుగురు దాదాపు ఎనుబది ఐదేండ్ల పాలన సాగించారు. కాణ్వ వంశ రాజుల తరువాత "ఆంధ్ర శాతవాహనులు" 506 సంవత్సరాలు మొత్తం ముప్పై రెండు మంది రాజులు పరిపాలించారు. శాతవాహన చక్రవర్తుల తరువాత "గుప్త రాజులు" మొత్తం ఎనిమిది మంది గుప్త చక్రవర్తుల 245 సంవత్సరాల పాలన సాగించారు.వీరి పాలనా కాలాన్నే "స్వర్ణ యుగం" అని మన పాఠ్య పుస్తకాలలో చదివియున్నాం కదా! గుప్తుల తరువాత అగ్నివంశపు రాజైన "విక్రమాదిత్య" శకం ఆరంభం అయింది . ఈతని రాజధాని ఉజ్జయిని. మరుగునపడిన అయోధ్య పట్టణాన్ని వెలికి తీసింది ఈ విక్రమాదిత్యుడే. ఈతని కాలములో మన దేశ పాలన అరబ్బు దేశాలలో,చైనా,ఇరాన్, ఇరాక్ వంటి ప్రాంతాలన్నింటా సాగింది...మీరు గమనిస్తే భారత్ ఓ ప్రాచీన దేశం. అది ఎంత? 900 సంవత్సరాల ముందు వరకు "అమెరికా" లేదు ... "కొలంబస్" తెలిపాడు ప్రపంచానికి! 2000 సంవత్సరాల ముందు వరకు "ఇజ్రాయిల్ "లేదు ... "ఏసు" అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి 5000 సంవత్సరాల ముందు వరకు "చైనా" లేదు .. మన "బోధి ధర్ముడు" తెలిపాడు ప్రపంచానికి 1400 సంవత్సరాల ముందు వరకు అసలు "ఇస్లాం" దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి. మరి భారత దేశం వయసు ఎంత?ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం యొక్క వయసు. ఇదీ నా భారత్ 🚩గొప్పతనం! ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన"ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే! వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు.😭 కేవలం " పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి విశ్వవిజేత "అలెగ్జాండర్ "భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే.✊ అతని "గ్రీకు దేశం" నేడు లేదు!😭 ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు!😭 ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు!😭 ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే..."నా దేశం-భారత దేశం🚩" ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి. మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది. చరిత్ర పుటల్లో నాటికి...నేటికి..."శాంతికి💖 నిలయ దేశం-నా భారత దేశం" ఈజీప్ట్ మీద పాలస్తీనా,అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది.😭నేడు ఇస్లాం దేశంగా మారింది రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు.😭 ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని? శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...😈ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం!? ఏమి పీక లేక పోయారు! ప్రపంచానికి మన "సంస్కృతి గొప్పతనం" తెలియజేయటం. ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే..."హైందవ దేశం-నా భారత దేశం" ప్రపంచానికి విజ్ఞానమ్ నేర్పించిన దేశం నా దేశం! మరీ "దేశభక్తుల" విషయం..1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి, బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా? 4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే!😭మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా?ఉండదు. ఎక్కడ ఉంటుంది? అంటే "Oxford Library"లో ఉంటుంది. ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి.😀ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి 🚩ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే😈నా ధర్మాన్ని🕉️నా దేశాన్ని🇮🇳విమర్శిస్తారు!*

*సైన్స్🩺*

*"మిరియాల" మీద పాశ్చాత్యులు పరిశోధన చేసి అందులో "కఫాన్ని" పోగెట్టే కెమికల్ ఏమి కనబడలేదు అని తేల్చారు. అయితే మిరియాలు తింటే "కఫం" పోతుంది అని, సైన్స్ ఇంకా అంత ఎదగలేదని నిజాయితీగా ఒప్పుకున్నారు. కళ్లముందు కనిపించినా నిరూపించలేక పోయిన సైన్స్..🙄 దీనిని పట్టుకొని ప్రమాణంగా భావిస్తున్నారు భౌతిక వాదులు..🙄 భారతీయ శాస్త్రం ఏది చెప్పినా దాని వెనుక కారణం శక్తి తప్పకుండా ఉంటాయి.. ఇలాంటి విద్యలను నేర్చుకోండి! ప్రపంచానికి మకుటాయమానంగా ఎదుగుతారు.  చదవి తెలుసుకొని నలుగురికి తెలియజేయండి. ఆసక్తి ఉన్నవారు అటుగా ప్రయత్నాలు చేస్తారు. విదేశీయులు😈ధ్వంసం చేసిన వాటిని పునర్నిర్మిద్దాం!✊*

🚩🕉️🚩

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...