Wednesday 16 November 2022

 వీణం వీరయ్య విగ్రహా లను నెలకొల్పు కోవాలి. కాటన్ దొర విగ్రహాలు ప్రక్కన

కాటన్ దొర అంటున్నామే గానీ ఆయనకు సహ కరించిన తొలి తెలుగు ఇంజనీర్ వీణం వీరన్న గారిని విస్మరిస్తే ఎలా. (కొన్ని విషయా లను గూగుల్ నుండి సేకరించాను.)
ఈ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ చదవాల్సిన, తెలుసు కోవాల్సిన విషయం ఇది.మన గోదావరి జిల్లాల ప్రాంతాలు ఈరోజు సస్య శ్యామ లంగా ఉన్నా యంటే దానికి ధవళే శ్వరం దగ్గర ఆనకట్ట నిర్మాణం కారణం ఎవరు అంటే మనం టక్కున శ్రీ సర్‌ ఆర్థర్‌ కాటన్‌ కాటన్ దొర గారు అని తడుము కోకుండా చెప్పేస్తాం. ఈ గోదావరి జిల్లాలను అన్నపూర్ణ లా మార్చిన కాటన్‌ దొర గారికి వెన్నె ముక లా నిలిచిన ఇంజినీరు ఎవరు అంటే దాదాపు చాలా మందికి తెలియదు.చరిత్ర చీకట్లలో కలసి పోయిన ఆయన పేరే శ్రీ వీణం వీరన్న గారు. ఎక్కడో బ్రిటిష్ వారు అయిన కాటన్ దొరకు తనది కాని ప్రాంతంలో, తన భాష కాని వాళ్లతో అంత పెద్ద నిర్మాణ పనిని తల కెత్తు కున్న ఆయనకు తలలో నాలుక లా నిలిచారు వీరన్న గారు. కాటన్‌ దొర గారికి వీరన్న గారు సాయం రాకపోతే ధవళేశ్వరం ఆనకట్ట ఎప్పటికి పూర్తయ్యేదో అన్నది ప్రశ్నర్ధకం.
శ్రీ వీణం వీరన్న గారు వీరరాఘ వమ్మ, కొల్లయ్య దంపతులకు 1794, మార్చి 3న జన్మించారు. తండ్రి కొల్లయ్య మచిలీ పట్టణం లో బ్రిటిష్‌ ప్రభుత్వ కార్యా లయం లో ఉద్యోగిగా చేసే వారు. దాంతో వీరన్న గారిని తల్లితో పాటు రాజమండ్రిలో బంధువుల ఇంట్లో విడిచి ఉండే వారు. అలా వీరన్న గారి ప్రాథ మిక విద్యను రాజమండ్రిలో పూర్తి చేసు కున్నారు. ధవళేశ్వ రానికి చెందిన శ్రీమతి వెంకాయ మ్మ గారితో వీరన్న గారికి వివాహ మైంది. వారికి వెంకట రత్నం, జనార్దన స్వామి, కొల్లయ్య, సీతారామస్వామి, బాపమ్మలు ఐదు గురు సంతానం. మచిలీ పట్టణం ఆంగ్లోఇండియన్‌ కళాశాలలో ఉన్నత విద్యను పూర్తిచేసిన వీరన్న గారు, తన తండ్రి సూచన మేరకు ఇంజినీరింగ్‌ చదివేందుకు బెంగాల్‌ వెళ్లారు. అప్పుడు ఆంగ్లేయుల ప్రధాన పాలన కేంద్రం కలకత్తా. ఇంజి నీరుగా ఆయన శిక్షణ మాత్రం మద్రాసులో సాగింది. 1840 నాటికి రాజమండ్రి వచ్చి నీటి పారుదల శాఖలో ఉద్యోగ జీవితం మొదలు పెట్టారు. ఆ సమయం లోనే 1844లో గోదావరి పరీవాహక ప్రాంతాన్ని పరిశీ లించ డానికి వచ్చిన శ్రీ ఆర్థర్‌ కాటన్‌ గారితో వీరన్న గారికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి కాటన్‌ దొరకు సహాయకుడిగా వీరన్న కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కాటన్‌ దొర నివాస వ్యవహా రాలు, నౌకర్లు, ఆరోగ్య, ఆహార విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసు కోవడం లాంటి వి వీరన్న గారే చూసు కునే వారు. తనకంటే వయసులో పెద్ద వాడైన వీరన్న గారిని కాటన్‌ దొర సోదర సమాను డిగా గౌర వించే వారు.ప్రయాణ సౌకర్యాలు అంతగా లేని ఆ కాలంలో,కాటన్‌ దొరతో పాటు గోదావరి తీరం వెంబడి కాలి నడకన, గుర్రాల మీద వెళ్తూ ఆనకట్ట నిర్మాణ పనులను వీరన్న గారు పర్య వేక్షించారు. రాజమండ్రి నుంచి అటు గోదావరి పుట్టే త్య్రంబకం, ఇటు సముద్రంలో కలిసే వరకు దాదాపు 1500 కిలోమీటర్ల ఎగువ దిగువ పరివాహక ప్రాంతాల్లో కాటన్‌ దొరతో విస్తృతంగా పర్యటించారు. ఆ సమయంలో వీరన్న గారు ఆయన వెన్నంటి ఉన్నారు. భోజన సదుపాయాలు లేని మార్గాల్లో నెలల తరబడి ప్రయాణించిన వారిద్దరూ అరటి, మామిడి, జామపండ్లు తింటూ, గోదావరి నీళ్లు తాగుతూ ముందుకు సాగి పోయే వారు.