Wednesday 9 June 2021

 వాక్సిన్ పొలిటిక్స్ !పార్ట్ - 1. మోడీ అంటే గిట్టని వాళ్ళు బర్నాల్ దగ్గర పెట్టుకొని చదవండి.

ముందు దేశవ్యాప్త లాక్ డౌన్ కేంద్రం నిర్ణయించడం ఏమిటీ? ఆ అధికారం రాష్ట్రాలకి ఇవ్వవచ్చు కదా ? అంటూ బిజేపి యేఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు గొంతు చించుకున్నారు ఒక్క ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తప్ప. మొదటి దశ లాక్ డౌన్ ప్రశాంతంగా జరిగిపోయింది. రెండవదశ కి వచ్చేసరికి ఆయా ముఖ్యమంత్రులకే ఆ నిర్ణయం ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. మహారాష్ట్ర అయితే చాలా హీనంగా ప్రవర్తించింది కోవిడ్ ని నీయంత్రించడంలో. ఇప్పటికీ సంవత్సరం నుండి కొన్ని ముఖ్యమార్గాలలో రైళ్లు నడవడం లేదు మహారాష్ట్ర లో.
కేంద్రం ఇచ్చిన ఉచిత వాక్సిన్ల ని ఉపయోగించుకోవడంలో చాలా రాష్ట్రాలు విఫలం అయ్యాయి. దాపుగా 40 లక్షల వాక్సిన్ డోసులు వృధా చేశాయి. లాక్ డౌన్ విషయం లో కేంద్రాన్ని విమర్శించిన రాష్ట్రాలు వాక్సిన్ కొనుగోలు కోసం కూడా తమకే అధికారాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాయి. కేంద్రం అనుమతి ఇచ్చింది రెండు నెలల క్రితం. ఇక అక్కడనుండి రాజకీయాలు మొదలయ్యాయి. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు గ్లోబల్ టెండర్ల పేరుతో ప్రకటనలు ఇచ్చేశారు. నెల రోజులు గడిచినా ఏ రాష్ట్రమూ వాక్సిన్ కోసం ఆర్డర్ ఇవ్వలేక పోయాయి. ఇక లాభం లేదని కేంద్రమే వాక్సిన్లని కొనుగోలు చేసి రాష్ట్రాలకి ఇవ్వాలని కొత్త డిమాండ్ చేస్తున్నాయి.
అసలేం జరిగింది ?
మొదటి నుండి మన దేశం లో తయారయిన కొవీషీల్డ్,కోవాక్సిన్ మీద దుష్ప్రచారం జరిగినది. అదే సమయంలో లెఫ్ట్ మెతావుల తో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా విదేశాలనుండి వాక్సిన్ కొనడానికే ఆసక్తి చూపించాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అయితే ఫైజర్ / మోడెర్న మీద అభిమానంతో ఉంది. గ్లోబల్ టెండర్లు పిలిచినా ఏ విదేశీ వాక్సిన్ తయారీదారులు కూడా ఆసక్తి కనపరచలేదు.
అసలు విదేశీ వాక్సిన్ తయారు చేసే ఫార్మా కంపనీలు ఏవీ కూడా నేరుగా రాష్ట్రాలతో ఒప్పందం చేసుకోవడానికి ఇష్టపడలేదు. కారణం ? ఉత్తర ప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్ర జనాభా 22 కోట్లు షుమారుగా అలాంటిది ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల జనాభా 7-8 కోట్లు ఉంటుంది. ఫార్మా కంపనీలకి ఇలా వీడి విడిగా చిన్న మొత్తంలో సరఫరా చేయడానికి సిద్ధంగా లేవు ఎందుకంటే వాటికి ఇలా ఇవ్వడం వలన లాభం ఉండదు పైగా ఇచ్చిన ఆర్డర్ కి ముందే మొత్తం డబ్బు ఇచ్చేయాలి అని అనుకుంటే పిచ్చితనమే ! ఫైజర్ చాలా స్మార్ట్ గా వ్యవహరించింది. ఏకంగా కేంద్ర ప్రభుత్వం తో మాత్రమే డీల్ చేస్తామని చెప్పి చాలా తెలివిగా ఇరుకున పట్టడానికి చూసింది.
