Friday 24 July 2020

జై భవానీ...ఒకే ఒక్కపిలుపు కోసం భారత నావికాదళం ఎదురుచూసిన క్షణం..

జూలై 4 రాత్రి.. 5 ఉదయం న భారత్ లో ఏం జరిగింది..
సమస్త భారత ప్రజానీకమూ గుండెలమీద చెయ్యి వేసుకొని నిద్రిస్తున్న వేళ దేశానికి ప్రధాన కాపలాదారు మోడీజీ ఎందుకు నిద్రలేని రాత్రి గడిపారు??..ఎందుకు ట్రంప్.. ఎమ్మాన్యుల్ మార్కొన్..షింజే అబే ..నేతన్యహు లు హాట్ లైన్లో 6 గంటలపాటు ఎంగేజ్ లో ఉన్నారు??
లడఖ్ నుండి చైనా ఎందుకు వైదొలిగింది?..
నిజానికి మోడీ జీ పెద్ద యుద్ధాన్ని వాయిదా వేశారు.. పాకిస్తాన్..మనం సెమీ మిత్రదేశం గా భావించే ఇరాన్ మరియు చైనాలు భారత్ మీద అతిపెద్ద యుద్ధానికి పూర్తిస్థాయిలో  సన్నాహాలు చేశాయి - మొత్తం కుట్ర వివరాలు!!..

జూలై 5 నాడు చైనా, పాకిస్తాన్, ఇరాన్ సంకీర్ణం భారతదేశంపై దాడి చేయడానికి పూర్తి సన్నాహాలు చేసుకున్నాయి.

3 రౌడీ రాజ్యాలూ ఏకకాలంలో దాడి చేసే వ్యూహం పన్నాయి దాని  ప్రకారం ముందుగా పాకిస్తాన్ సైన్యం కాశ్మీర్‌పై దాడి చేయాల్సి ఉందని నిర్ణయించారు.

పాక్ సైన్యానికి సహాయం చేయడానికి చైనా సైనికులు పాకిస్తాన్‌కు చేరుకున్నారు.
కానీ ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (రా) మరియు సిఐఎ మరియు మన ఆత్మబందువు ఇజ్రాయెల్ మొసాద్ లకు  ఈ దాడి గురించి పూర్తి వివరాలు ఏజెంట్లు అందచేశారు..వెంటనే కేంద్రంలోని జాతీయవాద ప్రభుత్వం అప్రమత్తం అయింది..
భారత సైన్యం యుద్ధానికి  పూర్తిగా సిద్ధం అయింది..
వెంటనే ఏరోజైతే దాడికి 3 దేశాలూ ముహూర్తం పెట్టుకున్నాయో ఆ 5వ తారీఖునే రక్షణ రంగా నిపుణులూ..వ్యక్తిగత వైద్యులూ ఆరోగ్యరీత్యా అంత ఎత్తైన ప్రదేశానికి వెళ్లకూడదు అని వారిస్తున్నా ప్రధాని మోడీజీ  లడఖ్ చేరుకుని  సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చి మానసికంగా వారికి కొండంతబలాన్ని ఇచ్చి అదేసమయంలో  చైనాను కూడా బెదిరించారు.. నేరుగా షాంగై..బీజింగ్ వంటి ప్రధాన నగరాలపైకి అణ్వాయుధాలు అమర్చిన మిస్సైల్స్ గురిపెట్టబడ్డాయి..

ఇక మొస్సాడ్ రంగంలోకి దిగింది.. భారత్ మీద దాడి జరగకముందే, ఇజ్రాయెల్ జూలై 5 తెల్లవారుజామున ఇరాన్‌ అణ్వాయుధ కేంద్రంపై దాడి చేసి  ఇరాన్‌ ఎప్పటినుంచో కాపాడుకుంటూ వస్తున్న అణ్వాయుధాలను  అన్నింటినీ నాశనం చేసింది.
అవసరంలో అక్కరకు వచ్చింది ఇండో ఇజ్రాయెల్ స్నేహం..మోడీ దౌత్యం..నేతన్యహు కు భారత్ మీద ఉన్న ప్రేమ వల్ల మొస్సాడ్ ఈ భయంకరమైన దాడి చేసింది. ఆఖరకు ఎక్కడో ఇజ్రాయెల్ ఇతర డిఫెన్స్ వర్గాల్లో తప్ప ఈ వార్తను సైతం రాకుండా కట్టడి చేయగలిగారు..
థాంక్స్ టు ఇజ్రాయెల్..
మరోవైపు, భారత జలాంతర్గాములు అణ్వాయుధాలతో  కరాచీకి అతి సమీపంలోకి చొచ్చుకువెళ్లి మోర్స్ కోడ్ కోసం నిరీక్షిస్తున్నారు..పాక్ వేయబోయే ఒక్క తప్పటడుగు పాకిస్తాన్ ను పాతరాతియుగం లోకి పంపడానికి శత్రుభయంకరులైన భారత నావికాదళం సిద్ధమైంది.. ఉప్పందుకున్న పాక్ మిలిటరీ అధికారులు కాశ్మీర్‌పై దాడి చేయడానికి నిరాకరించారు ఒకవేళ  దాడి అంటూ  చేస్తే  భారత్ ఒకేసారి అనేక వైపుల నుండి దాడి చేయడానికి సిద్ధంగా ఉందని ఐ‌ఎస్‌ఐ  పాకిస్తాన్‌కు తెలియజేసింది, ఇది పాకిస్తాన్ అంచనా వేయలేదు..
మోడీ జీ అప్పటికే సూపర్ పవర్స్‌ తన దౌత్యనీతితో ..భారత్ మీద వారికున్న నమ్మకంతో ఏకంచేసి భారత్ కు మద్దతుగా తీసుకురాగలిగారు.. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, రష్యా అందరూ మోడీ జీతో కలిసి నిలబడ్డారు.
అమెరికా తన యుద్ధ నౌకను దక్షిణ చైనా సముద్రంలో సిద్ధంగా ఉంచింది..
విషయం పూర్తిగా అర్ధమైన  చైనా భారత్ తో చర్చలకు ప్రయత్నించింది.