ఆనకట్ట నిర్మాణం సమయానికి తూర్పు- పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు కలిసి రాజమండ్రి జిల్లాగా ఉండేవి. బ్రిటిష్‌ కాలంలో దేశాన్ని ఎన్నో కరవులు పీడించాయి. ఓ వైపు గోదావరి, కృష్ణా నదుల నీళ్లు వృథాగా సముద్రంలో కలిసేవి. మరోవైపు ప్రజలు కరవుల బారిన పడి తీవ్ర ఇక్కట్ల పాలయ్యే వాళ్లు.దానితో ఈ నదుల నీళ్లను వ్యవసాయ అవసరా లకు విని యోగించు కునేలా చేయాలని సంక ల్పించింది ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం. ఈ పనిని కాటన్‌ దొర గారిని నియ మించింది. దీని కోసం ప్రణాళిక సిద్ధం చేసుకుని కాటన్‌ గారితో కలిసి వీరన్న గారు మారు మూల ప్రాంతాల్లో సంచరిస్తూ ఆయా ప్రాంతాల రైతులను చైతన్య పరిచారు.ఆనకట్ట పనులు ప్రారంభమైన తొలినాళ్లలో గోదావరి జిల్లాల నుంచి పని చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దానితో ఒడిశా, బెంగాల్‌ ల నుంచి వందల మందిని ధవళేశ్వ రానికి రప్పించారు. వీరన్న గారు వాళ్లకు కావాల్సిన శిక్షణ ఇస్తూ రోజు వారీగా చెల్లించే కూలీ డబ్బుల్ని నిక్కచ్చిగా ఇచ్చే వారు. ఇది గ్రహించిన గోదావరి ప్రజలే కాకుండా కృష్ణా, గుంటూరు శ్రామికులు కూడా తమంత తాముగా ఆనకట్ట నిర్మాణానికి ముందుకు వచ్చారు. వీరన్న గారు తన కుటుంబానికి ఉన్న పలుకు బడి పరిచయా లతో మన్య ప్రాంతం కోయ వారిని కూడా ఆనకట్ట పను లకు కూడ గట్టారు.పనికి కొత్త యిన వాళ్లకు తగిన శిక్షణ ఇప్పించారు. కూలీలను ఉత్సాహ పరి చేందుకు, పని చేయని ఆదివారం కూలి సొమ్మును కూడా శనివారం సాయంత్రమే ఇచ్చేవాళ్లు. ఇది కూలీల్లో ఆనకట్ట నిర్మాణ అధికారు లంటే విశ్వాసం పెరిగేలా చేసింది. వీరన్న గారు శ్రామికుల కోసం గోదావరి తీరాన నివాసాలు ఏర్పాటు చేసి వాళ్ల ఆరోగ్య రక్షణకు తగిన జాగ్రత్తలు తీసు కున్నారు. మొత్తానికి 1851 నాటికి పదివేల మందికి పైగా శ్రామికులను సమకూర్చి ఈ మహాయజ్ఞం పూర్తయ్యేలా చేశా రాయన.1848, 1851 లలో ప్రభుత్వం నుంచి సొమ్ము రావటం ఆలస్య మైనా పనులు ఆగకుండా శ్రామికులను వీరన్న గారు ఉత్తేజ పరిచారు. వారికి కూలీ సొమ్ము చెల్లించి అటు అధికారులు, ఇటు శ్రామికులు ఒకరికొకరు సహ కరించు కునేలా చేశారు. అప్పట్లో గోదావరి తీరపు జమీందారుల్లో కొంతమంది అభివృద్ధి వ్యతి రేకులు ఉండేవాళ్లు. దానికి తోడు ఆనకట్ట నిర్మాణానికి కంకణ బద్ధులైన కాటన్ దొర, వీరన్న గారి పట్ల ఆంగ్లేయ ( బ్రిటిష్ ) అధికారులకు అసూయ ఏర్పడింది. దాంతో వాళ్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసేవాళ్లు. వీటివల్ల ఒకానొక సందర్భంలో ఆనకట్ట నిర్మాణం ఆగిపోయిందనే వదంతులు కూడా వచ్చాయి. అలాంటి సమయం లోనూ వీరన్న గారు, కాటన్‌ దొరల మీద ఉన్న గౌరవం, విశ్వాసం శ్రామికులతో ఏ ఆటంకాలు లేకుండా పని చేయించింది. ఇదంతా గమ నించిన ప్రభుత్వం తన అభి ప్రాయాన్ని మార్చుకుని ఆనకట్ట నిర్మాణానికి కావాల్సిన డబ్బు, ముడి సరకు లను ఎప్పట్లా సరఫరా చేసింది. చివరికి 1852 మార్చి 31 నాటికి పని పూర్తయింది. ఆనకట్ట పూర్త య్యాకే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పేర్లు వాడుక లోకి వచ్చాయి.