కాంగ్రెస్ ప్రచారం చేసిన ఫైజర్ / మోడర్న వాక్సిన్ అయితే ఎలాంటి షరతులు పెట్టిందో ఒక సారి చూద్దాం.
ఫైజర్ [Pfizer] $ 42 ఫుల్ కోర్స్ కి చార్జ్ చేస్తున్నది అంటే 2 డోసులకి. $ 21 సింగిల్ డోస్ కి. అదే భారత్ దేశానికి అయితే $ 29.40 రెండు డోసులకి కలిపి ఆఫర్ చేసింది. అంటే INR 2205 కి రెండు డోసులకి ఖర్చు అవుతుంది అన్నమాట.
ఫైజర్ మినిమం ఆర్డర్ 200 మిలియన్లు[20 కోట్లు ] ఆర్డర్ ఇవ్వాలి అని షరతు పెట్టింది అంతే కాక మొత్తం డబ్బు ముందే ఇచ్చేయాలి అంటే Rs. 44,500 కోట్లు ముందే ఇవ్వాలి. ఇదీ ఫైజర్ పెట్టిన షరతు. ఇక రాష్ట్రాలు ఎలా ఆర్డర్ ఇవ్వగలుతాయి ? అదే ఇదే డబ్బుతో మన దేశంలో తయారు అయ్యే వాక్సిన్ల కి అయితే 140 కోట్ల డోసులు కొనవచ్చు అది కోవాక్సిన్ కానీ కొవీషీల్డ్ కానీ. ఫైజర్ చాలా స్మార్ట్ గా వ్యవహరించింది. కుటుంబ పార్టీ కి మేలు చేసేటందుకె ఇదంతా
మేమే కొనుక్కుటాము అని అడిగిన రాష్ట్రాలకి ఈ విషయం తెలుసుకొని నోరు మూసుకుకూర్చున్నాయి.
ఫైజర్ వాక్సిన్ ని -80 డిగ్రీల దగ్గర నిల్వ చేయాలి. ఇది అస్సలు సాధ్యం కాదు. ఎందుకంటే మన దేశంలో ఇలాంటి ఫ్రీజర్లు లేవు. ఉన్నది ఒక్క బయోలాజికల్ లాబరేటరీ లో అదీ -36 డిగ్రీల వరకే చల్లబరుస్తుంది.
ఫైజర్ వాక్సిన్ కొని వాటికి ప్రజలకి ఇవ్వాలంటే మరో 44,000 కోట్లు పెట్టి జర్మనీ,జపాన్,అమెరికా ల నుండి కనీసం 20,000 ఫ్రీజర్లు దిగుమతి చేసుకోవాలి వాటిని ప్రజలకి ఎక్కడయితే వాక్సిన్ ఇస్తారో అక్కడికి వాక్సిన్లు అందులో పెట్టి వాటిని రవాణా చేయాలి దేశం నలుమూలలకి. పైగా తోడుగా జెనరేటర్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏ మాత్రం టెంపరేచర్ లో తేడా వచ్చినా వాక్సిన్ పని చేయకపోగా వికటిస్తుంది.
కాంగ్రెస్ ఫైజర్ ని భుజాలకి ఎత్తుకొని మన వాక్సిన్ల ని కింద పడేయడం వెనుక ఇంత ఖర్చు,ప్రయాస ఉంటుంది అని తెలిసే దుష్ప్రచారం చేసింది వాటిని కొన్ని రాష్ట్రాలు నమ్మాయి టెండర్లు పిలవడానికి సిద్ధపడ్డాయి కానీ అసలు విషయం తెలుసుకొని కిక్కురుమనకుండా మళ్ళీ కేంద్రమే ఇవ్వాలి అంటూ కొత్త పల్లవి అందుకున్నాయి.