ఈసారి సంభాషణల బాధ్యతను  అజిత్ దోవల్ (పిఎం జాతీయ భద్రతా సలహాదారు)కు అప్పగించారు. చైనా అజిత్ దోవల్ తో చర్చలకు ముందుగా నిరాకరించింది..

నేరుగా జింపింగ్ మోడీతో మాట్లాడాలని అనుకున్నారు కానీ మోడీ మాట్లాడటానికి నిరాకరించారు.. తప్పని పరిస్తితిలో  చైనా విదేశాంగ మంత్రి డోవల్‌తో మాట్లాడవలసి వచ్చింది..అజిత్ దోవల్ గారి స్థాయి  చైనా విదేశాంగ మంత్రి కంటే తక్కువ కనుక భారత్ విదేశాంగ శాఖామంత్రి జయశంకర్ గారితో మాట్లాడతామని చైనా ప్రతిపాధించిది..భారత విదేశాంగ శాఖ సింపుల్ గా మాట్లాడితే అజిత్ దోవల్ గారితో మాట్లాడండి లేకుంటే లేదు అని స్పష్టంగా నోట్ పంపింది.. చైనా ఈ అవమానాన్ని దిగమింగుకొని అజిత్ దోవల్ గారితో చర్చలకు ఒప్పుకుంది..
 జూలై 5 న చైనా, ఇరాన్ మరియు పాకిస్తాన్ లు భారత్ మీద చేయాలనుకున్న  సామూహిక దాడి బ్లూ ప్రింట్ ను చైనా విదేశాంగ మంత్రికి అజిత్ దోవల్ అందజేశారు.. ఇది చైనా నోట్లో పచ్చివెలక్కాయ పడ్డంత పనైంది.. ఇక తప్పనిసరి పరిస్తితిలో  వారి సైన్యాన్ని వెనక్కు పిలవడానికి అంగీకరించింది ఇంకా  భవిష్యత్తులో దాడి చేయదని హామీ ఇచ్చింది...
ఖేల్ ఖతం.. చైనా పాకిస్తాన్‌ను ఒంటరిగా వదిలివేసిందని  ఇప్పుడు పాకిస్తాన్ చైనాపై కోపంగా ఉంది..అలాగే ఇరాన్ తమ ఒరిజినల్ ముసుగు తొలగిపోయిందని లోలోన కుతకుతా ఉడికిపోతుంది..
మోడీజీ సరిహద్దుల్లో యుద్ధం చేయకుండానే గెలవడం..ఉద్రిక్తలు తగ్గించినందుకు భారతదేశ ప్రతిపక్షం ( చైనా ఏజెంట్లు ) కూడా కోపంగా ఉన్నారు..ఎందుకంటే వారికి కావలసిన సమాచారాన్ని మనం ఇవ్వలేదు పైగా వాళ్ళ యజమాని కూడా వీళ్ళని పచ్చిబూతులు తిడుతున్నాడు..  ఒకవేళ యుద్ధం అంటూ  జరిగితే, చైనా దాడి మోడీజీ లేదా మోడీజీ  భక్తుల పైన మాత్రమే  కాదు, మొత్తం భారతదేశం మరియు భారతీయులపై ఉంటుందని భారతదేశంలోని కొన్ని మూర్ఖ ప్రతిపక్ష పార్టీలు మర్చిపోయాయి..
మోడీజీ దౌత్యపరంగా ప్రపంచంలోని అగ్రరాజ్యాలతో స్నేహం కుదుర్చుకొని ఉండకపోతే..అలాగే సైన్యాన్ని సదా సిద్దంగా ఉంచకపోతే ఈపాటికి భారత్ మొత్తం నగరాల్లో..సరిహద్దుల్లో..మనమధ్యే ఉన్న దేశద్రోహులు పేల్చే బాంబులూ బుల్లెట్లతో రక్తం ఓడుతూ ఉండేది..
ప్రధాని మోడీజీ దౌత్యనీతికి..ధైర్యసాహసాలకూ..ప్రాప్తకాలజ్ణతకూ ధన్యవాదాలు..ఆయన దౌత్యం కారణంగా, ఈ రోజు మనం చైనా, ఇరాన్, పాకిస్తాన్ లతో కలిసి పోరాడటంలో విజయం సాధించాము..వాళ్ళను బలవంతంగా వెనక్కి నెట్టాము..
పాము ఎన్నటికీ పామే అని ఛైనానే కాదు ఇరాన్ కూడా నిరూపించుకుంది...
జైహింద్..భారత్ మాతాకీ జయ..

Modi's journey with  time


















show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...