స్వచ్ఛంద పేదరికం
అనగనగా ఓ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ నవలా రచయితయ్యాడు, అమ్మ పోయిన బాధలో యోగిగా మారాడు, అకస్మాత్తుగా సన్యాసం వీడి పారిశ్రామికవేత్తగా అవతరించాడు. ఓ స్టార్టప్ ని ప్రారంభించిన పద్దెనిమిదినెలల్లోనే దానికి 2240 కోట్ల రూపాయల విలువ కల్పించి... అనూహ్యంగా అమ్మేశాడు! అదికూడా జూమ్ మీటింగ్ లోనే, కొనేవారిని ముఖాముఖి కలవకుండా. ప్రస్తుతం అతని వయస్సు 42. చిన్న వయసులోనే ఇన్ని అవతారాలెత్తిన ఆ యువ యోగి-కమ్ -పారిశ్రామికవేత్త కరణ్ బజాజ్ ! చిత్రమైన అతని కెరీర్ ప్రయాణమే భారతీయ స్టార్టప్ రంగంలో గత ఏడాది హాట్ టాపిక్ . ఆ ప్రస్థానం గురించి కరణ్ మాటల్లోనే.


మా ఆవిడ కెరీ, నేనూ, మా ఇద్దరు పాపలు నీలా, రూమీ అందరం ముంబయిలోనే ఉంటున్నాం. మా ఆవిడ పిల్లల పోషకాహార నిపుణురాలు. తను లేకపోతే నా విజయాలే లేవని చెప్పడం అరిగిపోయిన రికార్డ్ లోని వాక్యంగా అనిపించొచ్చుకానీ... అది వందకు వెయ్యిశాతం నిజం. తనకే నా మీద నమ్మకం లేకుంటే ఇన్ని అపజయాల తర్వాత నిలదొక్కుకునేవాణ్ణి కాదు. బైజూస్ డీల్ తో సంస్థ ప్రొమోటర్ గా వెయ్యి కోట్లు వచ్చినా... ఒకప్పటి మా సన్యాస జీవితమే అలవాటై మేం సొంత ఆస్తులేవీ కొనలేదు. మాకు సొంతిల్లూ, కారూ లేవు. ఇప్పటికీ వీలున్నంత తక్కువ ఖర్చుతోనే నెట్టుకువస్తున్నాం. మా పిల్లలకీ ఈ ‘స్వచ్చంద పేదరికాన్ని’ నేర్పిస్తున్నాం!
No comments:
Post a Comment