ఇంతకీ ఈ కుటుంబ పార్టీకి ఫైజర్ మీద ఎందుకంత ప్రేమ ? క్రోనాలజీ ఆఫ్ థర్డ్ వేవ్ !ఫార్మా లాబీ ని లీడ్ చేస్తున్నది ఫైజర్. మన దేశంలో ఉన్న డయాబిటిక్ పేషంట్స్ డాటా కనుక బయటికి పొక్కితే ఈ సారి డయాబెటిక్ పేషంట్ల కి వైరస్ సోకుతుంది .. వాహ్ ! అంటే డాటా లీక్ అయ్యేకొద్దీ ఆయా రోగులకి వైరస్ సోకుతూ ఉంటుంది అన్నమాట ! సినిస్టర్ ప్లాన్ ఆఫ్ ఫైజర్. అసలు ఏ మాత్రం జెనెరల్ నాలెడ్జ్ లేని రాజస్థాన్ ముఖ్యమంత్రి థర్డ్ వేవ్ చిన్న పిల్లలకి వస్తుంది అని ప్రకటన చేశాడు. ఖాంగ్రెస్ క్రోనీ మహమ్మద్ క్రేజీ వాల్ సింగపూర్ వేరియంట్ చాలా ప్రమాదం అని ప్రకటనచేశాడు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నవే. అంటే ఏమిటి ? మొదటి వేవ్ వృద్ధులకి,రెండవ వేవ్ యువకులకి,మూడవ వేవ్ చిన్న పిల్లలకి అనే వదంతులు వ్యాపింపచేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఫైజర్ - మోడర్న లు తమ దగ్గర చిన్న పిల్లలకి వేసే వాక్సిన్లు స్టాక్ ఉన్నాయి అంటూ ప్రకటన చేసింది. ఎవరు ఈ మెడికల్ డాటా ని లీక్ చేశారు ఫైజర్ కి ? అంత పెద్ద మొత్తంలో వాక్సిన్ స్టాక్ ఉంటే ముందు అమెరికా లోనే ఇప్పటికే అందరికీ వాక్సిన్ వేసి ఉండాలి కదా ? మూడో వేవ్ చిన్నపిల్లలకి అనే పుకారు పారకపోతే ఈ సారి డాయబిటెక్ పేషంట్స్ ని టార్గెట్ చేసుందన్నమాట ! బయో వార్ కొనసాగుతూ ఉంటుంది 2024 ఎన్నికల వరకు. వదంతులు సృష్టించే వారికి ఫైజర్ కి చాలా పటిష్టమయిన బంధం ఉంది. మన దేశ రోగులకి సంబంధించి మెడికల్ డాటా మొత్తం ఇప్పుడు ఫైజర్ చేతిలో ఉంది. ఒక్కో సారి ఒక్కో రకం రోగం ఉన్న పేషంట్లకి కొత్త వేరియంట్ వైరస్ సోకుతూ ఉంటుంది అన్నమాట.
ఇవాళ కాకపోతే రేపో లేదా మరో రెండు సంవత్సరాల తరువాత అయినా చైనా వైరస్ అనేది లాబ్ లో సృష్టించిన కృత్రిమ వైరస్ అని మొదటి సారి ఒక వయస్సు వాళ్ళకి , రెండో సారి ఇంకో వయస్సు వాళ్ళకి , మూడో సారి చిన్న పిల్లలకి లేదా షుగర్ పేషంట్స్ కి సోకే విధంగా మార్పు అవగల వైరస్ సృష్టించారు అని. ఇది ఏళ్ల తరబడి పరిశోధన చేస్తే కానీ అవని పని. ఈ పాపంలో చైనా,అమెరికా, కెనడా లకి పాత్ర ఉంది అనేది నిజం.

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...