వీరన్న గారి సహకారం, కృషి, పట్టుదల, నిజాయతీ, అంకిత భావం కారణం గానే తన కల నెర వేరిందని గ్రహించిన కాటన్‌ దొర ఆంగ్లంలో స్వదస్తూరితో శ్రీ వీణెం వీరన్న అనే హైందవ పురుషోత్తముడు నాకులభించ కుండా ఉండి ఉంటే, నేను అనుకున్నట్లుగా ఇంతవేగంగా గోదావరి ఆన కట్టను పూర్తి చేయ లేక పోయే వాణ్ని అని రాసు కున్నారు. ఇంతే కాకుండా వీరన్న గారి శ్రమకు ప్రతి ఫలంగా, ఆయనకు ఇంకా ఏదైనా మేలు చేయాల్సిందిగా ఈస్టిండియా కంపెనీని, విక్టోరియా మహారాణిని అభ్య ర్థించారు. దాని ఫలితంగా కంపెనీ ఆనకట్టకు సమీపంలో ఉన్న మెర్నిపాడు గ్రామశిస్తును (ఆ రోజుల్లో రూ.500కు పైగా) వీరన్నకు శాశ్వతంగా దఖలు పరిచింది. అంతేకాదు ఆయనకు రాయ బహు దూర్‌ బిరుదు నిచ్చి సత్కరించింది.ఆనకట్ట నిర్మాణ సమయంలో అనేక పర్యాయా లు కాటన్‌ దొర అస్వస్థతకు గురయ్యారు. ఆస్ట్రేలియా, లండన్‌లకు నెలల తరబడి వెళ్లేవారు. అయినా వీరన్న గారు కూలీలను సమన్వయ పరుస్తూ నిర్మాణ పనులు సమర్థంగా నిర్వహించారు. నిర్మాణ సమయం లోనూ, అనంతరం కురిసిన వర్షాల కారణంగా గోదావరికి వరదలు వచ్చి, చిన్నాపెద్ద ప్రమాదాలు వచ్చి పడినా సకాలంలో ప్రభుత్వం ఆనకట్టకు తగిన మరమ్మతులు చేపట్టేలా చేశా రాయన.1852లో ఆనకట్ట నిర్మాణం పూర్తయిన నాటి నుంచి 1867లో మరణించే వరకు ధవళేశ్వరం హెడ్‌లాక్‌ క్వార్టర్సే వీరన్న గారి చిరు నామాగా ఉంది. ఆయన కోరిక మేరకు నేటి ధవళేశ్వరం హెడ్‌ లాక్‌ ప్రాంతం లోనే ఆయన పార్థివ దేహానికి దహన సంస్కా రాలు జరిపి అస్తికలను గోదా వరి లో నిమజ్జనం చేశారు. అంతే కాదు ఆయనను దహనం చేసిన ప్రాంతంలో ఉన్న రాతి గోడ మీద వీరన్న గారి పేరును ఆంగ్లంలో వి.వీరన్న , రాయ్‌బహుదూర్, సబ్‌ఇంజినీర్, 1867 అని చెక్కించారు అప్పటి ఆనకట్ట ఉద్యోగులు. ఇప్పుడు ఆ ప్రదేశం పిచ్చి మొక్కలతో నిండి పోయింది.1940లో బులుసు సాంబ మూర్తి కాటన్‌ దొర విగ్రహం దగ్గరే వీరన్న గారి వివరాలు తెలిపే శిలాఫలకాన్ని చెక్కించారు.1986లో వచ్చిన వరదలో కాటన్‌ దొర విగ్ర హంతో పాటు ఈ శిలాఫలకం కూడా కొట్టుకు పోయింది. 1988లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారి ప్రోద్బలంతో ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర నిర్మించిన కాటన్‌ మ్యూజియం లో వీరన్న గారి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడది మసక బారి పోయింది. తన కెంతో సాయ మందించిన వీరన్న గారిని కాటన్‌ దొర మరచి పోలేదు. కానీ మనం మర్చి పోయాం.ఇలాంటి మహాను భావుల గురించిచెప్పు కోవడం ఎంతో అదృష్టం. అయితే భావి తరాలకు ఇలాంటి గొప్ప వారి గురించి తెలిసేలా ప్రభుత్వాలు ఆయన విగ్రహాన్ని ఏర్పరిచి,ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి.అన్నం పెట్టిన మనిషిని గౌరవించడ మంటే,మనల్ని మనం గౌర వించు కోవడమే కదండి

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...