Friday 26 November 2021

 యాదృచ్ఛికమా లేదా కుట్రా?

26/11 దాడుల సమయంలో భారతదేశ అంతర్గత భద్రతను స్తంభింపజేయడానికి పాకిస్తాన్ ప్రయత్నించిందా? భారత ప్రభుత్వాన్ని, మన గొప్ప ఇంటెలిజెన్స్ వ్యవస్థను పాక్ కావాలని తప్పు దారి పట్టించి భారత ఉన్నత అధికారులను అందుబాటులో లెకుండా చేసిందా?

చదవండి...
నవంబర్ 26, 2008న, పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సభ్యులు ముంబైలో బాంబు దాడులకు పాల్పడినప్పుడు భారతదేశం వరుస ఉగ్రవాద దాడులతో దద్దరిల్లింది. నాలుగు రోజుల పాటు కొనసాగిన దాడుల్లో తొమ్మిది మంది ముష్కరులతో సహా మొత్తం 175 మంది మరణించారు మరియు 300 మందికి పైగా గాయపడ్డారు.
దాడి చేసిన 10 మందిలో తొమ్మిది మంది చనిపోయారు మరియు అజ్మల్ కసబ్ మాత్రమే పోలీసులు సజీవంగా అరెస్టు చేసి అన్ని చట్టపరంగా నవంబర్ 21, 2012న పూణేలోని ఎరవాడ జైలులో రహస్యంగా ఉరితీయబడ్డాడు.
అయితే ఈ ఘోరమైన దాడులపై ప్రభుత్వం ఆలస్యంగా ప్రతిస్పందించడం పై చాలా మంది ప్రశ్నలు లేవనెత్తారు. 26/11 సంఘటన మీద నియమించిన నాటి ఉన్నత స్థాయి విచారణ కమిటీ (HLEC) కూడా చట్టాన్ని అమలు చేసే సంస్థలలో లోపాలను ఎత్తి చూపింది.
దాడులు జరిగిన వెంటనే ప్రభుత్వం ప్రతిస్పందించడంలో ఆలస్యమెందుకు అయింది?
దాడుల సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన తొమ్మిది మంది ఉన్నత స్థాయి అధికారుల సభ్యుల బృందం ఆ టైం లో పాకిస్థాన్‌లో ఉందని చాలామందికి తెలియదు. ఈ బృందంలో అప్పటి కేంద్ర హోం శాఖ కార్యదర్శి మధుకర్ గుప్తా నేతృత్వంలోని భారత హోం మంత్రిత్వ శాఖ మరియు ఇతర భద్రతా సంస్థల అధికారులు కూడా ఉన్నారు.
ఈ ఉన్నతాధికారుల బృందం నవంబర్ 24, 2008న అంటే బాంబు దాడులకు సరిగా 2 రోజులు ముందు ఇస్లామాబాద్‌కు చేరుకుంది. రెండు రోజుల తర్వాత, అంటే నవంబర్ 26న భారత్ తిరిగి రావాల్సి ఉంది. అయితే, పర్యటనను ఒక అదనపు రోజు పొడిగించారు.
దేనికోసం ? ఎక్కడికి?
ఇస్లామాబాద్‌కు ఈశాన్యంగా 60కిమీ దూరంలో ఉన్న హిల్ స్టేషన్ అయిన ముర్రేలో అదనపు రోజు బస ఏర్పాటు జరిగింది. ఆ ప్రదేశంలో బృందానికి కమ్యూనికేషన్ మార్గాలు అంటే టెలిఫోన్ కనెక్షన్లు కూడా లేవని నివేదికలు సూచించాయి.
కేంద్ర హోం కార్యదర్శి అంతర్గత భద్రత, అంతర్గత భద్రత డైరెక్టర్, అంతర్గత భద్రత సహా కీలక నిర్ణయాధికారులు బాంబు దాడులు సమయంలో ముర్రేలో ఉన్నట్లు తెలిసింది. భద్రత మరియు గోప్యత కారణాల వల్ల వారి హోదాలు మరియు గుర్తింపులు బహిర్గతం చేయబడలేదు.
ఆ బాంబు దాడులు సమయంలో మన అధికారులు పాకిస్థాన్ ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తున్నారనే ఆరోపణలను మాజీ హోం సెక్రటరీ మధుకర్ గుప్తా 2016లో తిరస్కరించారు. పాకిస్థాన్ తమ అంతర్గత మంత్రిని కలవాలని పట్టుబట్టిందని, అందుకే తమ బసను పొడిగించారని టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఆయన చెప్పారు.
" మేము రెండు రోజులుగా ఇస్లామాబాద్‌లో ఉంటున్నప్పటికీ, ఆతిథ్య దేశం మమ్మల్ని ముర్రేలోని సమీపంలోని హిల్ రిసార్ట్‌కు తరలించడానికి ప్రత్యేక ప్రణాళికలు వేసింది. వెనక్కి తరచి చూస్తే, భారతీయుల ప్రతిస్పందనను ఆలస్యం చేయడం లేదా బలహీనపరచడం అసలు ఉద్దేశమా అనే అనుమానాన్ని ఇప్పుడు మాకు కలగచేస్తోంది " అని ఈ మాజీ బ్యూరోక్రాట్ 2016లో టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పారు.
అయితే, ముర్రేలో టెలివిజన్ సిగ్నల్ లేదనే వార్తలను మధుకర్ గుప్తా తోసిపుచ్చారు, ఎందుకంటే దాడుల గురించి భారతదేశం నుండి తనకు కాల్ వచ్చిందని, వెంటనే టీవీని ఆన్ చేసి చూసి భారతదేశంలోని సీనియర్ నాయకత్వాన్ని సంప్రదించానని చెప్పాడు.
ఇక్కడ చాలా ప్రశ్నలకు సమాధానాలు లేవు.
1. పర్యటన ఎందుకు పొడిగించబడింది?
2. బృందాన్ని హిల్ స్టేషన్‌కి ఎందుకు మార్చారు?
3. పాకిస్థాన్ ప్రభుత్వ అధికారులకు దాడుల గురించి ముందే తెలుసా?
4. ఇది కుట్ర లేదా యాదృచ్చికమా?
ఆ రోజు దాడులు అప్పుడు తుకారాం ఒంబ్లే అనే సాధారణ పోలీసు ఆఫీసర్ AK 47 పట్టుకున్న కసబ్ ని తన ఒంట్లో గుళ్ళు దిగుతున్నా వదలకుండా సజీవంగా పట్టుకోవడం వల్లే హిందూ సంస్థల పేరుకు హాని జరగకుండా ఉంది.
లేకపోతే...
ఆ కసబ్ చేతికి కషాయి తాడు, జేబులో హిందూ చౌదరీ పేరుతో ఐడెంటిటీ కార్డుతో కసబ్ శవం దొరికి వుంటే ఆ బాంబు దాడులు హిందూ సంస్థల పనే అని ప్రచారం చేసి RSS సంస్థను, మిగిలిన హిందూ సంస్థలను శాశ్వతంగా బాన్ చేసి వుండేవారు UPA నాయక ప్రభుద్దులు.
అందుకే హిందువులూ, హిందూ సంస్థలు కీ.శే తుకారాం ఓంబ్లే కి ఎప్పటికీ రుణపడి ఉండాలి.

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...